...
...
Next Story

Vishwanath and sons collections: 2 రోజుల్లోనే రూ.100 కోట్లు..విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ సక్సెస్ కు 5 కారణాలు..లుక్కేయండి!

Vishwanath and sons collections: స్టార్ హీరో సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వచ్చిన ఫ్యామిలీ డ్రామా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమా రూ.100 కోట్ల గ్రాస్ మార్కును దాటి సంచలనం సృష్టించింది. మరి మూవీ సక్సెస్ కు 5 కారణాలేంటో చూసేయండి.

Published on: Aug 17, 2026, 11:26:35 IST
Advertisement

Vishwanath and sons collections: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సరికొత్త బాక్సాఫీస్ రికార్డులతో థియేటర్ల వద్ద తన తిరుగులేని స్టార్ పవర్‌ను నిరూపించుకుంటున్నారు. ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'విశ్వనాథ్ అండ్ సన్స్' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన కేవలం రెండు రోజుల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్ల మైలురాయిని అధిగమించింది.

2 రోజుల్లోనే రూ.100 కోట్లు..విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ సక్సెస్ కు 5 కారణాలు..లుక్కేయండి! (x/SitharaEnts)
2 రోజుల్లోనే రూ.100 కోట్లు..విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ సక్సెస్ కు 5 కారణాలు..లుక్కేయండి! (x/SitharaEnts)

సూర్య సినీ కెరీర్‌లోనే అత్యంత వేగంగా వంద కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రంగా విశ్వనాథ్ అండ్ సన్స్ సరికొత్త రికార్డును లిఖించింది. వివిధ భాషల్లో లభించిన భారీ ఆదరణ, సెలవుల కాలం కలిసిరావడం, కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టడం ఈ భారీ విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.

సూర్య తిరుగులేని క్రేజ్, స్టార్ పవర్

ఈ ఏడాది ఆరంభంలోనే కరుప్పు సాలిడ్ హిట్‌తో ఫామ్‌లోకి వచ్చిన సూర్య, అదే జోరును ఈ సినిమాతోనూ కొనసాగించారు. ఆయనకున్న అపారమైన అభిమానగణంతో పాటు బాక్సాఫీస్ వద్ద ఉన్న నమ్మకం కారణంగా మొదటి రోజు నుంచే థియేటర్లన్నీ హౌస్‌ఫుల్ బోర్డులతో కళకళలాడాయి.

సెలవుల కాలం కలిసిరావడం

స్వాతంత్య్ర దినోత్సవ వీకెండ్ లో ఈ సినిమాను విడుదల చేయడం నిర్మాతలకు భారీగా కలిసివచ్చింది. లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ వల్ల గురువారం ప్రీమియర్లతో మొదలై, హాలిడే అయిన శనివారం వరకు ప్రతి షోకు ప్రేక్షకుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇది వసూళ్లు వేగంగా పెరగడానికి దోహదం చేసింది.

రెండు ప్రధాన మార్కెట్లలోనూ

దర్శకుడు వెంకీ అట్లూరి ఈ చిత్రాన్ని కేవలం యాక్షన్ ప్రియుల కోసమే కాకుండా, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా అద్భుతంగా మలిచారు. భావోద్వేగాలతో కూడిన ఈ కథాంశం సాధారణ ప్రేక్షకులు, కపుల్స్, కుటుంబాలు అందరూ కలిసి చూసేలా ఉండటంతో థియేటర్లకు వచ్చే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

ఆకట్టుకున్న కెమిస్ట్రీ

సూర్య సరసన క్రేజీ నటి మమితా బైజు కథానాయికగా నటించడం ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. వెండితెరపై వీరిద్దరి మధ్య కుదిరిన తాజా కెమిస్ట్రీ, నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దీనిపై సోషల్ మీడియాలో వస్తున్న పాజిటివ్ టాక్, మంచి రివ్యూలు సినిమా కలెక్షన్లు మరింత పెరగడానికి కారణమయ్యాయి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe