Today OTT: బ్లాక్ మనీ కోసం ఫ్లాప్ సినిమా.. టెర్రరిస్ట్ ల ఎంట్రీ.. ఇవాళ ఓటీటీలోకి వచ్చిన కామెడీ మూవీ.. మంచి టైమ్పాస్
Today OTT: అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి నటించిన భారీ మల్టీస్టారర్ కామెడీ చిత్రం 'వెల్కమ్ టు ది జంగిల్' ఓటీటీలోకి వచ్చేసింది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం కడుపుబ్బా నవ్విస్తుంది. స్క్రీన్ నిండా స్టార్లతో కనిపించే ఈ మూవీని ఏ ఓటీటీలో చూడాలో తెలుసా?
Today OTT: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా, భారీ తారగణంతో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ 'వెల్కమ్ టు ది జంగిల్' (Welcome to the Jungle) డిజిటల్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో విడుదలైన సమయంలో మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీ లవర్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేసింది.

వెల్కమ్ టు ది జంగిల్ ఓటీటీ
బాలీవుడ్ లో రీసెంట్ టైమ్స్ లో డీసెంట్ హిట్ గా నిలిచిన వెల్కమ్ టు ది జంగిల్ మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఇవాళ (ఆగస్టు 21) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ జియోహాట్స్టార్ (JioHotstar) వేదికగా ఈ సినిమా ఆగస్టు 21, 2026 నుంచి ఓటీటీ లవర్స్ కు అందుబాటులోకి వచ్చింది.
థియేట్రికల్ రన్
ఈ ఏడాది జూన్ 26న థియేటర్లలో విడుదలైన ఈ వెల్కమ్ టు ది జంగిల్ మూవీ.. 2007లో వచ్చిన ఆల్ టైమ్ హిట్ మూవీ 'వెల్కమ్' సాధించినంత విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే కామెడీతో మాత్రం ఒక వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. సినిమా నిర్మాణ సమయంలో ఎన్నో రకాల వివాదాలు, అడ్డంకులు ఎదురైనప్పటికీ, థియేటర్లలో విడుదలయ్యాక ఈ కామెడీ ఎంటర్ టైనర్ ను ఆడియన్స్ ఆదరించడం చిత్రబృందానికి ఊరటనిచ్చింది.
స్టోరీ ఏంటంటే?
అండర్ వరల్డ్ బిజినెస్ మ్యాన్ అయిన సిన్హా (జాకీర్ హుస్సేన్) తన దగ్గర ఉన్న బ్లాక్ మనీ రూ.2 వేల కోట్లను వైట్ మనీగా మార్చాలనుకుంటాడు. అందుకే ఓ సినిమా తీయాలనుకుంటాడు. కానీ అది బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ కావాలని కండీషన్ పెడతాడు. ఈ సినిమాలో ఫేమ్ కోల్పోయిన రాజీవ్ (అక్షయ్ కుమార్) హీరో.
ఈ మూవీ షూటింగ్ ఆజాద్ పూర్ అనే ఊర్లో జరుగుతుంది. అక్కడివాళ్లంతా వీళ్లను చూసి టెర్రరిస్ట్ ల నుంచి కాపాడేందుకు వచ్చారని అనుకుంటారు. అప్పుడే మూవీలోకి రియల్ విలన్స్ ఎంట్రీ ఇస్తారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందన్నదే సినిమా కథ.
భారీ తారగణం
ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర నటులందరూ ఒకే వేదికపై కనిపించడం విశేషం. అక్షయ్ కుమార్తో పాటు అర్షద్ వార్సీ, సునీల్ శెట్టి, పరేష్ రావల్, దిశా పటానీ, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, రవీనా టాండన్, లారా దత్తా, తుషార్ కపూర్, శ్రేయస్ తల్పాడే, అఫ్తాబ్ శివదాసాని, జాకీ ష్రాఫ్ వంటి స్టార్లు నటించారు.
ఈ చిత్రానికి అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహించారు. దివంగత ప్రముఖ రచయిత నీరజ్ వోరా ఈ సినిమాకు కథ అందించగా, ఫర్హాద్ సామ్జీ సంభాషణలు రాశారు.
స్ట్రీమింగ్ వివరాలు
థియేట్రికల్ ప్రదర్శన ముగిసిన తర్వాత ఆగస్టు 21, 2026 నుంచి ఈ చిత్రం జియోహాట్స్టార్ డిజిటల్ వేదికపై వీక్షకులకు అందుబాటులోకి వచ్చింది. వీకెండ్ లో సరదాగా కుటుంబంతో కలిసి నవ్వుకునే ఒక చిత్రాన్ని చూడాలనుకునే వారికి ఈ మల్టీస్టారర్ సినిమా మంచి ఎంపికగా నిలుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


