Sushmita Sen: 24 ఏళ్లకే తల్లిగా.. పారిపోయిన మేనేజర్.. సైడ్ క్యారెక్టర్లూ రావన్నారు.. సుస్మితా సేన్ షాకింగ్ విషయాలు
Sushmita Sen: మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్ తన జీవితంలోని షాకింగ్ విషయాలను బయటపెట్టింది. 24 ఏళ్లకే తల్లిగా మారడంతో మేనేజర్ పారిపోయాడని వెల్లడించింది. అప్పటి చేదు జ్ణాపకాలను పంచుకుంది. పూర్తి విషయాలు ఇక్కడ చూసేయండి.
Sushmita Sen: సినీ పరిశ్రమలో ఎలాంటి గాడ్ఫాదర్స్ లేకుండా, సొంత కష్టంతో అగ్ర నటిగా ఎదిగింది సుస్మితా సేన్. కేవలం వెండితెరపైనే కాకుండా, నిజ జీవితంలోనూ ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంది. అందులో అత్యంత ముఖ్యమైంది కేవలం 24 ఏళ్ల వయసులోనే ఒక బిడ్డను దత్తత తీసుకుని సింగిల్ మదర్గా మారడం. దీనికి సంబంధించిన సంచలన విషయాలను సుస్మితా బయటపెట్టింది.

కుమార్తెను దత్తత
కెరీర్ పీక్ లో ఉన్నప్పుడే 2000 సంవత్సరంలో సుస్మితా సేన్ తన పెద్ద కుమార్తె రేనీ సేన్ను దత్తత తీసుకుంది. అప్పుడు సొసైటీ నుంచే కాకుండా, బాలీవుడ్ పరిశ్రమ నుంచి కూడా ఊహించని స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ రోజుల్లో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను సుస్మితా సేన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకుంది.
మేనేజర్ పారిపోయాడు
ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సుస్మితా సేన్ ఆనాటి పరిస్థితులను సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక బిడ్డను దత్తత తీసుకోవాలనే తన నిర్ణయం పరిశ్రమలో ఉన్న వారిని ఎంతగా షాక్కు గురిచేసిందో ఆమె వివరించింది.
"దత్తత తీసుకోవాలనే నా నిర్ణయం వినగానే మేనేజర్ నన్ను వదిలేసి పారిపోయాడు. ‘నువ్వు నీ కెరీర్ గురించి అస్సలు సీరియస్గా లేవు. 24 ఏళ్లకే తల్లి అయిన ఒక నటికి నేను మేనేజర్గా ఉండలేను’ అని అతను మొహం మీదే చెప్పేశాడు. ‘ఇకపై నీకు సినిమాల్లో కనీసం క్యారెక్టర్ రోల్స్ కూడా దక్కవు’ అని హెచ్చరించాడు’’ అని సుస్మితా వెల్లడించింది.
నేనేమీ భయపడలేదు
‘‘మేనేజర్ వెళ్లిపోవడంతో ఒక పీడకల వదిలిపోయిందని నేను ఊపిరి పీల్చుకున్నాను. ఆ మాటలకు నేనేమీ భయపడలేదు. నా నిర్ణయంపై నాకు నమ్మకం ఉంది. కానీ అసలు విచిత్రం ఏంటంటే, నేను తల్లి అయిన తర్వాతే నా కెరీర్లోనే అతిపెద్ద హిట్ సినిమాలు ఇచ్చాను" అని సుస్మితా సేన్ గర్వంగా చెప్పుకొచ్చింది.
గాడ్ ఫాదర్స్ లేరు
బాలీవుడ్లో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒంటరిగా పోరాడి గెలిచిన విషయాన్ని సుస్మిత ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది. "పరిశ్రమలో రాణించడానికి ఇతరులు కొన్ని నియమాలు పెడతారు. వాటిని పాటించడం లేదా వదిలేయడం పూర్తిగా మన ఇష్టం. నేను స్వయంకృషితో పైకి వచ్చిన మహిళను. నాకు గాడ్ఫాదర్స్ లేరు. నాకు ఎవరూ రెడీమేడ్ వేదికను ఇవ్వలేదు. నా కష్టంతోనే నేను ప్రతి ఒక్కటీ సాధించుకున్నా’’ అని సుస్మితా పేర్కొంది.
