ఓటీటీలోకి ఓ తమిళ కాంట్రవర్సీ మూవీ రాబోతోంది. టీజర్ తోనే వివాదాన్ని రేపిన ‘బ్యాడ్ గర్ల్’ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ కన్ఫామైంది. ఈ సినిమాలో బ్రాహ్మణులను చెడుగా చూపించారనే వివాదం కలకలం రేపింది. ఈ మూవీకి ప్రముఖ తమిళ డైరెక్టర్ వెట్రిమారన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
బ్యాడ్ గర్ల్ ఓటీటీ

తమిళ న్యూ ఏజ్ రొమాంటిక్ డ్రామా ‘బ్యాడ్ గర్ల్’ ఓటీటీలోకి వచ్చేస్తోంది. వెట్రిమారన్ నిర్మాతగా తెరకెక్కిన ఈ మూవీ జియోహాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. నవంబర్ 4 నుంచి తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీని చూడొచ్చు. ఈ చిత్రానికి వెట్రిమారన్ శిష్యురాలు వర్ష భరత్ డైరెక్టర్. ఆమెకు దర్శకురాలిగా ఇదే ఫస్ట్ సినిమా.
రెండు అవార్డులు
బ్యాడ్ గర్ల్ మూవీకి రెండు ఇంటర్నేషనల్ అవార్డులు దక్కాయి. ఈ సినిమా సెప్టెంబర్ 5, 2025న థియేటర్లలో రిలీజైంది. థియేటర్లలో ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. ఇందులో అంజలి శివరామన్ లీడ్ రోల్ ప్లే చేసింది. ఆమెకు డైరెక్టర్ వర్ష డబ్బింగ్ చెప్పడం విశేషం. బ్యాడ్ గర్ల్ సినిమాలో శాంతి ప్రియ, శరణ్య రవిచంద్రన్ తదితరులు నటించారు.
కథ ఏమిటంటే?
ఓ సంప్రదాయ కుటుంబానికి చెందిన అమ్మాయి రమ్య (అంజలి శివరామన్). ఆమె హై స్కూల్ డేస్ నుంచి కాలేజీ, ఆ తర్వాత లైఫ్ లోనూ సరైన పార్ట్ నర్ ను కనుక్కోవడానికి ట్రై చేస్తుంది. కానీ సామాజిక అడ్డుగోడలు, స్ట్రిక్ట్ పేరేంట్స్ అడ్డుగా నిలుస్తారు. ఈ ప్రయాణంలో రమ్యకు నిజమైన ప్రేమ కూడా దొరకదు. మరి చివరకు రమ్య ఏం చేసింది? ఆమె జర్నీ ఎక్కడి వరకూ వెళ్లిందన్నది సినిమాలో చూడాల్సిందే.
బ్యాడ్ గర్ల్ వివాదం
బ్యాడ్ గర్ల్ మూవీ టీజర్ ను 2025, జనవరి 26న రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఈ టీజర్ లో బ్రాహ్మణులను చెడుగా చూపించారనే ఆరోపణలు వచ్చాయి. చిన్న వయసులోనే మద్యానికి బానిస కావడం, ఒక సామాజిక వర్గాన్ని తప్పుగా చూపించడం లాంటి ఆరోపణలతో మూవీ కాంట్రవర్సీకి దారి తీసింది.
{{/usCountry}}బ్యాడ్ గర్ల్ మూవీ టీజర్ ను 2025, జనవరి 26న రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఈ టీజర్ లో బ్రాహ్మణులను చెడుగా చూపించారనే ఆరోపణలు వచ్చాయి. చిన్న వయసులోనే మద్యానికి బానిస కావడం, ఒక సామాజిక వర్గాన్ని తప్పుగా చూపించడం లాంటి ఆరోపణలతో మూవీ కాంట్రవర్సీకి దారి తీసింది.
{{/usCountry}}వెట్రిమారన్, అనురాగ్ కశ్యప్ తో పాటు పా.రంజిత్, విజయ్ సేతుపతిని లక్ష్యంగా చేసుకుని పర్సనల్ అటాక్స్ కూడా జరిగాయి. ఈ మూవీ టీజర్ ను సోషల్ మీడియా నుంచి డిలీట్ చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత సెన్సార్ బోర్డ్ కొన్ని సీన్లకు కత్తెర వేయడంతో ఈ మూవీ రిలీజైంది.