దళపతి విజయ్ రాజకీయాల్లోకి వెళ్లేముందు చేస్తున్న చివరి సినిమా 'జన నాయగన్' (Jana Nayagan) విడుదలకు చివరి నిమిషంలో భారీ అడ్డంకులు ఏర్పడ్డాయి. జనవరి 9న రిలీజ్ కావాల్సి ఉన్నా.. ఇప్పటివరకు సెన్సార్ బోర్డ్ (CBFC) నుంచి సర్టిఫికెట్ రాలేదు. దీంతో నిర్మాతలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.
హైకోర్టులో ఏం జరిగింది?
కేవీఎన్ ప్రొడక్షన్స్ దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం (జనవరి 6) విచారణ జరిగింది. దీనికి సంబంధించిన కీలక పరిణామాలు ఇలా ఉన్నాయి. జన నాయగన్ మూవీ నిర్మాతల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నా సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వట్లేదని కోర్టుకు తెలిపారు. దీనిపై జస్టిస్ పి.టి. ఆశా స్పందించారు.
"రిలీజ్ విషయంలో అంత అత్యవసరం ఏముంది? జనవరి 10 నుంచి రిలీజ్ వాయిదా వేసుకోవచ్చు కదా? సంక్రాంతి వస్తే మంచి జరుగుతుంది అనే సామెత ఉంది కదా" అని వ్యాఖ్యానించారు.
అయితే సినిమాపై వచ్చిన ఫిర్యాదు కాపీని బుధవారం (జనవరి 7) నాటికి కోర్టుకు సమర్పించాలని సెన్సార్ బోర్డును (CBFC) ఆదేశించారు. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు.
అసలు గొడవ ఏంటి?
నిర్మాతలు కోర్టుకు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సమస్య మొదలైన తీరు ఇలా ఉంది. గతేడాది డిసెంబర్ 18న సెన్సార్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. డిసెంబర్ 22న సినిమా చూసిన ఎగ్జామినింగ్ కమిటీ.. హింసాత్మక దృశ్యాలు, మతపరమైన రిఫరెన్సులు ఉన్నాయని చెబుతూ.. కొన్ని కట్స్ సూచించి UA 16+ సర్టిఫికెట్ ఇవ్వడానికి సిఫార్సు చేసింది.
డిసెంబర్ 24న బోర్డు చెప్పిన మార్పులు చేసి నిర్మాతలు సినిమాను మళ్లీ సబ్మిట్ చేశారు. అంతా సవ్యంగా ఉందనుకున్న సమయంలో జనవరి 5న నిర్మాతలకు ఒక ఈమెయిల్ వచ్చింది. సినిమాపై ఒక ఫిర్యాదు వచ్చిందని, అందుకే రూల్ 24 ప్రకారం సినిమాను ‘రివైజింగ్ కమిటీ’కి పంపిస్తున్నామని CBFC తెలిపింది.
రూ. 500 కోట్లు రిస్క్ లో..
{{/usCountry}}డిసెంబర్ 24న బోర్డు చెప్పిన మార్పులు చేసి నిర్మాతలు సినిమాను మళ్లీ సబ్మిట్ చేశారు. అంతా సవ్యంగా ఉందనుకున్న సమయంలో జనవరి 5న నిర్మాతలకు ఒక ఈమెయిల్ వచ్చింది. సినిమాపై ఒక ఫిర్యాదు వచ్చిందని, అందుకే రూల్ 24 ప్రకారం సినిమాను ‘రివైజింగ్ కమిటీ’కి పంపిస్తున్నామని CBFC తెలిపింది.
రూ. 500 కోట్లు రిస్క్ లో..
{{/usCountry}}ఎవరో గుర్తు తెలియని వ్యక్తి.. ఈ సినిమాలో మతపరమైన మనోభావాలు దెబ్బతిన్నాయని, ఆర్మీని తప్పుగా చూపించారని ఫిర్యాదు చేశారట. సినిమా ఇంకా పబ్లిక్ లోకి రాకుండానే, ఎవరికీ చూపించకుండానే ఫిర్యాదు ఎలా చేస్తారని నిర్మాతలు ప్రశ్నిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా 5000 స్క్రీన్లలో రిలీజ్ ప్లాన్ చేశామని, దాదాపు రూ. 500 కోట్లు పెట్టుబడి రిస్క్లో పడిందని నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 24 దేశాల్లో సెన్సార్ క్లియరెన్స్ వచ్చింది కానీ.. ఇండియాలోనే సమస్య వచ్చింది. బుధవారం కోర్టు ఇచ్చే తీర్పుపైనే విజయ్ సినిమా రిలీజ్ ఆధారపడి ఉంది.