...
...
Next Story

Siri Hanmanth: ఇన్‌స్టా సబ్‌స్క్రిన్షన్‌లోకి ఎంటరైన జబర్దస్త్ బ్యూటీ సిరి హన్మంత్.. ఆ ఫొటోలు, వీడియోలకు డబ్బివ్వాల్సిందే

Siri Hanmanth: బిగ్‌బాస్, జబర్దస్త్ ఫేమ్ సిరి హన్మంతు సోషల్ మీడియా వేదికగా సరికొత్త నిర్ణయం తీసుకుంది. తన వ్యక్తిగత విశేషాలు, ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ కోసం ఇన్‌స్టాగ్రామ్ లో 'పెయిడ్ సబ్‌స్క్రిప్షన్' ఫీచర్‌ను ప్రారంభించి అభిమానులకు షాకిచ్చింది.

Published on: May 6, 2026, 09:28:51 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Siri Hanmanth: టెలివిజన్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి, యూట్యూబర్ సిరి హన్మంతు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. జబర్దస్త్ కామెడీ షోతో కెరీర్ ప్రారంభించి, బిగ్‌బాస్ తెలుగు సీజన్-5తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో కొత్త ట్రెండ్‌కు తెరలేపారు. సెలబ్రిటీలు సోషల్ మీడియాను కేవలం పబ్లిసిటీ కోసమే కాకుండా, ఆదాయ వనరుగా మార్చుకుంటున్న క్రమంలో సిరి కూడా ఒక అడుగు ముందుకు వేశారు.

సబ్‌స్క్రిప్షన్ ఉంటేనే ఆ ముచ్చట్లు

Siri Hanmanth: ఇన్‌స్టా సబ్‌స్క్రిన్షన్‌లోకి ఎంటరైన జబర్దస్త్ బ్యూటీ సిరి హన్మంత్.. ఆ ఫొటోలు, వీడియోలకు డబ్బివ్వాల్సిందే
Siri Hanmanth: ఇన్‌స్టా సబ్‌స్క్రిన్షన్‌లోకి ఎంటరైన జబర్దస్త్ బ్యూటీ సిరి హన్మంత్.. ఆ ఫొటోలు, వీడియోలకు డబ్బివ్వాల్సిందే

సాధారణంగా సెలబ్రిటీలు తమ ఫోటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో ఉచితంగా షేర్ చేస్తుంటారు. కానీ ఈమధ్య కొందరు సబ్‌స్క్రిప్షన్ పేరుతో డబ్బు వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా యాంకర్ విష్ణుప్రియ దీనిని మొదలుపెట్టగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే దీనిని మిగిలిన వాళ్లు కూడా ఫాలో అవుతున్నారు.

తాజాగా సిరి హన్మంతు 'ఇన్‌స్టాగ్రామ్ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్' (Instagram Paid Subscription) విధానాన్ని అమలులోకి తెచ్చారు. అంటే ఆమె షేర్ చేసే కొన్ని ప్రత్యేకమైన ఫోటోలు, బిహైండ్ ద సీన్స్ వీడియోలు చూడాలంటే నెటిజన్లు నిర్ణీత రుసుము చెల్లించి సబ్‌స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే హాలీవుడ్, బాలీవుడ్ తారలు అనుసరిస్తున్న ఈ ట్రెండ్‌ను ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడా అందిపుచ్చుకుంటున్నారు.

నెలవారీ ఛార్జీలు ఎంతంటే?

సిరి హన్మంతు తన ఎక్స్‌క్లూజివ్ కంటెంట్‌ను యాక్సెస్ చేయడానికి నెలకు రూ. 449 గా ధర నిర్ణయించినట్లు సమాచారం. ఈ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వారికి మాత్రమే ఆమె పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన అప్‌డేట్స్, స్పెషల్ లైవ్ సెషన్స్ అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా సబ్‌స్క్రైబర్లు పంపే మెసేజ్‌లకు ఆమె ప్రాధాన్యత ఇచ్చి రిప్లై ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే వీరాభిమానుల కోసం ఇదొక 'వీఐపీ పాస్' లాంటిది.

డబ్బులు పెట్టడం అవసరమా? నెటిజన్ల రియాక్షన్

అయితే కంటెంట్ క్రియేటర్లకు ఇదొక గౌరవప్రదమైన ఆదాయ మార్గమని టెక్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. యూట్యూబ్‌లో జాయిన్ బటన్ లాగే, ఇన్‌స్టాగ్రామ్ కూడా క్రియేటర్లకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఈ ఫీచర్‌ను తీసుకొచ్చింది.

ట్రెండ్ సెట్ చేస్తున్న సిరి..

తెలుగు బుల్లితెర తారల్లో ఈ తరహా పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ఫీచర్‌ను ధైర్యంగా ముందుకు తీసుకెళ్తున్న వారిలో సిరి కూడా నిలిచారు. ఇప్పటికే విష్ణుప్రియ, అనన్య నాగాళ్లలాంటి వాళ్లు ఇందులో ఉండగా.. సిరి కూడా చేరింది. బిగ్ బాస్ షోతో పాపులర్ అయి.. తర్వాత ఈటీవీ జబర్దస్త్ తోనూ పేరు సంపాదించి ఇప్పుడు వెబ్ సిరీస్‌లు, సినిమాలతో బిజీగా ఉంటోందీ బ్యూటీ. మరి తన డిజిటల్ ఫ్యాన్ బేస్‌ను ఒక వ్యాపార మార్గంగా మలుచుకోవడంలో ఆమె సక్సెస్ అవుతారో లేదో కాలమే నిర్ణయించాలి.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. సిరి హన్మంతు ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ ధర ఎంత?

సిరి హన్మంతు తన ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ కోసం నెలకు సుమారు రూ. 449 ఛార్జ్ చేస్తున్నారు. (ధరల్లో మార్పులు ఉండవచ్చు).

2. ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

సాధారణ ఫాలోవర్లకు కనిపించని ప్రత్యేకమైన ఫోటోలు, వీడియోలు, లైవ్ సెషన్లు, పర్సనల్ చాట్ ఆప్షన్లు సబ్‌స్క్రైబర్లకు లభిస్తాయి.

3. అందరు సెలబ్రిటీలు ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్ ట్రెండ్ ఫాలో అవుతున్నారా?

ప్రస్తుతానికి కొంతమంది ప్రముఖులు మాత్రమే ఈ ఫీచర్‌ను వాడుతున్నారు. కానీ రాబోయే రోజుల్లో మెజారిటీ సెలబ్రిటీలు దీనివైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe