...
...
Next Story

The Odyssey Premiere: ఇండియాకు వచ్చేసిన లెజెండరీ హాలీవుడ్ డైరెక్టర్.. ది ఒడిస్సీ ప్రీమియర్‌కు అంతా సిద్ధం..

The Odyssey Premiere:

Published on: Jul 10, 2026, 14:54:35 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

The Odyssey Premiere: హాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్, మనందరి ఫేవరెట్ స్పైడర్ మ్యాన్ టామ్ హాలండ్ సడెన్ గా ముంబైలో ల్యాండ్ అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎపిక్ యాక్షన్ ఫిల్మ్ 'ది ఒడిస్సీ' ఇండియా ప్రీమియర్ కోసం వీళ్లు మన దేశానికి వచ్చారు. ముంబైలోని ప్రముఖ తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ లోకి వీరు ఎంట్రీ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఇండియాలో తొలిసారి ప్రీమియర్

The Odyssey Premiere: ఇండియాకు వచ్చేసిన లెజెండరీ హాలీవుడ్ డైరెక్టర్.. ది ఒడిస్సీ ప్రీమియర్‌కు అంతా సిద్ధం..
The Odyssey Premiere: ఇండియాకు వచ్చేసిన లెజెండరీ హాలీవుడ్ డైరెక్టర్.. ది ఒడిస్సీ ప్రీమియర్‌కు అంతా సిద్ధం..

'ఓపెన్‌హైమర్' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత క్రిస్టోఫర్ నోలన్ డైరెక్ట్ చేస్తున్న సినిమా 'ది ఒడిస్సీ'. ఈ కంబ్యాక్ సినిమా జులై 17న గ్లోబల్ లెవెల్లో థియేటర్లలోకి రాబోతోంది. రిలీజ్ కి ముందే జులై 10, 11 తేదీల్లో ముంబైలోని పీవీఆర్ ఐకాన్ ఐమాక్స్‌లో స్పెషల్ ప్రీమియర్ షోలు ప్లాన్ చేశారు. ఇండియాలో నోలన్ మూవీ ప్రీమియర్ కానుండటం ఇదే తొలిసారి.

నోలన్ తో పాటు ఆయన భార్య, ప్రొడ్యూసర్ ఎమ్మా థామస్ కూడా ముంబైకి చేరుకున్నారు. ఈ సినిమాలో లీడ్ రోల్ ప్లే చేస్తున్న హాలీవుడ్ స్టార్ హీరో మ్యాట్ డామన్ సైతం త్వరలోనే ఈ ప్రమోషనల్ ఈవెంట్స్ లో జాయిన్ కాబోతున్నాడు. కలీనా ఎయిర్ పోర్ట్ లో టామ్ హాలండ్ కనిపించగానే ఫొటోగ్రాఫర్లు తమ కెమెరాలకు పనిచెప్పారు.

బాక్సాఫీస్ వద్ద ఐమాక్స్ టికెట్ల సునామీ

ది ఒడిస్సీ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఐమాక్స్ స్క్రీన్స్ లో ఈ సినిమా టికెట్ ధర ఏకంగా రూ.3,300 వరకు ఉన్నప్పటికీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఢిల్లీ, ముంబై లాంటి మెట్రో సిటీల్లో ఫస్ట్ వీకెండ్ టికెట్స్ అన్నీ ఇప్పటికే సోల్డ్ అవుట్ అయిపోయాయి. నోలన్ క్రేజ్ ఇండియాలో ఏ రేంజ్ లో ఉందో దీన్ని బట్టి స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.

ది ఒడిస్సీ మూవీ విశేషాలు

టెక్నికల్ గా ఈ సినిమా హాలీవుడ్ కు ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేయబోతోంది. సరికొత్త ఐమాక్స్ టెక్నాలజీతో, పూర్తిగా ఐమాక్స్ కెమెరాలతోనే షూట్ చేసిన ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఇదే కావడం విశేషం. రీసెంట్ గా ఏపీ (AP) మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నోలన్ మాట్లాడుతూ.. "మేము ఈ సినిమాను థియేటర్ ఆడియన్స్ కోసమే తీశాం, ప్రపంచం దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటుందో చూడాలి" అని తన ఉత్సాహాన్ని షేర్ చేసుకున్నాడు.

అంచనాలు పెంచేస్తున్న రికార్డులు, నటీనటులు

గతంలో 'ఇన్సెప్షన్', 'ఇంటర్ స్టెల్లార్', 'డన్‌కిర్క్' లాంటి సినిమాలతో ఇండియన్ ఆడియన్స్ కు మైండ్ బ్లోయింగ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చాడు నోలన్. మూడేళ్ల క్రితం వచ్చిన 'ఓపెన్‌హైమర్' ఇండియాలో ఏకంగా రూ.157.5 కోట్లు కలెక్ట్ చేసి రికార్డులు సృష్టించింది. ఇప్పుడు ఆ రికార్డులను 'ది ఒడిస్సీ' బ్రేక్ చేయడం గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ ఎపిక్ డ్రామాలో క్యాస్టింగ్ చూస్తే కళ్లు చెదరాల్సిందే. మ్యాట్ డామన్, టామ్ హాలండ్ తో పాటు హాలీవుడ్ స్టార్స్ అన్నే హాత్వే, జెండయా, రాబర్ట్ ప్యాటిన్సన్, ఛార్లీజ్ థెరాన్ లాంటి దిగ్గజాలు ఇందులో నటిస్తున్నారు. ఇలాంటి స్టార్ నటీనటులతో రాబోతున్న ఈ సినిమా విజువల్స్ వెండితెరపై మ్యాజిక్ చేయడం ఖాయం. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ లుడ్విగ్ గోరాన్సన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు మరో మేజర్ హైలైట్ కానుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe