OTT Release: తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ నుంచి మలయాళం థ్రిల్లర్ వెబ్ సిరీస్ వరకు.. ఈ వారం తెలుగు, తమిళం, మలయాళం రిలీజెస్

ఈవారం ఓటీటీలోకి సౌత్ ఇండస్ట్రీ నుంచి చాలా సినిమాలు, వెబ్ సిరీస్ వస్తున్నాయి. తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ హనీతోపాటు మలయాళ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రోస్లిన్ వరకు మిస్ కాకుండా చూడాల్సినవి ఏవో చూడండి.

Published on: Feb 25, 2026, 17:27:21 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఈ వారం ఓటీటీలోకి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల నుంచి చాలా కంటెంట్ రాబోతోంది. ముఖ్యంగా మూడు కొత్త వెబ్ సిరీస్‌లు వీటిలో ఉన్నాయి. 'డాటరాఫ్ ప్రసాదరావు: కనబడుటలేదు' అనేది ఒక ఉత్కంఠభరితమైన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ కాగా, నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో 'తడయం' అనే తమిళ సిరీస్, ఒక చిన్నారి చుట్టూ తిరిగే కథతో మలయాళ సిరీస్ 'రోస్లిన్' విడుదల కానున్నాయి. వీటితో పాటు అవార్డులు గెలుచుకున్న కన్నడ మూవీ 'నీలి హక్కి', తెలుగు హారర్ థ్రిల్లర్ 'హనీ' కూడా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

OTT Release: తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ నుంచి మలయాళం థ్రిల్లర్ వెబ్ సిరీస్ వరకు.. ఈ వారం తెలుగు, తమిళం, మలయాళం రిలీజెస్
OTT Release: తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ నుంచి మలయాళం థ్రిల్లర్ వెబ్ సిరీస్ వరకు.. ఈ వారం తెలుగు, తమిళం, మలయాళం రిలీజెస్

డాటరాఫ్ ప్రసాదరావు: కనబడుటలేదు - జీ5 ఓటీటీ

కనిపించకుండా పోయిన తన కూతురి కోసం ఎంతో ఆరాటంగా, పిచ్చిగా వెతికే ఒక తండ్రి చుట్టూ ఈ సరికొత్త తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తిరుగుతుంది. ఈ సిరీస్‌లో కూతురి కోసం తల్లడిల్లే తండ్రి పాత్రలో ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల అద్భుతంగా నటించాడు. అతనితో పాటు వసంతిక, గాయత్రీ భరద్వాజ్, ఉదయ భాను కీలక పాత్రలు పోషించారు. కృష్ణ పోలూరు దర్శకత్వం వహించిన ఈ సిరీస్, ఒక బలమైన ఎమోషనల్ స్టోరీతోపాటు ఊహకందని ట్విస్టులతో రానుంది. జీ5లో ఫిబ్రవరి 27 నుంచి చూడొచ్చు.

హనీ - ప్రైమ్ వీడియో, సన్ నెక్ట్స్

తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ హనీ రెండు ఓటీటీల్లోకి వస్తోంది. ఇందులో నటుడు నవీన్ చంద్ర 'ఆనంద్' అనే ప్రధాన పాత్రను పోషించాడు. డబ్బు సంపాదించడం కోసం అతను క్షుద్ర పూజలు, చేతబడి వైపు వెళ్తాడు. ఈ క్రమంలో తన భార్య, కూతురిని కూడా ఆ పూజల్లోకి లాగుతాడు. కానీ ఇది అతని కూతురి జీవితంలో ఊహించని, అతిపెద్ద పరిణామాలకు దారితీస్తుంది. కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దివ్యా పిళ్లై, దివి వాద్యా ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటించి మెప్పించారు.

తడయం - జీ5 ఓటీటీ

తమిళ క్రైమ్ వెబ్ సిరీస్ కథ మనల్ని 1990ల కాలంలోకి తీసుకువెళుతుంది. సరిహద్దు గ్రామాల్లో జరిగే వరుస మిస్టరీ మరణాల నేపథ్యంలో ఇది సాగుతుంది. ఆ హత్యలన్నింటిలోనూ ఉన్న ఒకే రకమైన పోలికలు గ్రామస్తుల్లో తీవ్ర భయాన్ని రేకెత్తిస్తాయి. ఆ ప్రాంతానికి కొత్తగా బదిలీపై వచ్చిన ఒక పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఈ దర్యాప్తును తన భుజాలపై వేసుకుంటాడు. సముద్రఖని ఇందులో ప్రధాన పాత్ర పోషించగా.. శివద, రాజ్ తిరందాస్, మున్నార్ రమేష్ తదితరులు నటించారు.

సీక్రెట్ స్టోరీస్: రోస్లిన్ - జియోహాట్‌స్టార్

మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రోస్లిన్. తనను ఎప్పుడూ ఒక వ్యక్తి వెంబడిస్తున్నట్లు పదే పదే పీడకలలు కనే ఒక టీనేజ్ అమ్మాయి పడే ఆవేదనను ఇందులో చూపించారు. ఇందులో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆ కలలో ఆమెను వెంబడించే వ్యక్తికి ఆకుపచ్చని కళ్లు ఉంటాయి. ఈ సిరీస్‌లో సంజనా దీపు 'రోస్లిన్' పాత్రను పోషించగా, సీనియర్ నటి మీనా, వినీత్, హకీమ్ షాజహాన్ కీలక పాత్రల్లో నటించారు. 'దృశ్యం 3' దర్శకుడు జీతు జోసెఫ్ ఈ సిరీస్‌కు షోరన్నర్‌గా వ్యవహరిస్తున్నారు.

నీలి హక్కి - సన్ నెక్ట్స్

నీలి హక్కి పలు అవార్డులు గెలుచుకున్న ఒక కన్నడ సినిమా. 'నీలి హక్కి' అంటే బ్లూ బర్డ్ అని అర్థం. ఈ సినిమా ఇప్పటికే సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మెరుగైన జీవితం కోసం నగరం బాట పట్టిన తల్లిదండ్రుల వెంట వెళ్లిన ఒక చిన్నారి చుట్టూ ఈ భావోద్వేగ భరితమైన కథ తిరుగుతుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More