Simran: సగానికిపైగా జీవితం సినిమాకే ఇచ్చా.. ఇక్కడి స్టార్లంటే వాళ్లకు గౌరవమే లేదు.. అందుకే హిందీ సినిమాలు చేయను: సిమ్రన్
Simran: సౌత్ సినిమాల్లో స్టార్ ఇమేజ్ ఉన్నా ఉత్తరాది చిత్ర పరిశ్రమలో చిన్నచూపు చూస్తారని, కనీస మర్యాద కూడా ఇవ్వరని సీనియర్ నటి సిమ్రన్ ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవితంలో సగానికిపైగా సినిమాకే ఇచ్చానని, అయినా అక్కడ తగిన గుర్తింపు లేదని ఆమె అన్నారు.
Simran: టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు సిమ్రన్. అందం, అభినయం, అద్భుతమైన డాన్స్తో దశాబ్దాల పాటు దక్షిణాది చిత్రసీమను ఏలిన ఈ నటి.. తాజాగా హిందీ చిత్ర పరిశ్రమ (బాలీవుడ్) తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దక్షిణాది నటుల పట్ల బాలీవుడ్ ప్రదర్శించే వివక్షను, అక్కడ ఎదురయ్యే ఇబ్బందులను ఆమె కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు.

సౌత్ స్టార్స్ అంటే అంత చులకనా?
ఇటీవల ఒక ప్రముఖ సినీ మేగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిమ్రన్ బాలీవుడ్ చీకటి కోణాలను బయటపెట్టారు.
"చాలా సార్లు నాకు హిందీ సినిమాల్లో అవకాశాలు వచ్చినా తిరస్కరించాను. అక్కడి వారితో నాకు సరైన కమ్యూనికేషన్ కుదరదు. మేము సౌత్లో సంపాదించుకున్న పేరును, మాకున్న లెగసీని వారు అస్సలు గుర్తించరు. మేము సున్నా నుంచి మొదలుపెడుతున్న కొత్త నటుల్లాగా వారు వ్యవహరిస్తారు. ఇది నన్ను తీవ్రంగా కలిచివేస్తుంది" అని ఆమె పేర్కొన్నారు.
దశాబ్దాల కాలం సినిమా కోసం ప్రాణమిచ్చిన తమలాంటి నటులకు కనీస గౌరవం దక్కకపోవడం బాధాకరమని ఆమె స్పష్టం చేశారు.
బేరసారాలు.. చిన్నచూపు
కేవలం గౌరవం విషయంలోనే కాకుండా, కనీస సదుపాయాల విషయంలోనూ బాలీవుడ్ నిర్మాణ సంస్థలు చాలా కక్కుర్తిగా వ్యవహరిస్తాయని సిమ్రాన్ ఆరోపించారు.
"వసతి సౌకర్యాల దగ్గర కూడా బేరాలు ఆడతారు. మా వెంట వచ్చే స్టాఫ్ సంఖ్యను పరిమితం చేస్తారు. హోటల్ గదులు, విమాన టిక్కెట్ల విషయంలోనూ రాజీ పడమంటారు. ఇవన్నీ చాలా చిన్న విషయాలుగా అనిపించవచ్చు కానీ, ఒక నటిగా ఇవి మనోధైర్యాన్ని దెబ్బతీస్తాయి. అక్కడ ఉండే ఆధిపత్యం చూశాక పనిచేయాలనే ఆసక్తి పోతుంది" అని ఆమె వాపోయారు.
సన్నీ డియోల్ సెట్లో మాత్రం..
బాలీవుడ్లో చేదు అనుభవాలు ఉన్నప్పటికీ, అందరూ అలా ఉండరని సిమ్రన్ వెల్లడించారు. ఇటీవల సన్నీ డియోల్తో కలిసి ఆమె 'గబ్రూ' అనే చిత్రంలో నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో నిర్మాత ఓమ్ చంగానీ తనను చాలా గౌరవంగా చూసుకున్నారని ఆమె మెచ్చుకున్నారు.
అలాగే సన్నీ డియోల్ ఎంతో వినయపూర్వకంగా ఉంటారని, ఆయనతో పనిచేయడం సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు. గతేడాది వచ్చిన 'గుల్మోహర్' టీమ్ కూడా తనను ఎంతో ఆత్మీయంగా ఆహ్వానించిందని ఆమె గుర్తు చేసుకున్నారు.
సిమ్రాన్ సినీ ప్రస్థానం
1995లో 'సనమ్ హర్జాయ్' సినిమాతో వెండితెరకు పరిచయమైన సిమ్రన్.. 'తేరే మేరే సప్నే'లో 'ఆంఖ్ మారే' పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత మలయాళంలో మమ్ముట్టి సరసన నటించినా, ఆమె జాతకం మారింది మాత్రం తమిళ, తెలుగు చిత్రాలతోనే.
'వాలి', 'ప్రియమానవలే', 'కన్నత్తిల్ ముత్తమిట్టల్', 'పంచతంత్రం' వంటి చిత్రాలు ఆమెను స్టార్ను చేశాయి. తాజాగా శశికుమార్ సరసన ఆమె నటించిన 'టూరిస్ట్ ఫ్యామిలీ' చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేయడం విశేషం.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. బాలీవుడ్ గురించి సిమ్రన్ ప్రధానంగా చేసిన విమర్శ ఏమిటి?
దక్షిణాది నటులకు బాలీవుడ్లో సరైన గౌరవం దక్కదని, వారి సీనియారిటీని గుర్తించకుండా చిన్నచూపు చూస్తారని సిమ్రాన్ విమర్శించారు.
2. సిమ్రన్ బాలీవుడ్ సినిమాలను ఎందుకు తిరస్కరిస్తున్నారు?
అక్కడి పని సంస్కృతి, కనీస సదుపాయాల విషయంలో బేరసారాలు ఆడటం, నటుల పట్ల ఉండే వివక్ష కారణంగా ఆమె హిందీ ప్రాజెక్టులకు దూరంగా ఉంటున్నారు.
3. సిమ్రన్ ఇటీవలి హిందీ అనుభవాలు ఎలా ఉన్నాయి?
సన్నీ డియోల్తో కలిసి నటించిన 'గబ్రూ', గతంలో వచ్చిన 'గుల్మోహర్' చిత్ర బృందాలు తనను చాలా గౌరవంగా చూసుకున్నాయని ఆమె సానుకూలంగా స్పందించారు.
4. సిమ్రన్ నటించిన తాజా సూపర్ హిట్ సినిమా ఏది?
శశికుమార్ సరసన నటించిన 'టూరిస్ట్ ఫ్యామిలీ' ఆమె తాజా చిత్రం. ఇది విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్గా పెద్ద విజయం సాధించింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


