TV Actress: పదేళ్ల తర్వాత తల్లి కాబోతున్న సీరియల్ నటి.. 7 సార్లు ఐవీఎఫ్ ఫెయిల్.. చివరికి మరొకరి ద్వారా..
TV Actress: ప్రముఖ టీవీ నటి సంభావన సేథ్, రచయిత అవినాష్ ద్వివేది దంపతులు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. పెళ్లయిన పదేళ్ల తర్వాత, అనేక ఆరోగ్య సవాళ్లను అధిగమించి సరోగసీ (Surrogacy) ద్వారా తమ బిడ్డను ఆహ్వానిస్తున్నట్లు ఈ జంట సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
TV Actress: ప్రముఖ నటి, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ సంభావన సేథ్ జీవితంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. పెళ్లయి పదేళ్లు గడిచినా సంతానం కోసం ఆమె పడ్డ కష్టం, అనుభవించిన వేదన అంతా ఇంతా కాదు. తాజాగా తాను గర్భవతినని, సరోగసీ పద్ధతిలో తమ బిడ్డ త్వరలో రాబోతున్నాడని ఆమె అభిమానులతో పంచుకున్నారు.

వినూత్నంగా ప్రెగ్నెన్సీ ప్రకటన
గురువారం (ఏప్రిల్ 20) నాడు సంభావన తన భర్త అవినాష్తో కలిసి దిగిన క్యూట్ ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఇందులో ఒక ఫోటోలో వారు పట్టుకున్న న్యూస్ పేపర్పై “బ్రేకింగ్ న్యూస్.. మేము గర్భం దాల్చాము. సామ్-అవి బేబీ త్వరలో రాబోతోంది” అని రాసి ఉంది. మరో ఫోటోలో చిన్నారి బూట్లు పట్టుకుని, ఇంకో ఫోటోలో సోనోగ్రఫీ ఇమేజ్ను చూపిస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
"మా అందమైన కథ ఇప్పుడు ప్రొడక్షన్ దశలో ఉంది. ప్రేమ, ఆశ, సరోగసీ ద్వారా మా చిన్నారి రాబోతోంది. కౌంట్డౌన్ మొదలైంది" అంటూ ఈ జంట రాసుకొచ్చారు. ఈ వార్త తెలియగానే గౌహర్ ఖాన్, యువిక చౌదరి, హర్ష్ లింబాచియా వంటి సెలబ్రిటీలు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఏడు సార్లు ఐవీఎఫ్ ఫెయిల్.. కన్నీటి ప్రయాణం
ఈ సంతోషం వెనుక సంభావన ఎంతో శారీరక, మానసిక వేదనను అనుభవించారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో తన ఐవీఎఫ్ (IVF) జర్నీ గురించి చెబుతూ ఆమె కన్నీరు పెట్టుకున్నారు. సంతానం కోసం ఆమె ఏకంగా 7 సార్లు ఐవీఎఫ్ చేయించుకున్నారు.
ఈ ప్రక్రియలో ఆమెకు గర్భస్రావం కూడా అయింది. ఐవీఎఫ్ కోసం ఇచ్చే హార్మోన్ ఇంజెక్షన్ల వల్ల విపరీతంగా బరువు పెరగడమే కాకుండా, విపరీతమైన నొప్పిని భరించాల్సి వచ్చిందని ఆమె తెలిపారు.
పెళ్లికి ముందే ఆమె తన అండాలను (Eggs) ఫ్రీజ్ చేయించుకున్నప్పటికీ.. ఆ ప్రయత్నాలు ఫలించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు అన్ని దారులు మూసుకుపోయిన తరుణంలో 'సరోగసీ' ద్వారా తల్లి కావాలని నిర్ణయించుకున్నారు.
డాన్స్ షోలో మొదలైన ప్రేమ కథ
సంభావన సేథ్, అవినాష్ ద్వివేదిల పరిచయం ఒక డ్యాన్స్ రియాలిటీ షో ద్వారా మొదలైంది. 'డాన్స్ సంగ్రామ్' షోలో సంభావన జడ్జిగా ఉంటే, అవినాష్ కంటెస్టెంట్గా వచ్చారు. అక్కడే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. సంభావన తల్లి మొదట్లో ఈ పెళ్లికి ఒప్పుకోకపోయినా, వీరి ప్రేమను చూసి చివరకు అంగీకరించారు. 2016లో వీరిద్దరూ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


