...
...
Next Story

Toxic Collections: టాక్సిక్ వరల్డ్ వైడ్ కలెక్షన్లు.. టాప్ 10లో 8వ ప్లేస్.. యశ్ కు రిషబ్ శెట్టి సపోర్ట్!

Toxic Collections: ఎన్నో అంచనాలతో థియేటర్లకు వచ్చిన టాక్సిక్ మూవీకి భారీ షాక్ తగిలింది. నెగెటివ్ టాక్ తో సినిమా విమర్శల పాలైంది. అయినప్పటికీ కలెక్షన్లలో మాత్రం యశ్ సినిమా అదరగొడుతోంది. నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్ గా టాక్సిక్ సాధించిన కలెక్షన్లపై ఓ లుక్కేయండి.

Published on: Aug 30, 2026, 17:41:34 IST
Advertisement

Toxic Collections: రాకింగ్ స్టార్ యశ్ లేటెస్ట్ మూవీ 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' (Toxic: A Fairy Tale for Grown-Ups) బాక్సాఫీస్ దగ్గర నెమ్మదిగా సాగుతోంది. విడుదలైన తొలిరోజే రికార్డు స్థాయి వసూళ్లను సాధించిన ఈ సినిమాకు నెగెటివ్ టాక్ ఇబ్బందిగా మారింది. శనివారం నాటి వసూళ్లతో ఈ సినిమా రూ.250 కోట్ల గ్రాస్ మార్కును దాటేసి సరికొత్త మైలురాయిని చేరుకుంది.

టాక్సిక్ కలెక్షన్లు

నాలుగు రోజుల్లో టాక్సిక్ వరల్డ్ వైడ్ కలెక్షన్లు ఎంతంటే? టాప్ 10లో 8వ ప్లేస్.. యశ్ కు రిషబ్ సపోర్ట్!
నాలుగు రోజుల్లో టాక్సిక్ వరల్డ్ వైడ్ కలెక్షన్లు ఎంతంటే? టాప్ 10లో 8వ ప్లేస్.. యశ్ కు రిషబ్ సపోర్ట్!

ట్రేడ్ అనలిస్ట్ సంస్థ 'సాక్‌నిల్క్' (Sacnilk) అందించిన గణాంకాల ప్రకారం, శనివారం (4వ రోజు) భారతదేశవ్యాప్తంగా 17,612 షోలో 'టాక్సిక్' చిత్రం రూ.25.15 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. దీంతో ఇప్పటివరకు ఇండియాలో ఈ సినిమా మొత్తం నెట్ వసూళ్లు రూ.191.10 కోట్లకు చేరుకోగా, గ్రాస్ వసూళ్లు రూ.228.25 కోట్లుగా నమోదయ్యాయి.

మొత్తం వసూళ్లు

మరోవైపు విదేశీ మార్కెట్లలోనూ యశ్ మేనియా కొనసాగుతోంది. శనివారం (ఆగస్టు 29) ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ చిత్రం రూ.4 కోట్ల గ్రాస్ రాబట్టింది. దీంతో విదేశాల్లో ఇప్పటివరకు సాధించిన మొత్తం గ్రాస్ కలెక్షన్లు రూ.27.25 కోట్లకు చేరుకున్నాయి. భారత్‌తో పాటు ఓవర్సీస్ వసూళ్లను కలుపుకుని, 'టాక్సిక్' ప్రపంచవ్యాప్తంగా 4 రోజుల్లో ఏకంగా రూ.255.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి సంచలనం సృష్టించింది.

నాలుగు రోజుల్లో ఇలా

టాక్సిక్ చిత్రం బుధవారం నాడు భారతదేశంలో రూ.101.10 కోట్ల భారీ నెట్ ఓపెనింగ్‌తో తన బాక్సాఫీస్ ప్రయాణాన్ని ప్రారంభించింది. అయితే, రెండో రోజున 62.8 శాతం కలెక్షన్లు పడిపోయి రూ.37.65 కోట్ల నెట్ వసూళ్లను మాత్రమే నమోదు చేసింది. ఆ తర్వాత శుక్రవారం (3వ రోజు) రూ.27.20 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం, శనివారం (4వ రోజు) రూ.25.15 కోట్లు సాధించింది.

'దృశ్యం 3' రికార్డు బ్రేక్

టాక్సిక్ సినిమాలో యశ్ పోషించిన వైలెంట్ హీరో పాత్రపై, తీవ్రమైన హింసపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో 'కాంతార' ఫేమ్, ప్రముఖ కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి.. యశ్ నిర్ణయానికి మద్దతుగా నిలిచారు. ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పందించారు.

"ఒక కళాకారుడిగా ఒక పాత్రను పోషిస్తున్నప్పుడు, ఆ పాత్రకు ప్రాణం పోయడానికి హృదయపూర్వకంగా ప్రయత్నిస్తాం. ఒక శక్తివంతమైన వ్యక్తి పడే పోరాటాన్ని, ఆవేదనను ఈ సినిమాలో చూపించిన విధానం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. సాధారణంగా సినిమాలు వెళ్లే దారిలో ఈ కథ, పాత్రలు ప్రయాణించకపోవచ్చు, అంతమాత్రాన ఆ మార్గం తప్పని కాదు. ఒక ఆలోచనను తెరపైకి తీసుకురావడానికి, దానిని సినిమాగా మలచడానికి వెనుక ఉండే శ్రమ ఎంతో గొప్పది" అని రిషబ్ శెట్టి కొనియాడారు.

మీకు జోహార్లు

"యశ్ సర్, లార్జర్ ద్యాన్ లైఫ్ నటనను కోరుకునే ఇలాంటి ఒక వైవిధ్యమైన పాత్రకు, లోకానికి మిమ్మల్ని మీరు పూర్తిగా అంకితం చేసుకున్న విధానానికి నా జోహార్లు. ప్రతి సన్నివేశంలోనూ అది నాకు స్పష్టంగా కనిపించింది. జీవితంలో నేర భావన ఎలా పెరుగుతుందో, అది జీవితంలో వినాశనాన్ని ఎలా పెంచుతుందో ప్రేక్షకులకు అనుభూతి చెందేలా చేయడం అంత తేలికైన విషయం కాదు. ఇలాంటి ధైర్యవంతమైన ప్రయోగాన్ని ప్రయత్నించినందుకు నేను మీకు మద్దతుగా నిలుస్తున్నాను సర్" అని రిషబ్ శెట్టి స్పష్టం చేశారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe