నేరుగా ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్.. డైలాగులు లేకుండానే..
ఓటీటీలోకి ఓ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ వస్తోంది. ఈ సినిమా తమిళంలోనూ స్ట్రీమింగ్ కానుంది. తాజాగా సోమవారం (నవంబర్ 17) ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ మూవీ విశేషాలేంటో చూడండి.
ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఉన్న డిమాండ్ ఏంటో మనకు తెలుసు. అందుకు తగినట్లే ఈ జానర్లో ఒరిజినల్ మూవీస్, వెబ్ సిరీస్ తెరకెక్కించడానికి ఓటీటీలు పోటీ పడుతున్నాయి. తాజాగా ఆహా వీడియో కూడా తన ఒరిజినల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. త్వరలోనే సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకురానుంది.

ధూల్పేట్ పోలీస్ స్టేషన్ మూవీ
ఆహా వీడియో ఓటీటీలోకి నేరుగా వస్తున్న సినిమా ధూల్పేట్ పోలీస్ స్టేషన్. ఈ సినిమా తెలుగు, తమిళంలలో రానుంది. ఆహా ఓటీటీ అటు తమిళం, ఇటు తెలుగులలో ఒకేసారి తన ఎక్స్ అకౌంట్ల ద్వారా ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ ను సోమవారం (నవంబర్ 17) రిలీజ్ చేసింది. ఎలాంటి డైలాగులు లేకుండా చాలా ఉత్కంఠగా ఈ టీజర్ సాగిపోయింది.
అశ్విన్, శ్రీతు, గురులాంటి వాళ్లు ఈ సినిమాలో నటించారు. జస్విని ఈ మూవీని డైరెక్ట్ చేయగా.. రమణగిరివాసన్ కథ అందించాడు. అశ్వత్ నాగనాథన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఈ సినిమాను త్వరలోనే స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా ఓటీటీ వెల్లడించింది. త్వరలోనే స్ట్రీమింగ్ తేదీని రివీల్ చేయనుంది.
ధూల్పేట్ పోలీస్ స్టేషన్, దాని పరిధిలో జరిగే నేరాల చుట్టూ మూవీ తిరగనున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది. ఈ టీజర్ ద్వారా మూవీలోని ప్రధాన పాత్రలను పరిచయం చేశారు. ఇది చాలా ఇంటెన్స్గా సాగింది. మైథాలజీకి క్రైమ్ ను జోడించిన తీసిన మూవీగా కనిపిస్తోంది. ఈ సినిమా తెలుగుతోపాటు తమిళంలోనూ స్ట్రీమింగ్ కానుంది.
ఆహా వీడియో మూవీస్
ఇక ఆహా వీడియో ఓటీటీలోకి ఈ మధ్యే కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. కిరణ్ అబ్బవరం నటించిన కే ర్యాంప్ మూవీకి ఈ ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తోంది. అంతకుముందు రాజ్ తరుణ్ నటించిన చిరంజీవి సినిమా కూడా స్ట్రీమింగ్ కు వచ్చింది. జబర్దస్త్ కమెడియన్ అదిరే అభి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇక త్వరలోనే ఈ ఓటీటీలోకి 3 రోజెస్ వెబ్ సిరీస్ రెండో సీజన్ కూడా రాబోతోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


