ఓటీటీలోకి తెలుగులోనూ వస్తున్న తమిళ రూరల్ డ్రామా.. ఆ బాల నటుడే హీరోగా.. ఐఎండీబీలో 9.6 రేటింగ్
ఓటీటీలోకి ఓ ఇంట్రెస్టింగ్ తమిళ రూరల్ డ్రామా స్ట్రీమింగ్ కు వస్తోంది. ఇది తెలుగులోనూ రానుండటం విశేషం. ఒకప్పుడు టాప్ తెలుగు సినిమాల్లో బాల నటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్ ఇందులో హీరోగా కనిపించడం విశేషం.
తెలుగులో సింహరాశి, దేవిలాంటి సినిమాల్లో బాల నటుడిగా నటించిన గుర్తింపు పొందాడు మహేంద్రన్. అతడు లీడ్ రోల్లో నటించిన సినిమా నీలకంఠ. ఈ మూవీ ఈ నెల 2న థియేటర్లలో రిలీజ్ కాగా.. వచ్చే నెల మొదటి వారంలో డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

నీలకంఠ ఓటీటీ రిలీజ్ డేట్
తమిళ రూరల్ డ్రామా అయిన నీలకంఠ జనవరి 2న థియేటర్లలో రిలీజ్ కాగా.. ఫిబ్రవరి 6 నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుంది. ఈ సినిమా తమిళంతోపాటు తెలుగులోనూ అందుబాటులోకి వస్తున్నట్లు ఆ ఓటీటీ శుక్రవారం (జనవరి 30) వెల్లడించింది.
“పవర్, కష్టాలు, విజయాలను నీలకంఠలో చూడండి. ఫిబ్రవరి 6 నుంచి కేవలం సన్ నెక్ట్స్ లో చూడండి” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. వాళ్లు శిక్షించిన మనిషి.. వాళ్ల లీడర్ గా ఎదిగాడు అనే కామెంట్ ఉన్న పోస్టర్ ను ఈ సందర్భంగా షేర్ చేసింది.
నీలకంఠ మూవీ విశేషాలు
నీలకంఠ ఓ రూరల్ డ్రామా. ఓ సాధారణ టేలర్ గా ఉన్న యువకుడు గొప్ప చదువులు చదవాలని కలలు కంటాడు. కానీ చిన్నతనంలో చేసిన ఓ తప్పు వల్ల కొన్నేళ్లపాటు ఊరు విడిచి ఎక్కడికీ వెళ్లకుండా, పైచదువులు చదవకుండా శిక్ష ఎదుర్కొంటాడు. అతడు ప్రేమించిన అమ్మాయి పైచదువుల కోసం వెళ్లిపోతుంది.
ఇలాంటి పరిస్థితుల్లో అతడు కబడ్డీ ఆడాలని నిర్ణయించుకుంటాడు. ఇది అతని జీవితాన్ని ఎలా మార్చింది? ఇంతకీ అతడు చేసిన తప్పేంటి? అన్నది ఈ నీలకంఠ సినిమాలో చూడొచ్చు.
ఈ సినిమాలో నీలకంఠ పాత్రలో మహేంద్రన్ నటించాడు. ఇక ఫిమేల్ లీడ్ గా యశ్న నటించగా.. నేహా పఠాన్, శుభలేఖ సుధాకర్ లాంటి వాళ్లు కీలకపాత్రలు పోషించారు. స్నేహా ఉల్లాల్ ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించింది. ఈ సినిమాను రాకేష్ మాధవన్ డైరెక్ట్ చేశాడు. మార్క్ ప్రశాంత్ మ్యూజిక్ అందించాడు. ఈ నీలకంఠ సినిమాను తెలుగులోనూ ఫిబ్రవరి 6 నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో చూడొచ్చు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


