OTT: మాటలు లేని సినిమా.. విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి మూవీ వచ్చేది ఈ ఓటీటీలోకే.. ఓ లుక్కేయండి
విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితి రావ్ హైదరీ, సిద్ధార్థ జాదవ్ ప్రధాన పాత్రల్లో నటించిన సైలెంట్ మూవీ ‘గాంధీ టాక్స్’. ఇందులో అసలు డైలాగ్ లే ఉండవు. మాటలు లేని మూకీ మూవీ ఇది. ఈ చిత్రం ఏ ఓటీటీలోకి వస్తుందో ఇక్కడ చూసేయండి.
ఈ రోజుల్లో మాటలు లేని సినిమా తీయడం రిస్క్. కానీ విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి లాంటి స్టార్ నటులతో మేకర్స్ ఆ రిస్క్ చేశారు. ఎలాంటి డైలాగ్ లు లేని మూకీ సినిమాగా ‘గాంధీ టాక్స్’ను తెరకెక్కించారు. జనవరి 30న థియేటర్లలో రిలీజైంది ఈ మూవీ. ఈ నేపథ్యంలో గాంధీ టాక్స్ ఓటీటీ రిలీజ్ పై ఇంట్రెస్ట్ నెలకొంది.

గాంధీ టాక్స్ ఓటీటీ
ఇటీవల థియేటర్లలో విడుదలైన లేటెస్ట్ సైలెంట్ కామెడీ డ్రామా 'గాంధీ టాక్స్'. విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా విమర్శకుల నుంచి పాజిటివ్ రియాక్షన్స్ రాబడుతోంది. ఈ నేపథ్యంలో ఏ ఓటీటీలోకి సినిమా వస్తుందనేది ఇంట్రెస్ట్ కలిగిస్తోంది. ఓటీటీ ప్లే రిపోర్ట్ ప్రకారం గాంధీ టాక్స్ మూవీ జీ5 ఓటీటీలోకి రానుంది.
ఓటీటీ రిలీజ్
'గాంధీ టాక్స్' సినిమా జీ5లో తన ఓటీటీ డెబ్యూ చేయడం ఖాయమైంది. ఈ సినిమా రిలీజ్ కంటే ముందే జీ5తో ఓటీటీ డీల్ జరిగింది. ఇప్పుడు థియేటర్లలో ఆడుతోంది గాంధీ టాక్స్. మరి ఓటీటీ రిలీజ్ ఎప్పుడనే ప్రశ్న రావడం సహజమే. సాధారణంగా తమిళ సినిమాలు నాలుగు వారాల థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీలోకి వస్తుంటాయి. ఇప్పుడు గాంధీ టాక్స్ కూడా ఇదే పద్ధతిలో ఫిబ్రవరి చివరి వారంలో ఓటీటీలోకి వచ్చే అవకాశముంది.
గాంధీ టాక్స్ గురించి
'గాంధీ టాక్స్' ఒక సైలెంట్ సినిమా. డైలాగ్ లు లేకుండా తెరకెక్కిన అరుదైన మూవీ ఇది. ఇది మనీ అవసరమైన ఈ నిరుద్యోగి చుట్టూ సాగుతోంది. అతను అప్పటికే నష్టాల్లో ఉన్న ఓ బిజినెస్ మ్యాన్ ను దోచుకుంటాడు.
కిశోర్ పాండురంగ్ బెలేకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితి రావ్ హైదరీ, సిద్ధార్థ జాదవ్ తదితరులు నటించారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ మూవీకి బలం.
అక్కడ ప్రీమియర్
గాంధీ టాక్స్ 2023లో భారతీయ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రీమియర్ అయింది. ఇది జనవరి 30, 2026న థియేటర్లలో విడుదలైంది. దీనికి జీ స్టూడియోస్, క్యూరియస్, పింక్మూన్ మెటా స్టూడియోస్, మూవీమిల్ సపోర్ట్ ఇచ్చాయి.
గాంధీ టాక్స్ మూవీని సైలెంట్ గా తీయడంపై డైరెక్టర్ కిశోర్ మాట్లాడుతూ.. ‘‘డబ్బు, అధికారంలో చాలా శబ్దం ఉంది కాబట్టే ఈ సినిమా సైలెంట్ గా ఉంటుంది. ఎందుకంటే నిజం చాలా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంటుంది. కథలో మేము చాలా నిజాయితీగల పాత్రలను సృష్టించాం. వాళ్లు సత్య మార్గంలో నడుస్తారు. అందుకే సినిమా సైలెంట్" అని అన్నారు.

E-Paper