నా రూల్స్ ను నేనే
‘‘నాకు ఇతరుల నియమాలు వర్తించవు. నా రూల్స్ ను నేనే రాసుకుంటా. చిన్న వయసులోనే తల్లి కావాలనేది నా సొంత నిర్ణయం. ఆ బిడ్డకు ఎలాంటి లోటూ లేకుండా ఉత్తమమైన బాల్యాన్ని అందించాలని నేను బలంగా ఆశించాను. నా నమ్మకమే నన్ను నిలబెట్టింది. దేవుడి దయ వల్ల అంతా మంచే జరిగింది" అని సుస్మిత వివరించింది.
సూపర్ హిట్ సినిమాలు
అప్పట్లో మేనేజర్ అన్న మాటలను తలకిందులు చేస్తూ సుస్మితా సేన్ తల్లి అయిన తర్వాతే బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకుంది. షారుఖ్ ఖాన్తో కలిసి నటించిన ‘మై హూ నా’ (2004), సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్లతో నటించిన ‘మైనే ప్యార్ క్యూ కియా’ (2005) వంటి చిత్రాలు ఆమె కెరీర్లోనే అతిపెద్ద హిట్లుగా నిలిచాయి.
విశ్వసుందరి
1994లో మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకున్న సుస్మితా సేన్.. 2000లో రేనీ సేన్ను దత్తత తీసుకోగా, ఆ తర్వాత 2010లో అలీసా అనే మరో అమ్మాయిని దత్తత తీసుకుంది. సింగిల్ మదర్గా ఇద్దరు కుమార్తెలను ఆమె ఎంతో అద్భుతంగా పెంచింది. ఆమె పెద్ద కుమార్తె రేనీ 2021లో ఒక షార్ట్ ఫిలిం ద్వారా నటన రంగంలోకి అడుగుపెట్టింది.
వెబ్ సిరీస్ తో
సినిమాలకు కొంతకాలం బ్రేక్ ఇచ్చిన సుస్మిత.. 2020లో ‘ఆర్య’ వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ దునియాలోకి గ్రాండ్ కమ్బ్యాక్ ఇచ్చింది. జియోహాట్స్టార్లో స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్లో తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి నేర ప్రపంచంతో పోరాడే తల్లిగా ఆమె నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సిరీస్ మొదటి సీజన్ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డ్స్లో ఉత్తమ డ్రామా సిరీస్ కేటగిరీలో నామినేషన్ కూడా పొందింది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ప్రశ్న 1: సుస్మితా సేన్ తన కుమార్తెలను ఎప్పుడు దత్తత తీసుకుంది?
జవాబు: సుస్మితా సేన్ 2000 సంవత్సరంలో తన 24 ఏళ్ల వయసులో పెద్ద కుమార్తె రేనీ సేన్ను దత్తత తీసుకుంది. ఆ తర్వాత 2010లో అలీసా అనే మరో బాలికను దత్తత తీసుకుంది.
ప్రశ్న 2: తల్లి అయిన తర్వాత సుస్మితా సేన్ నటించిన హిట్ సినిమాలు ఏవి?
జవాబు: బిడ్డను దత్తత తీసుకున్న తర్వాత సుస్మితా సేన్ కెరీర్లో పెద్ద హిట్లు సాధించారు. షారుఖ్ ఖాన్తో నటించిన 'మై హూ నా' (2004), సల్మాన్ ఖాన్తో కలిసి నటించిన 'మైనే ప్యార్ క్యూ కియా' (2005) అందులో ముఖ్యమైనవి.
ప్రశ్న 3: సుస్మితా సేన్ నటించిన 'ఆర్య' వెబ్ సిరీస్ ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది?
జవాబు: సుస్మితా సేన్ నటించిన సూపర్ హిట్ క్రైమ్ డ్రామా సిరీస్ 'ఆర్య' (Aarya) జియోహాట్స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతోంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


