...
...
Next Story

విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి మాటల్లేని సినిమా.. ఓటీటీలోకి గాంధీ టాక్స్..

విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి నటించిన మాటల్లేని మూవీ గాంధీ టాక్స్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ పై తాజాగా ఓ బజ్ నెలకొంది. మరి ఈ సినిమా ఎక్కడ చూడాలి? థియేటర్లలో మూవీకి వచ్చిన రెస్పాన్స్ ఏంటనేది చూడండి.

Published on: Feb 11, 2026, 22:06:44 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితీ రావు హైదరీ ప్రధాన పాత్రల్లో నటించిన ప్రయోగాత్మక సైలెంట్ మూవీ 'గాంధీ టాక్స్'. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా జనవరి 30న థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. స్ట్రీమింగ్ వివరాలు ఇక్కడ చూడండి.

గాంధీ టాక్స్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనా?

విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి మాటల్లేని సినిమా.. ఓటీటీలోకి గాంధీ టాక్స్..
విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి మాటల్లేని సినిమా.. ఓటీటీలోకి గాంధీ టాక్స్..

కిశోర్ పాండురంగ బెలెకర్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితీ రావు హైదరీ నటించిన మూవీ 'గాంధీ టాక్స్' (Gandhi Talks). గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (IFFI)లో ప్రదర్శితమైన మూడేళ్ల తర్వాత.. ఈ ఏడాది జనవరి 30న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఇందులో మాటలు ఉండవు, కేవలం సంగీతం, హావభావాలే ప్రధానం. ఏ.ఆర్. రెహమాన్ (AR Rahman) అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజికే సినిమాకు ప్రధాన బలం.

ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5) దక్కించుకుంది. థియేటర్లలో విడుదలైన నెలలోపే ఈ సినిమా ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం. సోషల్ మీడియాలో వినిపిస్తున్న బజ్ ప్రకారం.. ఫిబ్రవరి 26 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.

గాంధీ టాక్స్ మూవీ కథ, విశేషాలు

డబ్బు, అవినీతి మనిషి జీవితాన్ని ఎలా శాసిస్తాయి అనేదే ఈ గాంధీ టాక్స్ సినిమా ఇతివృత్తం. గాంధీ బొమ్మ ఉన్న కరెన్సీ నోట్లు మనుషుల నిజాయితీని ఎలా మారుస్తాయో ఇందులో చూపించారు. లంచం ఇవ్వలేక ఉద్యోగం రాని ఒక యువకుడు (విజయ్ సేతుపతి), అవినీతి వల్ల సామ్రాజ్యం కూలిపోతున్న ఒక సంపన్నుడు (అరవింద్ స్వామి).. వీరిద్దరి ప్రపంచాలు ఒకచోట కలిసినప్పుడు ఏం జరిగింది అనేదే కథ.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe