తెలుగు బోల్డ్ వెబ్ సిరీస్.. ఈ ఓటీటీలో ఎక్కువ మంది చూసిన సిరీస్‌గా రికార్డు.. మీరు చూశారా లేదా?

తెలుగు బోల్డ్ వెబ్ సిరీస్ ఒకటి ఆహా వీడియో ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది. ఆ ఓటీటీలో ఎక్కువ మంది చూసిన సిరీస్ గా రికార్డు క్రియేట్ చేసింది. ఇది ఆడియెన్స్ ఫేవరెట్ గా మారిపోయిందని ఆ ఓటీటీ ఈ విషయాన్ని వెల్లడించింది.

Published on: Feb 06, 2026 9:47 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగులో బోల్డ్ కాన్సెప్ట్ తో వచ్చే మూవీస్, వెబ్ సిరీస్ తక్కువే. అయితే ఆహా వీడియో ఓటీటీలో అలాంటిదే ఓ వెబ్ సిరీస్ రికార్డు వ్యూస్ తో దూసుకెళ్తోంది. ఈ సిరీస్ పేరు 3 రోజెస్. ఈ మధ్యే ఓటీటీలోకి అడుగుపెట్టిన ఈ సిరీస్ రెండో సీజన్.. ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. మరి ఆ సిరీస్ విశేషాలు ఇక్కడ చూడండి.

తెలుగు బోల్డ్ వెబ్ సిరీస్.. ఈ ఓటీటీలో ఎక్కువ మంది చూసిన సిరీస్‌గా రికార్డు.. మీరు చూశారా లేదా?
తెలుగు బోల్డ్ వెబ్ సిరీస్.. ఈ ఓటీటీలో ఎక్కువ మంది చూసిన సిరీస్‌గా రికార్డు.. మీరు చూశారా లేదా?

3 రోజెస్ సీజన్ 2 రికార్డు

ఆహా వీడియో ఓటీటీలో 2021లో వచ్చిన బోల్డ్ వెబ్ సిరీస్ 3 రోజెస్. అప్పట్లో దీనికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో నాలుగేళ్ల తర్వాత అంటే గతేడాది చివర్లో రెండో సీజన్ ను తీసుకొచ్చారు. డిసెంబర్ 13న ప్రీమియర్ అయిన ఈ రెండో సీజన్ కు తొలి సీజన్ కంటే మంచి రెస్పాన్స్ రావడం విశేషం. దీంతో ఇది ఆహా వీడియో ప్లాట్‌ఫామ్ పై ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ గా నిలిచింది.

ఈ విషయాన్ని ఆ ఓటీటీయే తన ఎక్స్ అకౌంట్ ద్వారా శుక్రవారం (ఫిబ్రవరి 6) వెల్లడించింది. “ఇది ట్రెండింగ్ లో లేదు.. ఇది ఇప్పటికే ఫేవరెట్. 3 రోజెస్ 2 ఇప్పుడు ఆహాలో ఎక్కువ మంది చూసిన ఒరిజినల్ సిరీస్” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. ప్రస్తుతం అన్ని ఎపిసోడ్లు ఈ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

3 రోజెస్ సీజన్ 2 విశేషాలు

ఆహా వీడియోలో ఉన్న 3 సీజన్ రెండో సీజన్ లో ఈషా రెబ్బా, రాశి సింగ్, కుషిత కల్లపు, హర్ష చెముడు, సత్య, ప్రభాస్ శ్రీను, ఇనయా సుల్తానా తదితరులు నటించారు. కిరణ్ కరవల్ల డైరెక్ట్ చేశాడు. ఎస్కేఎన్ నిర్మించాడు. దీనికి షో రన్నర్ గా మారుతి ఉండటం విశేషం. రెండో సీజన్లో నాలుగు ఎపిసోడ్లు మాత్రమే ఉన్నాయి.

ఇది రీతూ, మేఘన, సృష్టి అనే ముగ్గురు అమ్మాయిల చుట్టూ తిరిగే స్టోరీ. ముంబై నేపథ్యంలో సాగుతుంది. అక్కడి లైఫ్ స్టైల్ కు తగినట్లే ఈ కొత్త సీజన్ తొలి సీజన్ కంటే మరింత బోల్డ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇందులో ముగ్గురు మహిళా పాత్రల వ్యక్తిగత సమస్యల వెనుక ఉన్న భావోద్వేగాలను కన్విన్సింగ్‌గా చూపించారు. ఈషా రెబ్బా, రాశి సింగ్, కుషిత ముగ్గురు తమ నటనతో ఎంతో మెప్పించారు. కామెడీ, ఎమోషనల్ డైలాగ్స్‌తో ఆకట్టుకున్నారు.

బోల్డ్ సీన్స్‌లో కుషిత కల్లపు గ్లామర్ డోస్‌తో అదరగొట్టింది. క్యూట్‌గా, అమాయకంగా కనిపిస్తూ అట్రాక్ట్ చేసింది. ఇక కమెడియన్ సత్య తన కామెడీతో నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లాడు. సిరీస్‌లో సత్య కామెడీ హైలెట్‌ అని చెప్పొచ్చు. ఈ వెబ్ సిరీస్ ఇంకా చూడకపోతే వెంటనే ఆహా వీడియో ఓటీటీలో చూసేయండి.