Crime Thriller OTT: ఓటీటీలోకి తమిళ హిట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. 7.8 ఐఎండీబీ రేటింగ్.. ఊహకందని ట్విస్టులు
Crime Thriller OTT: భరత్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ 'కాళిదాస్ 2' త్వరలో ఓటీటీ ప్రేక్షకులను పలకరించనుంది. మే 12 నుండి సన్ నెక్స్ట్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ ఇన్వెస్టిగేటివ్ డ్రామా విశేషాలు మీకోసం.
Crime Thriller OTT: క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఒక గుడ్ న్యూస్. కోలీవుడ్ హీరో భరత్ నటించిన లేటెస్ట్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ 'కాళిదాస్ 2' ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్పై సందడి చేసేందుకు సిద్ధమైంది. 2019లో వచ్చిన సూపర్ హిట్ సినిమా 'కాళిదాస్'కు సీక్వెల్గా వచ్చిన ఈ మూవీ.. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ 'సన్ నెక్స్ట్' (Sun NXT) వేదికగా మే 12 నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాకు ఐఎండీబీలో 7.8 రేటింగ్ నమోదైంది.

కాళిదాస్ 2 ఓటీటీ, స్టోరీ వివరాలు
కాళిదాస్ 2 మూవీ స్ట్రీమింగ్ వివరాలను సన్ నెక్ట్స్ శుక్రవారం (మే 8) వెల్లడించింది. “ఇంట్లోనే క్రైమ్ ఉంది.. కాళిదాస్ 2 మూవీని మే 12 నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో చూడండి” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది.
ఈ కాళిదాస్ 2 సినిమా కథ మొత్తం ఒక గేటెడ్ కమ్యూనిటీ చుట్టూ తిరుగుతుంది. న్యూ ఇయర్ వేడుకలు జరుగుతున్న సమయంలో, ఆ కాంప్లెక్స్ నుండి ఒక నాలుగేళ్ల చిన్నారి అకస్మాత్తుగా అదృశ్యం అవుతుంది. ఈ కేస్ను ఇన్వెస్టిగేట్ చేయడానికి ఇన్స్పెక్టర్ కాళిదాస్ రంగంలోకి దిగుతాడు.
అయితే విచారణ మొదలుపెట్టిన కాళిదాస్కు ఆ గేటెడ్ కమ్యూనిటీలో వింత పరిస్థితులు ఎదురవుతాయి. ముఖ్యంగా ఆ కాంప్లెక్స్ సెక్రటరీ ప్రతి ప్రశ్నకూ చాలా జాగ్రత్తగా, ఏదో దాస్తున్నట్లుగా సమాధానాలు ఇస్తుంటాడు. పోలీసులకు సాయం చేసే ఒక జూనియర్ లాయర్ కూడా అదే కాంప్లెక్స్లో ఒంటరిగా నివసిస్తుంటుంది.
ట్విస్టుల పరంపర
కేసు విచారణలో ఉండగానే డీఎస్పీ వైష్ణవి ఈ టీమ్లో చేరుతుంది. అయితే ఇన్స్పెక్టర్ కాళిదాస్, డీఎస్పీ వైష్ణవి మధ్య వృత్తిపరమైన విభేదాలు తలెత్తుతాయి. ఈ లోపే అదృశ్యమైన చిన్నారి శవమై కనిపిస్తుంది. ఆ విషాదం నుండి కోలుకోకముందే, మరో చిన్నారి నీటిలో మునిగి చనిపోవడం, ఒక డాక్టర్ టెర్రస్ పైనుండి పడి మరణించడం వంటి వరుస ఘటనలు ఆ గేటెడ్ కమ్యూనిటీని ఉలిక్కిపడేలా చేస్తాయి.
అసలు ఈ హత్యలు ఎవరు చేస్తున్నారు? ఆ గేటెడ్ కమ్యూనిటీలో దాగి ఉన్న రహస్యాలేంటి? అనే అంశాలను దర్శకుడు శ్రీ సెంథిల్ చాలా ఉత్కంఠభరితంగా తెరకెక్కించారు.
కాళిదాస్ 2 విశేషాలు
ఈ సినిమాలో భరత్ సరసన అపర్ణతి, భవాని శ్రీ నటించారు. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అజయ్ కార్తీ కనిపించగా, సంగీత మాధవన్ నాయర్ కీలక పాత్ర పోషించారు. వీరితో పాటు ప్రకాష్ రాజ్, కిషోర్, రాజా రవీంద్ర, అనంత్ నాగ్, టి.ఎం. కార్తీక్ వంటి దిగ్గజ నటులు సపోర్టింగ్ రోల్స్లో మెరిశారు.
శ్రీ సెంథిల్ కథ, దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 3న థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడీ మూవీ మే 12 నుండి మీ ఇంట్లోనే కూర్చుని చూసేందుకు అందుబాటులోకి రానుంది. "మన ఇల్లే నేరాలకు అడ్డా అయితే?" అనే ఆసక్తికరమైన పాయింట్తో సాగే ఈ సినిమాను మిస్ అవ్వకండి.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
కాళిదాస్ 2 సినిమా ఏ ఓటీటీలో విడుదల అవుతోంది?
ఈ సినిమా మే 12, 2026 నుండి 'సన్ నెక్స్ట్' (Sun NXT) ఓటీటీ యాప్లో స్ట్రీమింగ్ కానుంది.
ఇది కాళిదాస్ మూవీ మొదటి భాగానికి కొనసాగింపా?
అవును, ఇది 2019లో వచ్చిన 'కాళిదాస్' చిత్రానికి సీక్వెల్. అయితే ఇది ఒక స్టాండ్ అలోన్ సీక్వెల్, అంటే కథ పరంగా కొత్త మిస్టరీని డీల్ చేస్తుంది.
కాళిదాస్ 2 సినిమాలో నటించిన ప్రధాన నటులు ఎవరు?
భరత్ హీరోగా నటించగా, ప్రకాష్ రాజ్, కిషోర్, భవాని శ్రీ, అపర్ణతి ముఖ్య పాత్రల్లో కనిపించారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


