Sehwag Review: టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తాజాగా ఒక డివోషనల్ మూవీ చూసి పూర్తిగా భావోద్వేగానికి గురయ్యారు. ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా (Neem Karoli Baba) జీవిత ఆధారంగా తెరకెక్కిన 'హనుమాన్ అంశ్' (Hanuman Ansh) సినిమాను చూసిన సెహ్వాగ్.. ఆ అనుభవాన్ని వివరిస్తూ ఒక లైవ్ ఇన్స్టాగ్రామ్ వీడియో షేర్ చేశారు.
"కొన్ని అనుభవాలను వర్ణించడానికి మాటలు సరిపోవు!"

ఇన్స్టాగ్రామ్ వీడియోలో సెహ్వాగ్ మాట్లాడుతూ.. "కొన్ని అనుభవాలు, కొందరు వ్యక్తుల గురించి చెప్పడానికి మన దగ్గర పదాలు చాలవు. ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. నా అత్యంత ఆత్మీయ మిత్రులలో కొందరు నీమ్ కరోలి బాబా భక్తులు. దాదాపు 10 ఏళ్ల క్రితం ఒక స్నేహితుడు నాకు మహారాజ్ జీ గురించి చెప్పాడు. నాటి నుంచి ఆయన వ్యక్తిత్వం, భక్తి, ఆశీస్సుల గురించి వింటూనే ఉన్నాను" అని చెప్పారు.
మహారాజ్ జీ అనుగ్రహం మనుషులలోని నిజమైన తత్వాన్ని బయటకు తెస్తుందని సెహ్వాగ్ వ్యాఖ్యానించారు. ఈ సినిమా ఆయన జీవితానికి ఇచ్చిన అద్భుతమైన నివాళి అని కొనియాడారు.
సెహ్వాగ్ను కదిలించిన ఆ ఒక్క సీన్
సినిమాలో తనకు బాగా నచ్చిన ఒక సన్నివేశాన్ని ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు సెహ్వాగ్. "మహారాజ్ జీ చుట్టూ పాములు ఉన్నప్పుడు, ఒక భక్తుడు వచ్చి ఆయనను శివుడిలాగే ఎంతో అమాయకుడని అంటాడు. దానికి మహారాజ్ జీ స్పందిస్తూ.. 'అమాయకుడు నేను కాదు, నువ్వు. మన హృదయంలో ఏది ఉందో మన కళ్ళు దాన్నే చూస్తాయి' అని బదులిస్తారు. ఈ సీన్ నన్ను ఎంతగానో తాకింది" అని చెప్పారు.
మన దేశ చరిత్రలో ఇలాంటి గొప్ప సాధువులు చాలా అరుదుగా జన్మిస్తారని తెలిపారు. బాబాను పూర్తిగా అర్థం చేసుకోవడం అసాధ్యమైనా, ఆయన దివ్యత్వాన్ని ఒక క్షణం దర్శించడం సాధ్యమని, ఆ అనుభూతిని 'హనుమాన్ అంశ్' సినిమా చాలా బాగా అందించింది అని సెహ్వాగ్ పేర్కొన్నారు.
సైలెంట్గా వచ్చి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్
{{/usCountry}}మన దేశ చరిత్రలో ఇలాంటి గొప్ప సాధువులు చాలా అరుదుగా జన్మిస్తారని తెలిపారు. బాబాను పూర్తిగా అర్థం చేసుకోవడం అసాధ్యమైనా, ఆయన దివ్యత్వాన్ని ఒక క్షణం దర్శించడం సాధ్యమని, ఆ అనుభూతిని 'హనుమాన్ అంశ్' సినిమా చాలా బాగా అందించింది అని సెహ్వాగ్ పేర్కొన్నారు.
సైలెంట్గా వచ్చి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్
{{/usCountry}}విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చందన్ ఆనంద్, శోభినవ్ సత్య ప్రధాన పాత్రల్లో నటించారు. థియేటర్లలో విడుదలైన తొలి రోజుల్లో పెద్దగా పబ్లిసిటీ లేకపోయినా, మెల్లగా పాజిటివ్ 'వర్డ్ ఆఫ్ మౌత్' తో బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లు సాధిస్తోంది. కేవలం రూ.2 కోట్లతో తెరకెక్కించగా.. ఇప్పటికే రూ.54 కోట్లకుపైగా వసూలు చేసింది.
తల్లిని కోల్పోయిన ఒక చిన్నారి దేవుడి కోసం వెతికే క్రమంలో నీమ్ కరోలి బాబాని కలవడం, మానవత్వానికి సేవ చేయడమే అసలైన భక్తి అని తెలుసుకోవడం ఈ చిత్ర కథాంశం. ఈ సినిమాను బాబా గురించి తెలిసిన వాళ్లతో పాటు తెలియని వాళ్లు కూడా తప్పకుండా చూడాలని సెహ్వాగ్ కోరారు.