దళపతి విజయ్ (Thalapathy Vijay) చివరి సినిమా 'జన నాయగన్' చిక్కుముళ్లు ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే విధించింది. దీంతో సినిమా విడుదల మరింత సందిగ్ధంలో పడింది. శుక్రవారం (జనవరి 9) మద్రాస్ హైకోర్టులో జరిగిన విచారణలో విజయ్ సినిమాకు ప్రతికూల ఫలితం వచ్చింది. దీంతో జనవరి 21 వరకు మూవీ రిలీజయ్యే పరిస్థితి కనిపించడం లేదు.
హైకోర్టులో ఏం జరిగింది?

దళపతి విజయ్ జన నాయగన్ మేకర్స్ కు శుక్రవారం ఓ గుడ్ న్యూస్, ఆ వెంటనే ఓ బ్యాడ్ న్యూస్ అందింది. మొదట ఉదయం సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయాలని సింగిల్ జడ్జి.. సెన్సార్ బోర్డు (CBFC)ను ఆదేశించారు. అయితే ఈ ఆదేశాలను సవాలు చేస్తూ సీబీఎఫ్సీ.. డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది.
దీనిపై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ మణీంద్ర మోహన్ శ్రీవాస్తవ, జస్టిస్ జి. అరుల్ మురుగన్ నేతృత్వంలోని ధర్మాసనం.. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు దీనిపై జనవరి 21న తదుపరి విచారణ చేపడతామని చెప్పింది. దీంతో అప్పటి వరకూ మూవీ రిలీజ్ అయ్యే అవకాశాలు లేనట్లే.
ఎవరి వాదనలు ఎలా ఉన్నాయంటే?
సెన్సార్ బోర్డు తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఏఆర్ఎల్ సుందరేశన్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా (వీడియో కాన్ఫరెన్స్ ద్వారా) వాదనలు వినిపించారు. సినిమాలోని అభ్యంతరకర అంశాలు, రూల్స్ ను బేస్ చేసుకుని వారు చేసిన అప్పీల్ ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
ఇప్పటికే జనవరి 9న జరగాల్సిన రిలీజ్ వాయిదా పడింది. ఇప్పుడు కోర్టు స్టే విధించడంతో.. న్యాయపరమైన చిక్కులు తేలేవరకు సినిమా థియేటర్లోకి రావడం కష్టంగా మారింది. ఇది విజయ్ అభిమానులకు పెద్ద దెబ్బే అని చెప్పాలి.
రిలీజ్ వాయిదాతో భారీ నష్టం
జనవరి 9న రిలీజ్ కావాల్సిన సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడంతో.. అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకున్న లక్షలాది మందికి డబ్బులు వెనక్కి ఇవ్వాల్సి వచ్చింది. ఇది భారతీయ సినిమా చరిత్రలోనే అతిపెద్ద రిఫండ్ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
{{/usCountry}}జనవరి 9న రిలీజ్ కావాల్సిన సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడంతో.. అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకున్న లక్షలాది మందికి డబ్బులు వెనక్కి ఇవ్వాల్సి వచ్చింది. ఇది భారతీయ సినిమా చరిత్రలోనే అతిపెద్ద రిఫండ్ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
{{/usCountry}}సినిమా వాయిదా పడటంతో టికెటింగ్ ప్లాట్ఫామ్ 'బుక్మైషో' (BookMyShow) భారీ ఎత్తున రిఫండ్ ప్రక్రియను చేపట్టింది. కేవలం ఇండియాలోనే దాదాపు రూ. 1 కోటి విలువైన టికెట్ల డబ్బును వెనక్కి ఇచ్చినట్లు అంచనా. విదేశాల్లో ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండొచ్చు. దాదాపు 4,50,000 టికెట్లను రిఫండ్ చేశారట. ఇంత భారీ మొత్తంలో రిఫండ్స్ జరగడం ఇండియన్ సినిమా హిస్టరీలో ఇదే మొదటిసారి అని అంటున్నారు.