Toxic OTT: ఓటీటీలోకి ఇవాళ థియేటర్లలోకి వచ్చిన యశ్ టాక్సిక్- నెగెటివ్ టాక్, దారుణంగా రివ్యూలు-ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Yash Toxic OTT Streaming Details: కేజీఎఫ్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నటించిన భారీ యాక్షన్ డ్రామా టాక్సిక్ ఓటీటీ వివరాలపై అంతా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకు కారణం ఇవాళ థియేటర్లలోకి వచ్చిన టాక్సిక్ సినిమాకు ఘోరమైన నెగెటివ్ టాక్, రివ్యూలు రావడమే. మరి టాక్సిక్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ చూద్దాం.
Yash Toxic OTT Release Details: 'కేజీఎఫ్' సినిమాలతో సంచలనం సృష్టించిన కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన భారీ వయోలెంట్ బోల్డ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్' ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి ఇవాళ (ఆగస్ట్ 26) వచ్చింది.

నెగెటివ్ టాక్, ఓటీటీలోకి టాక్సిక్
లేడి డైరెక్టర్ గీతు మోహన్దాస్ దర్శకత్వం వహించిన ఈ పాన్-ఇండియా యాక్షన్ డ్రామాపై విడుదల ముందు నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. డిఫరెంట్ గ్యాంగ్స్టర్ డ్రామాగా ప్రచారం పొందిన ఈ చిత్రం మాత్రం ఘోరంగా నెగెటివ్ టాక్ను మూటగట్టుకుంటోంది.
అంతేకాకుండా టాక్సిక్ సినిమాకు దారుణంగా రివ్యూలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టాక్సిక్ ఓటీటీ వివరాలపై అందరిదృష్టి పడింది. మరి టాక్సిక్ ఓటీటీ స్ట్రీమింగ్ డీటేల్స్తో పాటు సినిమా ఎలా ఉందో ఇక్కడ తెలుసుకుందాం.
టాక్సిక్ కథేంటంటే?
దేశానికి స్వాతంత్య్రం వచ్చినా ఇంకా పోర్చుగీస్ పాలనలోనే ఉన్న గోవా నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. గోవాలోని అక్రమ దందాలన్నింటినీ తన గుప్పెట్లో ఉంచుకోవాలని రాయా (యశ్), అతని సోదరి గంగ (నయనతార) ప్లాన్ చేస్తారు. ఈ క్రమంలో గ్యాంగ్స్టర్ సాల్వడార్ (డారెల్ డిసిల్వా) కుమార్తె రెబెక్కా (తారా సుతారియా)ను వివాహం చేసుకోవడానికి రాయా సిద్ధమవుతాడు.
సరిగ్గా అదే సమయంలో నదియా (కియారా అద్వానీ) రాకతో రాయా ఆలోచనలు మారుతాయి. కఠినంగా ఉండే ఆ గ్యాంగ్స్టర్లో ప్రేమ భావాలు మేల్కొంటాయి. ఆ తర్వాత వారి జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? రాయా చేసిన పాపాలకు ఎలాంటి మూల్యం చెల్లించుకున్నాడనేదే మిగతా కథ.
కథనంలో లోపించిన లోతు.. శృతిమించిన హింస
3 గంటల 14 నిమిషాల సుదీర్ఘమైన నిడివితో వచ్చిన 'టాక్సిక్' రక్తపాతం, హింసతో నిండిపోయింది. యశ్, గీతు మోహన్దాస్ రాసుకున్న కథలో కీలకమైన ట్విస్ట్ చాలా ఆలస్యంగా వస్తుంది. అప్పటివరకు కథనాన్ని నడిపించడానికి విచక్షణారహితంగా తుపాకులు, గొడ్డళ్లు, బాంబులతో నరకడమే సరిపోయింది. ఎందుకు కొట్టుకుంటున్నారో, ఎవరి కోసం పోరాడుతున్నారో అర్థంకాని స్థాయిలో నరమేధాన్ని తెరపై చూపించారు.
ఆకట్టుకోలేకపోయిన పాత్రల రూపకల్పన
కథలో బలమైన భావోద్వేగాలు లేకపోవడంతో చిన్న చిన్న సాంకేతిక లోపాలు స్పష్టంగా కనిపిస్తాయి. సినిమాలో రాయా పాత్ర హింసనే తన మాతృభాషగా చెప్పుకుంటూ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, ఆమె అతని వెంటే పడటం సహజత్వానికి దూరంగా ఉంది.
రాయా, అతని కొడుకు టికెట్ (యశ్ ద్విపాత్రాభినయం) పాత్రల వెనుక ఎంతటి విషాదకరమైన గతం ఉన్నప్పటికీ, ఆ పాత్రల తీరు వల్ల ప్రేక్షకులకు వారిపై ఎలాంటి సానుభూతి కలగదు. పైగా ఎమోషనల్ సీన్లలో టికెట్ పాత్ర ప్రవర్తన నవ్వు తెప్పించేలా ఉంది.
హీరోయిన్లకు దక్కని ప్రాధాన్యం
గంగ (నయనతార), నదియా (కియారా అద్వానీ) పాత్రలు మాత్రమే కొంతవరకు పర్వాలేదనిపిస్తాయి. హుమా ఖురేషీ నటించిన ఎలిజబెత్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. యాంటి-హీరో లేదా విలన్ తన తప్పులకు మూల్యం చెల్లించుకుంటాడనే సందేశాన్ని ఇవ్వాలని ప్రయత్నించినప్పటికీ, కథలో ఎక్కువ భాగం హీరో పాత్రను ఆరాధించడానికే కేటాయించారు.
ఇలా నెగెటివ్ టాక్ తెచ్చుకున్న టాక్సిక్ ఓటీటీ రైట్స్ను జీ5 సొంతం చేసుకుందని సమాచారం. అయితే, టాక్సిక్ ఓటీటీ హక్కులను కొనుగోలు చేసేందుకు నెట్ఫ్లిక్స్ సంస్థ వంటి భారీ ప్లాట్ఫామ్స్తో పోటీ నెలకొందట. కానీ, ఆ పోటీని అధిగమించి జీ5 ఓటీటీ సంస్థ టాక్సిక్స్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను రూ. 250 కోట్లకుపైగా వెచ్చించి దక్కించుకున్నట్లు ఒక టాక్ నడుస్తోంది.
టాక్సిక్ ఓటీటీ స్ట్రీమింగ్
ఈ లెక్కన చూసుకుంటే జీ5లోనే టాక్సిక్ ఓటీటీ రిలీజ్ అవనుందని తెలుస్తోంది. అయితే, దీనిపై ఇప్పటివరకు అయితే ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కలెక్షన్స్, టాక్ అన్నింటిని దృష్టిలో ఉంచుకుని టాక్సిక్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ను మేకర్స్ ప్రకటించే అవకాశం ఉంది. అప్పటివరకు కేవలం వయోలెన్స్, బోల్డ్ కంటెంట్ ఇష్టపడేవారు మాత్రం థియేటర్లలో టాక్సిక్ సినిమాను చూడటం ఉత్తమం.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


