బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణించి ఐదేళ్లు గడిచిపోయాయి. కానీ ఇప్పటికే అతని మరణంపై అనుమానాలు మాత్రం వీడటం లేదు. అతనిది ఆత్మహత్య కాదని, ఇద్దరు కలిసి చంపారని తనకు ఇద్దరు మానసిక నిపుణులు తెలిపినట్లు ఓ ఇంటర్వ్యూలో సుశాంత్ అక్క శ్వేత సింగ్ చెప్పడం సంచలనం రేపుతోంది.
సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదు

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ 2020 జూన్ లో చనిపోయాడు. అతనిది ఆత్మహత్యే అని పోలీసులు తేల్చారు. సీబీఐ, ఈడీ, నార్కోటిక్స్ బ్యూరోలాంటి సెంట్రల్ ఏజెన్సీలు కూడా రంగంలోకి దిగినా.. అతని మరణంలో ఎలాంటి అనుమానాలు లేవని తేల్చాయి. అయితే తాజాగా సుశాంత్ అక్క శ్వేతా చేసిన ఆరోపణలు మాత్రం సంచలనం రేపుతున్నాయి.
సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదని, అక్కడ బెడ్ కు, ఫ్యాన్ కు మధ్య ఉన్న దూరం చూస్తే అది స్పష్టంగా అర్థమవుతోందని చెప్పింది. అతని మెడపైనా ఉరేసుకున్నప్పుడు దుపట్టా గుర్తు కాకుండా ఓ చిన్న చెయిన్ గుర్తు కనిపించిందని తెలిపింది.
ఇద్దరు కలిసి చంపారు
సుశాంత్ చనిపోయిన తర్వాత తాను అమెరికాలో ఒకరు, ముంబైలో మరొకరు మానసిక నిపుణులను తాను సంప్రదించానని, వాళ్లు ఇది ఆత్మహత్య కాదు ఇద్దరు కలిసి హత్య చేశారని వాళ్లు చెప్పారని శ్వేత వెల్లడించింది. వాళ్లు ఒకరికొకరు ఎవరో తెలియకపోయినా.. ఇద్దరూ ఒకేలా చెప్పడం తనకు ఆశ్చర్యం కలిగించిందని శ్వేత తెలిపింది. అతడు ఆత్మహత్య చేసుకోలేదు.. ఇద్దరు కలిసి హత్య చేశారు అని అమెరికా వ్యక్తి చెప్పగా.. ఇక్కడ ముంబైలోని వ్యక్తి కూడా అచ్చూ అలాగే చెప్పారని శ్వేత చెప్పింది.
చేతబడి చేశారని అన్నారు
సుశాంత్ సింగ్ రాజ్పుత్ కెరీర్లో చాలా వేగంగా ఎదగడం చూసి ఎవరో ఓర్వలేక చేతబడి చేయించినట్లు కూడా తమకు కాల్స్ వచ్చాయని శ్వేత తెలిపింది. 2020 మార్చి తర్వాత అతడు బతకడని తమకు ఫోన్ కాల్స్ వచ్చాయని, అయితే బాగా చదువుకున్న కుటుంబం కావడంతో తాము వాటిని మొదట నమ్మలేదని ఆమె తెలిపింది. అయితే ఆ తర్వాత తనకు ప్రతిదీ సందేహం కలిగించేలా ఉండి ప్రశ్నించడం మొదలుపెట్టానని చెప్పింది.
{{/usCountry}}సుశాంత్ సింగ్ రాజ్పుత్ కెరీర్లో చాలా వేగంగా ఎదగడం చూసి ఎవరో ఓర్వలేక చేతబడి చేయించినట్లు కూడా తమకు కాల్స్ వచ్చాయని శ్వేత తెలిపింది. 2020 మార్చి తర్వాత అతడు బతకడని తమకు ఫోన్ కాల్స్ వచ్చాయని, అయితే బాగా చదువుకున్న కుటుంబం కావడంతో తాము వాటిని మొదట నమ్మలేదని ఆమె తెలిపింది. అయితే ఆ తర్వాత తనకు ప్రతిదీ సందేహం కలిగించేలా ఉండి ప్రశ్నించడం మొదలుపెట్టానని చెప్పింది.
{{/usCountry}}ఇక ఇదే ఇంటర్వ్యూలో సుశాంత్ మాజీ గర్ల్ఫ్రెండ్ రియా చక్రవర్తి గురించి కూడా శ్వేత మాట్లాడింది. ఆమె ఒక సందర్భంలో ఇన్స్టాలో ఒక కవిత షేర్ చేసిందని, దానిని సుశాంత్ కూడా లైక్ చేసినా తనకు వింతగా అనిపించిందని తెలిపింది. నువ్వు చాలా వేగంగా పైకి ఎగురుతున్నావ్.. నీ రెక్కలు కత్తిరించాల్సిందే అని ఆ కవిత ఉద్దేశంగా ఉందని, అది తనకు వింతగా అనిపించినట్లు శ్వేత చెప్పింది.
సుశాంత్ సింగ్ రాజ్పుత్ 2020, జూన్ 14న ఆత్మహత్య చేసుకున్నాడు. 34 ఏళ్ల వయసులోనే అతడు ఇలా కన్నుమూయడం దేశాన్ని షాక్ కు గురి చేసింది. బాలీవుడ్ లో చాలా వేగంగా ఎదుగుతున్న అలాంటి నటుడు ఆత్మహత్య చేసుకోవడం ఏంటి అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇదే కోణంలో దర్యాప్తు జరిగినా అతని మరణంలో ఎలాంటి అనుమానాలు లేవని అన్ని దర్యాప్తు సంస్థలు తేల్చాయి.