బాలీవుడ్ విలక్షణ దర్శకుడు విశాల్ భరద్వాజ్, స్టార్ హీరో షాహిద్ కపూర్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ సినిమా 'ఓ రోమియో' (O Romeo). ఫిబ్రవరి 13న వాలెంటైన్స్ డే ముందు రోజు విడుదలవుతున్న ఈ రొమాంటిక్ డ్రామాలో తృప్తి దిమ్రి హీరోయిన్గా నటిస్తుండగా.. దిశా పటాని, అవినాష్ తివారీ, నానా పటేకర్ వంటి స్టార్లు ఉన్నారు. అయితే ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. ఇందులో కీలక పాత్రలు పోషించిన స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా, హీరో విక్రాంత్ మస్సీ ఒక్క రూపాయి తీసుకోకుండా నటించారట.
విక్రాంత్ మస్సీ ఇచ్చిన మాట..

'12th ఫెయిల్' సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న విక్రాంత్ మస్సీ.. ఇప్పుడు పెద్ద స్టార్. కానీ అతను స్టార్ కాకముందే, అప్పుడప్పుడే అవకాశాల కోసం చూస్తున్న రోజుల్లో విశాల్ భరద్వాజ్కు ఈ సినిమా చేస్తానని మాటిచ్చాడట. ఇప్పుడు స్టార్ ఇమేజ్ వచ్చినా, ఆ పాత మాటను నిలబెట్టుకుని రెమ్యునరేషన్ తీసుకోకుండా నటించాడు. విశాల్ భరద్వాజ్ తీసిన 'మక్బూల్' (Maqbool) సినిమా చూసే తాను ఇండస్ట్రీకి వచ్చానని, ఆ సినిమా తన జీవితాన్ని మార్చేసిందని విక్రాంత్ చెప్పాడు. అందుకే ఈ సినిమాలో 8 నుంచి 9 రోజుల పాటు ఉచితంగా పనిచేశానని విక్రాంత్ తెలిపాడు.
బడ్జెట్ లేదని చెబితే.. తమన్నా గొప్ప మనసు
ఇక మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా విషయానికి వస్తే.. ఆమె పాత్ర ఈ సినిమాలో చాలా కీలకం. కథలో వచ్చే ఒక ప్రధానమైన ట్విస్ట్ ఆమె పాత్ర ద్వారానే రివీల్ అవుతుంది. సినిమా బడ్జెట్ పరిమితుల దృష్ట్యా ఆమెకు రెమ్యునరేషన్ ఇవ్వలేమని చెప్పినప్పుడు, ఆమె ఒక్క మాట కూడా మాట్లాడకుండా నటించడానికి ఒప్పుకుంది.
కేవలం నటించడమే కాదు, తన పాత్ర కోసం వర్క్షాప్లు, రిహార్సల్స్లో కూడా పాల్గొందట. అనుకున్న దానికంటే ఎక్కువగా దాదాపు 12 రోజుల పాటు ఆమె షూటింగ్ చేసింది. తమన్నా, విక్రాంత్ చూపిన ఈ దాతృత్వం సినిమాపై చెరగని ముద్ర వేసిందని దర్శకుడు కొనియాడాడు.
హ్యాట్రిక్ హిట్ కాంబో, కోర్టు వివాదం
విశాల్ భరద్వాజ్, షాహిద్ కపూర్లది హిట్ కాంబినేషన్. వీరిద్దరూ కలిసి గతంలో 'కమీనే', 'హైదర్' వంటి క్లాసిక్ హిట్స్ ఇచ్చారు. ఇది వీరిద్దరి కలయికలో వస్తున్న మూడో మూవీ కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి.
{{/usCountry}}విశాల్ భరద్వాజ్, షాహిద్ కపూర్లది హిట్ కాంబినేషన్. వీరిద్దరూ కలిసి గతంలో 'కమీనే', 'హైదర్' వంటి క్లాసిక్ హిట్స్ ఇచ్చారు. ఇది వీరిద్దరి కలయికలో వస్తున్న మూడో మూవీ కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి.
{{/usCountry}}మరోవైపు ఈ సినిమా ముంబై గ్యాంగ్స్టర్ హుస్సేన్ ఉస్తారా (Hussain Ustara) జీవితం ఆధారంగా తెరకెక్కినట్లు వార్తలు వస్తున్నాయి. దావూద్ ఇబ్రహీంతో గొడవపడ్డ గ్యాంగ్స్టర్ ఇతను. హుస్సేన్ జైదీ రాసిన 'మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై' పుస్తకం ఆధారంగా ఈ సినిమా తీసినట్లు సమాచారం. అయితే, ఈ సినిమా విడుదలను ఆపాలంటూ హుస్సేన్ ఉస్తారా కుమార్తె కోర్టును ఆశ్రయించగా.. సరైన ఆధారాలు చూపనందున కోర్టు ఆ పిటిషన్ను కొట్టివేసింది. దీంతో సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది.