క్లైమ్యాక్స్‌లోనూ హీరో మారకపోవడం నచ్చలేదనుకుంట.. కొన్నేళ్ల తర్వాత ఈ మూవీ వచ్చి ఉంటే నచ్చేదేమో: తెలుసు కదా డైరెక్టర్ నీరజ

సిద్దూ జొన్నలగడ్డ నటించిన తెలుసు కదా మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటంపై డైరెక్టర్ నీరజ కోన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. క్లైమ్యాక్స్ లోనూ హీరో మారకపోవడం అనేది ప్రేక్షకులకు నచ్చలేదేమో అని ఆమె అనడం విశేషం.

Published on: Dec 08, 2025 5:16 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సిద్దూ జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి నటించిన మూవీ తెలుసు కదా. ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజైనా సక్సెస్ కాలేకపోయింది. సిద్దూకి వరుసగా రెండో ఫ్లాప్ ఇచ్చింది. అయితే దీనిపై తాజాగా గుల్టెలో జరిగిన డైరెక్టర్స్ రౌండ్ టేబుల్లో తెలుసు కదా డైరెక్టర్ నీరజ కోన స్పందించింది. మూవీ చాలా అడ్వాన్స్‌గా ఉండటం వల్ల ప్రేక్షకులకు నచ్చలేదేమో అని అభిప్రాయపడింది.

క్లైమ్యాక్స్‌లోనూ హీరో మారకపోవడం నచ్చలేదనుకుంట.. కొన్నేళ్ల తర్వాత ఈ మూవీ వచ్చి ఉంటే నచ్చేదేమో: తెలుసు కదా డైరెక్టర్ నీరజ
క్లైమ్యాక్స్‌లోనూ హీరో మారకపోవడం నచ్చలేదనుకుంట.. కొన్నేళ్ల తర్వాత ఈ మూవీ వచ్చి ఉంటే నచ్చేదేమో: తెలుసు కదా డైరెక్టర్ నీరజ

నీరజ కోన ఏమన్నదంటే?

తెలుసు కదా మూవీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలోని హీరో పాత్ర స్వభావం, ప్రేక్షకుల అంచనాల గురించి నీరజ కోన ఇలా వివరించింది. "హీరో పాత్రలో గ్రే షేడ్స్ (ప్రతికూల ఛాయలు) ఉంటాయి. కనీసం క్లైమాక్స్‌లో అయినా హీరో మారిపోయి ఉంటే సినిమా కచ్చితంగా క్లిక్ అయ్యేది. ఎందుకంటే మన ప్రేక్షకులు కోరుకునేది, ఆశించేది అదే. కానీ హీరో చివరి వరకూ అలాగే మారకుండా ఉండిపోయాడు. దాన్ని జనం జీర్ణించుకోలేకపోయారు" అని చెప్పింది.

అంతేకాకుండా ఈ కథ ఇప్పటి కాలానికి సరిపోలేదేమో అనే సందేహాన్ని కూడా ఆమె వ్యక్తం చేసింది. "బహుశా 'తెలుసు కదా' సినిమా ఇప్పటి ఆడియెన్స్‌కు మరీ అడ్వాన్స్‌డ్‌గా లేదా మరీ కొత్తగా అనిపించి ఉండొచ్చు. మరో కొన్నేళ్ల తర్వాత విడుదలై ఉంటే ఈ సినిమా కచ్చితంగా వర్కవుట్ అయ్యేదేమో" అని నీరజ కోన పేర్కొంది.

తెలుసు కదా మూవీ గురించి..

సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా స్టైలిష్‌గా తెరకెక్కినప్పటికీ, కథనంలో కొత్తదనం ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయిందనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు దర్శకురాలి మాటలు ఆ విమర్శలకు బలం చేకూరుస్తున్నాయి. స్టైలిస్ట్ అయిన నీరజకు డైరెక్టర్ గా ఇదే తొలి సినిమా. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు.

రొమాన్స్, ట్రయాంగిల్ లవ్ స్టోరీ సినిమాలు తెలుగులోనే కాదు ఇతర భాషల్లో కూడా చాలానే వచ్చాయి. తెలుసు కదా కూడా ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీకి సంబంధించినదే. కానీ, ఇలాంటి ట్రయాంగిల్ లవ్ స్టోరీ మాత్రం తెలుగులో రాలేదని చెప్పాలి.

ప్రేమ కోసం ట్రయాంగిల్ యాంగిల్ ఉండటం సాధారణమే కానీ, ఇక్కడ పిల్లల కోసం ట్రయాంగిల్ డ్రామా సాగడం చాలా యూనిక్ పాయింట్. పిల్లలు కావాలనుకునే భార్యాభర్తలు, సరోగసీ ద్వారా బిడ్డను అందించడానికి మాజీ లవర్ రావడం, ఆ తర్వాత ముగ్గురు మధ్య చోటుచేసుకునే పరిస్థితులు ఒక డిఫరెంట్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు.