...
...
Next Story

Karuppu Trisha: త్రిష సినిమాకు షాక్.. రిలీజ్ రోజే మార్నింగ్ షోలు క్యాన్సిల్.. సీఎం విజయ్ పర్మిషన్ ఇచ్చినా.. రీజన్ ఇదే

Karuppu Trisha: సూర్య, త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన 'కరుప్పు' చిత్రానికి ఊహించని అడ్డంకి ఎదురైంది. సాంకేతిక కారణాలతో ఉదయం ఆటలు రద్దవ్వడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. సీఎం విజయ్ పర్మిషన్ ఇచ్చినా ఉదయం 9 గంటల షోలు క్యాన్సిల్ అయ్యాయి.

Published on: May 14, 2026, 10:38:18 IST
Advertisement

Karuppu Trisha: స్టార్ హీరో సూర్య, స్టార్ హీరోయిన్ త్రిష కాంబినేషన్‌లో వస్తున్న 'కరుప్పు' చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే బుధవారం రాత్రి నుంచి ఈ సినిమా విడుదలపై సందిగ్ధత నెలకొంది. మే 14న ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సిన షోలను రద్దు చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ అనూహ్య పరిణామంతో థియేటర్ల వద్దకు చేరుకున్న అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

కరుప్పుకు షాక్

కరుప్పు పోస్టర్ లో సూర్య, త్రిష (x/RJ_Balaji)
కరుప్పు పోస్టర్ లో సూర్య, త్రిష (x/RJ_Balaji)

త్రిష, సూర్య జంటగా నటించిన కరుప్పు మూవీకి షాక్ తగిలింది. ఈ మూవీ ఇవాళ (మే 14) రిలీజ్ కావాల్సి ఉంది. అయితే మార్నింగ్ 9 గంటలకు ప్రారంభం కావాల్సిన స్పెషల్ షోలు రద్దు అయ్యాయి. తెలుగులో దీన్ని వీరభద్రుడు టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు.

నిర్మాత సారీ

ఈ ఆకస్మిక రద్దుపై నిర్మాత ఎస్.ఆర్. ప్రభు ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. "అనివార్య కారణాల వల్ల కరుప్పు సినిమా 9 గంటల షోలను రద్దు చేస్తున్నాం. దీనివల్ల ఇబ్బంది పడ్డ ప్రతి ఒక్కరికీ మా హృదయపూర్వక క్షమాపణలు తెలుపుకుంటున్నాం" అని ఆయన తన పోస్ట్‌లో రాశారు.

విజయ్ పర్మిషన్

ఇటీవల తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆయన ముఖ్యమంత్రి కాగానే కరుప్పు మూవీ స్పెషల్ షోలకు పర్మిషన్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ షోలు రద్దు అయ్యాయి.

32 నెలల సుదీర్ఘ నిరీక్షణ

కరుప్పు సినిమా ఎదుర్కొంటున్న సమస్యలపై దర్శకుడు, నటుడు ఆర్జే బాలాజీ కూడా భావోద్వేగంగా స్పందించారు. గడిచిన 32 నెలలుగా ఈ ప్రాజెక్టు ఎన్నో ఆటంకాలను దాటుకుంటూ వచ్చిందని ఆయన గుర్తు చేశారు.

ఇటీవల విడుదలైన కరుప్పు సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. ఒక వృద్ధుడు, అతని మనవరాలు న్యాయం కోసం ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో త్రిష బాధితుల తరపున వాదించే లాయర్‌గా కనిపిస్తుండగా, ఆర్జే బాలాజీ క్యారెక్టర్ ఆమెకు వ్యతిరేకంగా ఉంటుంది. ఇక సూర్య పాత్ర ఎంట్రీతో కథ మలుపు తిరుగుతుంది. అన్యాయాన్ని ఎదిరించే పవర్‌ఫుల్ పాత్రలో సూర్య తనదైన నటనతో ఆకట్టుకోనున్నారు.

ఆర్జే బాలాజీ స్వయంగా కథ అందించి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఇంద్రన్స్, నట్టి, స్వాసిక, శివద, అనఘా మాయా రవి, సుప్రీత్ రెడ్డి కీలక పాత్రలు పోషించారు. సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. కోర్ట్‌రూమ్ డ్రామాతో పాటు యాక్షన్ అంశాలు ఈ మూవీలో పుష్కలంగా ఉన్నాయి.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

ప్రశ్న: కరుప్పు సినిమా ఎందుకు ఆలస్యమైంది?

జవాబు: సాంకేతిక, కొన్ని అనివార్య కారణాల వల్ల ఉదయం షోలు రద్దయ్యాయి. సమస్యను పరిష్కరించేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.

ప్రశ్న: ఈ సినిమాలో సూర్య పాత్ర ఏమిటి?

జవాబు: సూర్య ఇందులో కోర్టు లోపల, బయట అన్యాయంపై పోరాడే ఒక శక్తివంతమైన పాత్రలో కనిపిస్తున్నారు.

ప్రశ్న: ఈ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరు?

జవాబు: యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ 'కరుప్పు' చిత్రానికి సంగీతం సమకూర్చారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe