తెలుగు టీవీ సీరియల్స్ 51వ వారం టీఆర్పీ రేటింగ్స్ ఇలా.. కొత్త సీరియల్ హవా.. అర్బన్లో గుండె నిండా గుడి గంటలు టాప్
తెలుగు టీవీ సీరియల్స్ కు సంబంధించి 51వ వారం టీఆర్పీ రేటింగ్స్ రిలీజ్ అయ్యాయి. ఈవారం కూడా కొత్త సీరియల్ పొదరిల్లు హవా కొనసాగింది. టాప్ 10లోనే ఆ సీరియల్ ఉండటం విశేషం. ఇక టాప్ 7లో మొత్తం స్టార్ మా సీరియల్సే ఉన్నాయి.
స్టార్ మా, జీ తెలుగు ఛానెల్స్ కు సంబంధించి తెలుగు టీవీ సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. మరోసారి కార్తీక దీపం 2 సీరియల్ టాప్ లోనే ఉండగా.. టాప్ 10లో మొత్తంగా ఏడు స్టార్ మా సీరియల్సే ఉన్నాయి. జీ తెలుగు సీరియల్స్ చివరి మూడు స్థానాలతో సరిపెట్టుకున్నాయి.

స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్
కొన్నేళ్లుగా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న స్టార్ మా సీరియల్స్.. 2025లోనూ అదే హవా కొనసాగించాయి. 51వ వారం కూడా టాప్ 7లో అన్నీ ఆ ఛానెల్ సీరియల్సే ఉన్నాయి. తొలి స్థానంలో ఉన్న కార్తీక దీపం 2 సీరియల్ కు 14.25 రేటింగ్ వచ్చింది. ఓవరాల్ గా ఈ సీరియల్ తొలి స్థానంలో ఉన్నా.. కేవలం అర్బన్ రేటింగ్ చూసుకుంటే మాత్రం 11.16తో గుండె నిండా గుడి గంటలు తొలి స్థానంలో ఉంది. ఓవరాల్ గా 12.37తో ఇది మూడో స్థానంలో ఉంది.
రెండో స్థానంలో ఉన్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కు 13.62 రేటింగ్ నమోదైంది. ఇంటింటి రామాయణం (12.28), చిన్ని (10.68), నిండు మనసులు (9.48), పొదరిల్లు (8.44) ఉన్నాయి. మూడు వారాల కిందటే మొదలైన కొత్త సీరియల్ పొదరిల్లు టాప్ 10లోనూ కొనసాగుతూ వస్తుండటం విశేషం.
జీ తెలుగు సీరియల్స్ రేటింగ్స్ ఇలా..
ఇక జీ తెలుగు విషయానికి వస్తే.. టాప్ 10లో చివరి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఆ ఛానెల్లో వచ్చే మేఘ సందేశం సీరియల్ 8.22 రేటింగ్ తో ఎనిమిదో స్థానంలో ఉంది. మరో సీరియల్ చామంతి 7.89తో 9వ స్థానంలో, జయం సీరియల్ 7.73తో పదో స్థానంలో ఉన్నాయి.
లక్ష్మీ నివాసం (7.58), జగద్ధాత్రి (7.43) సీరియల్స్ టాప్ 10లో చోటు కోల్పోయాయి. ఈ ఛానెల్లో సీరియల్స్ మధ్య గట్టి పోటీ నెలకొంటోంది. ప్రతి వారం చివరి మూడు స్థానాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. టాప్ 10లో ఉండటానికి జీ తెలుగులోని ఐదు సీరియల్స్ తీవ్రంగా పోటీ పడుతున్నాయి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


