Varun Tej: ఎన్టీఆర్ను సత్య అవమానించాడా? కొరియన్ కనకరాజు మూవీ వివాదంపై స్పందించిన వరుణ్ తేజ్.. ఇదీ అతని రియాక్షన్
Varun Tej on Korean Kanakaraju Trolls: కొరియన్ కనకరాజు రిలీజ్ రోజే వివాదంలో చిక్కుకుంది. సీనియర్ ఎన్టీఆర్ ను అవమానించేలా సత్య ఇందులో చేసిన యాక్ట్ తీవ్ర దుమారం రేపడంతో వరుణ్ తేజ్ దీనిపై వివరణ ఇచ్చాడు.
Varun Tej on Korean Kanakaraju Trolls: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ 'కొరియన్ కనకరాజు' థియేటర్లలో వినోదాన్ని పంచుతున్న టైమ్లో ఒక ఊహించని వివాదం తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో కమెడియన్ సత్య చెప్పిన ఒక డైలాగ్ సీనియర్ ఎన్టీఆర్ అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఈ వివాదం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడంతో వరుణ్ తేజ్ స్వయంగా ప్రెస్ మీట్లో క్లారిటీ ఇచ్చారు.

అసలు వివాదం ఏంటి? నందమూరి ఫ్యాన్స్ సీరియస్
'కొరియన్ కనకరాజు' సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ ఐకానిక్ మూవీ 'యుగపురుషుడు'లోని ఫేమస్ "అమేచ్యురిష్" డైలాగ్ను కమెడియన్ సత్య ఇమిటేట్ చేస్తూ ఒక సీన్ చేశారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ ఈ క్లిప్ని పట్టుకుని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
ఈ సీన్ లెజెండరీ నటుడు ఎన్టీఆర్ను అవమానించేలా ఉందంటూ నందమూరి అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ సీన్ను సినిమా నుంచి తక్షణమే తొలగించాలని, మెగా ఫ్యామిలీ నందమూరి అభిమానులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
"ఇది ట్రోలింగ్ కాదు.. ఇమిటేషన్ మాత్రమే!" - వరుణ్ తేజ్
ఈ వివాదం పెరగడంతో వరుణ్ తేజ్ చాలా నిదానంగా, వివేకంతో పరిస్థితిని వివరించారు. ఈ పర్టికులర్ సీన్ని గతేడాది నవంబర్లోనే షూట్ చేశామని, ఎవరి మనోభావాలు దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు.
"మనం ఇష్టపడే గ్రేట్ యాక్టర్స్ని అభిమానంతో ఇమిటేట్ చేయడం వేరు, కావాలని ట్రోల్ చేయడం వేరు. ఎవరినీ కించపరచాలనే ఆలోచన మాకు అస్సలు లేదు. కేవలం సరదాగా, ఆరోగ్యకరమైన కామెడీ కోసం మాత్రమే ఆ సీన్ చేశాం" అని వరుణ్ తేజ్ తెలిపారు.
సినిమా ప్రమోషన్ల సమయంలో తాము మెగాస్టార్ చిరంజీవి, సూపర్స్టార్ కృష్ణ లాంటి సీనియర్ లెజెండ్స్ని కూడా సరదాగా ఇమిటేట్ చేశామని గుర్తుచేశారు. ఈ డైలాగ్ను కూడా అదే పాజిటివ్ కోణంలో చూడాలని అభిమానులను కోరారు.
ఎవరినీ అగౌరవపరచాలన్న ఉద్దేశం తమకు లేదని, ఇది గమనించాలని అన్నారు. దీనిపై వివాదం ముదిరింది కదా అని అడిగినప్పుడు.. అలా అయితే చేయగలిగిందేమీ లేదని స్పష్టం చేశారు.
'కొరియన్ కనకరాజు' టాక్.. బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్
మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వచ్చిన ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్లో వరుణ్ తేజ్ సరసన రితికా నాయక్ హీరోయిన్గా నటించింది. గతంలో సీరియస్ యాక్షన్ డ్రామాలు చేసిన వరుణ్ తేజ్, ఈసారి విలేజ్ బ్యాక్డ్రాప్లో పూర్తి స్థాయి కామెడీ రోల్లో మెప్పించారు.
సినిమాకి బాక్సాఫీస్ దగ్గర డిసెంట్ టాక్ లభిస్తోంది. ముఖ్యంగా కమెడియన్ సత్య కామెడీ టైమింగ్, వరుణ్ తేజ్ బాడీ లాంగ్వేజ్ థియేటర్లలో నవ్వుల పంట పండిస్తున్నాయి.
వివాదాలు పక్కన పెడితే, ఫ్యామిలీ ఆడియన్స్ని అలరించే మంచి కామెడీ కంటెంట్తో 'కొరియన్ కనకరాజు' థియేటర్లలో జోరు చూపిస్తోంది. వరుణ్ తేజ్ ఇచ్చిన క్లారిటీతో ఈ వివాదానికి ఫుల్స్టాప్ పడినట్లే కనిపిస్తోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


