Virat Anushka: ఐపీఎల్ 2026 ఫైనల్లో ఆర్సీబీ.. విక్టరీ తర్వాత కోహ్లి ఏం చేశాడో తెలుసా? అనుష్కకు టైట్ హగ్.. వీడియోలు వైరల్
Virat Anushka: ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్ 1లో గుజరాత్ టైటాన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించి ఫైనల్కు దూసుకెళ్లింది. ఈ చారిత్రాత్మక విజయం తర్వాత విరాట్ కోహ్లీ మైదానంలో భార్య అనుష్క శర్మను కౌగిలించుకున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Virat Anushka: ఐపీఎల్ 2026లో ఆర్సీబీ ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే గుజరాత్ టైటాన్స్ తో ధర్మశాలలో జరిగిన ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లి భార్య అనుష్క శర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ బాలీవుడ్ హీరోయిన్ స్టేడియంలో కూర్చొని తన భర్త విరాట్ కోహ్లీని, ఆర్సీబీ జట్టును ఎంకరేజ్ చేసింది. మ్యాచ్ ముగిసిన తర్వాత అనుష్కను విరాట్ హగ్ చేసుకోవడం వైరల్ గా మారింది.

అనుష్కకు విరాట్ హగ్
ఐపీఎల్ 2026 క్వాలిఫయర్ 1 మ్యాచ్లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ఐపీఎల్ 2026 ఫైనల్స్లోకి దూసుకెళ్లింది. ఈ విజయానందంలో విరాట్ కోహ్లీ నేరుగా అనుష్క ఉన్న వైపు పరిగెత్తుకుంటూ వెళ్లాడు. ఆమెను ప్రేమతో గట్టిగా హగ్ చేసుకుని తన ఆనందాన్ని పంచుకున్నాడు.
సోషల్ మీడియాలో వైరల్
మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. విరాట్, అనుష్క శర్మల మధ్య ఉన్న అన్యోన్యత, కెమిస్ట్రీని చూసి అభిమానులు మురిసిపోతున్నారు. నెటిజన్లు ఈ ‘విరుష్క’ జంటపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
మైదానంలో విరుష్క
మంగళవారం (మే 26) ధర్మశాల వేదికగా జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ను ఓడించడం ద్వారా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2026 ఫైనల్స్లోకి అడుగుపెట్టింది. ఈ మ్యాచ్లో జట్టు సాధించిన విజయంతో పాటు విరాట్, అనుష్కల మధ్య చోటుచేసుకున్న ముచ్చటైన క్షణాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకోవడం, విజయాన్ని పంచుకోవడం వంటి దృశ్యాలు స్టేడియంలోని వాతావరణాన్ని మరింత ఉల్లాసంగా మార్చేశాయి.
భార్యతో మాటలు
వీటికి సంబంధించిన పలు వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఆర్సీబీ విజయం సాధించి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్న వెంటనే, విరాట్ కోహ్లీ నేరుగా భార్య అనుష్క వద్దకు వెళ్లి గట్టిగా కౌగిలించుకోవడం ఒక వీడియోలో కనిపించింది. మరో క్లిప్లో మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే విరాట్ మైదానం నుంచే అనుష్కతో మాట్లాడుతుండటం విశేషం.
అనుష్క ఎమోషన్స్
మరోవైపు అనుష్క శర్మ స్టాండ్స్ నుంచి ఆర్సీబీ జట్టును ఎంతో ఉత్సాహంగా ప్రోత్సహిస్తూ కనిపించింది. మ్యాచ్ అత్యంత కీలక దశకు చేరుకున్నప్పుడు ఆమె ముఖంలో టెన్షన్, భావోద్వేగాలు స్పష్టంగా కనిపించాయి. సాధారణంగా తన వ్యక్తిగత విషయాలను చాలా రహస్యంగా ఉంచే అనుష్క, స్టేడియంలో ఒక అభిమాని తన పేరును గట్టిగా పిలవడంతో, అతడి వైపు తిరిగి నవ్వుతూ చేతులు ఊపడం కూడా నెటిజన్లను ఆకట్టుకుంది.
అభిమానుల రియాక్షన్
ఈ అందమైన క్షణాలపై అభిమానులు సామాజిక మాధ్యమాల్లో రకరకాలుగా స్పందిస్తున్నారు. "ప్రతి విజయవంతమైన పురుషుడి వెనుక ఒక శక్తివంతమైన స్త్రీ ఉంటుంది" అని ఒక అభిమాని రాయగా, "ఆమె మన లేడీ లక్. ఐపీఎల్ 2026లో అనుష్క శర్మ మ్యాచ్ చూడటానికి వచ్చినప్పుడల్లా ఆర్సీబీ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు" అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.
"తన భార్య అనుష్కను అభినందించడంలో విరాట్ కోహ్లీ ఎప్పుడూ వెనకడుగు వేయడు" అని మరొకరు పేర్కొన్నారు. "మ్యాచ్ ముగిసిన తర్వాత అత్యంత అందమైన క్షణం ఇది. విజయానందం, ముఖంలో ప్రశాంతత.. మ్యాచ్ పూర్తయ్యాక విరాట్ కోహ్లీ తన భార్యను హగ్ చేసుకోవడం చూస్తుంటే ముచ్చటేస్తోంది" అని ఒక అభిమాని రాసుకొచ్చారు.
"ఫైనల్కు క్వాలిఫై అయిన తర్వాత విరాట్ కోహ్లీ వచ్చి అనుష్కను హగ్ చేసుకున్న విధానం అద్భుతం. విరుష్క కెరీర్లోనే ఇది క్యూటెస్ట్ మూమెంట్" అని మరొకరు ట్వీట్ చేశారు. "మ్యాచ్ సమయంలో విరాట్, అనుష్క ఎంతో సరదాగా మాట్లాడుకుంటున్నారు. విరాట్ కేవలం మ్యాచ్ మాత్రమే కాదు, తన భార్య మనసును కూడా గెలుచుకున్నాడు" అని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ప్రశ్న 1: ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్ 1 మ్యాచ్ ఎక్కడ జరిగింది? ఎవరు గెలిచారు?
జవాబు: ఈ మ్యాచ్ ధర్మశాల వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య జరిగింది. ఇందులో ఆర్సీబీ 92 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్కు చేరింది.
ప్రశ్న 2: గుజరాత్ టైటాన్స్పై ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించింది ఎవరు?
జవాబు: కెప్టెన్ రజత్ పాటిదార్ 33 బంతుల్లో 93 పరుగులతో నాటౌట్గా నిలిచి అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. విరాట్ కోహ్లీ, కృనాల్ పాండ్యా బ్యాటింగ్తో పాటు భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ బౌలింగ్లో రాణించారు.
ప్రశ్న 3: విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలకు ఎంతమంది పిల్లలు ఉన్నారు?
జవాబు: వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్తె పేరు వామిక (2021లో జన్మించింది), కుమారుడి పేరు అకాయ్ (2024లో జన్మించాడు).
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


