...
...
Next Story

Raja Sen: షూటింగ్ సెట్‌లో గాయం.. వెంటిలేటర్‌పై 3 నేషనల్ అవార్డ్స్ డైరెక్టర్.. అత్యంత విషమంగా ఆరోగ్య పరిస్థితి!

Director Raja Sen Hospitalised Critical Condition: దిగ్గజ దర్శకుడు, మూడుసార్లు జాతీయ అవార్డు పొందిన రాజా సేన్ తీవ్ర అనారోగ్యంతో కోల్‌కతాలోని ఓ ఆసుపత్రిలో చేరారు. షూటింగ్ సెట్‌లో గాయపడిన ఆయన ప్రస్తుతం నరాల సంబంధిత సమస్యలు, వయోభారంతో బాధపడుతూ అత్యవసర విభాగంలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు.

Published on: Aug 16, 2026, 11:21:46 IST
Advertisement

Director Raja Sen Hospitalised Critical Condition: భారతీయ చిత్ర పరిశ్రమలో, ముఖ్యంగా బెంగాలీ సినిమాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు రాజా సేన్ (70) పరిస్థితి అత్యంత విషమంగా మారింది. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను శనివారం (ఆగస్ట్ 15) కోల్‌కతాలోని ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రి SSKMలో చేర్చారు.

షూటింగ్ సెట్‌లో పడిన దెబ్బతో మొదలైన కష్టాలు

షూటింగ్ సెట్‌లో గాయం.. వెంటిలేటర్‌పై 3 నేషనల్ అవార్డ్స్ డైరెక్టర్.. అత్యంత విషమంగా ఆరోగ్య పరిస్థితి!
షూటింగ్ సెట్‌లో గాయం.. వెంటిలేటర్‌పై 3 నేషనల్ అవార్డ్స్ డైరెక్టర్.. అత్యంత విషమంగా ఆరోగ్య పరిస్థితి!

వైద్యులు రాజా సేన్‌ను నిశితంగా పర్యవేక్షిస్తూ, వెంటిలేటర్‌పై ఉంచి అత్యవసర చికిత్స అందిస్తున్నారని సినీ వర్గాలు వెల్లడించాయి. కొన్నేళ్ల క్రితం 'మాయా మృదంగ' సినిమా చిత్రీకరణ సమయంలో సెట్‌లోనే అనుకోకుండా కిందపడిన రాజా సేన్ తీవ్రమైన వెన్నుగాయానికి గురయ్యారు.

పాత గాయం తిరగబెట్టడంతో

ఆ సమయంలో ఆ గాయాన్ని అంతగా పట్టించుకోకపోయినా, రానురానూ అది రాజా సేన్ కదలికలను పూర్తిగా దెబ్బతీసింది. వయోజన సహజ సమస్యలతో పాటు ఈ పాత గాయం తిరగబెట్టడంతో రాజా సేన్ ఆరోగ్యం క్షీణించింది.

నాడీ సంబంధిత సమస్య, పెద్ద సర్జరీ

ఈ ఏడాది ప్రారంభంలో రాజా సేన్ దిగువ శరీర భాగాల్లో తీవ్ర బలహీనత ఏర్పడింది. వైద్య పరీక్షలు నిర్వహించగా క్లిష్టమైన నాడీ సంబంధిత (Neurological) సమస్య ఉన్నట్లు తేలింది. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయనకు ఒక పెద్ద సర్జరీ కూడా జరిగింది. శస్త్రచికిత్స తర్వాత కోలుకుంటున్నట్లే కనిపించినా, ఇటీవల ఆయన ఆరోగ్యం మళ్లీ క్షీణించడంతో కుటుంబ సభ్యులు, బెంగాలీ సినీ వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

డాక్యుమెంటరీ దర్శకుడిగా ప్రస్థానం

1955లో కోల్‌కతాలో జన్మించిన రాజా సేన్, 90వ దశకంలో తన అద్భుతమైన దర్శకత్వ ప్రజ్ఞతో బెంగాలీ పరిశ్రమలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. డాక్యుమెంటరీ దర్శకుడిగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన, 1993లో 'సుచిత్ర మిత్ర' అనే డాక్యుమెంటరీ ఫీచర్‌కు గానూ ఉత్తమ కళా/సాంస్కృతిక చిత్రం విభాగంలో మొదటి జాతీయ అవార్డును అందుకున్నారు.

మూడు జాతీయ అవార్డుల విజేత

రాజా సేన్ తీసిన 'ల్యాబొరేటరీ' వంటి చిత్రాలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో సైతం ప్రశంసలు అందుకున్నాయి. రాజా సేన్ త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు ప్రార్థిస్తున్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. ప్రముఖ దర్శకుడు రాజా సేన్ ఏ ఆసుపత్రిలో చేరారు?

ఆయన కోల్‌కతాలోని ప్రభుత్వ నిర్వహణలో ఉన్న SSKM ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు.

2. రాజా సేన్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడానికి ప్రధాన కారణం ఏమిటి?

కొన్నేళ్ల క్రితం సినిమా షూటింగ్ సమయంలో వెన్నుముకకు తగిలిన గాయం కాలక్రమేణా నాడీ సంబంధిత (నరాల) సమస్యగా మారింది. శస్త్రచికిత్స జరిగినప్పటికీ వయోభారం వల్ల ఆరోగ్యం మరింత క్షీణించింది.

3. రాజా సేన్ ఎన్ని జాతీయ చలనచిత్ర అవార్డులను గెలుచుకున్నారు?

ఆయన సుచిత్ర మిత్ర (1993), దాము (1997), ఆత్మీయ స్వజన్ (1999) చిత్రాలకు గానూ మొత్తం మూడు జాతీయ అవార్డులను అందుకున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe