Toxic OTT: టాక్సిక్ ఓటీటీ.. బాక్సాఫీస్ డిజాస్టర్.. అప్పుడు రూ.150 కోట్ల ఓటీటీ డీల్ వద్దనుకున్నారు.. ఇప్పుడు 30 కోట్లే?

Toxic OTT: టాక్సిక్ మూవీ మేకర్స్ కు దిమ్మదిరిగే షాక్ తగిలేలా ఉంది. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలిపోవడంతో ఇప్పుడు ఓటీటీ డీల్ లో భారీ కోత పడేలా ఉంది. మొదట వచ్చిన ఆఫర్ లో 80 శాతం కోల్పోవడం గమనార్హం.

Published on: Sep 7, 2026, 13:01:11 IST
By , Hydearabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Toxic OTT: కేజీఎఫ్ ఛాప్టర్ 2తో ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసిన రాకింగ్ స్టార్ యశ్ లేటెస్ట్ ప్యాన్ ఇండియా మూవీ 'టాక్సిక్' మేకర్స్‌కు కోలుకోలేని షాక్ తగిలింది. థియేటర్లలో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచిన ఈ సినిమా.. డిజిటల్, శాటిలైట్ హక్కులు అమ్ముడుపోక తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. విడుదలకి ముందు రూ. 200 కోట్లు డిమాండ్ చేసిన నిర్మాతలకు ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కేవలం రూ. 30 కోట్లు మాత్రమే ఆఫర్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Toxic OTT: టాక్సిక్ ఓటీటీ.. బాక్సాఫీస్ డిజాస్టర్.. అప్పుడు రూ.150 కోట్ల ఓటీటీ డీల్ వద్దనుకున్నారు.. ఇప్పుడు 30 కోట్లే?
Toxic OTT: టాక్సిక్ ఓటీటీ.. బాక్సాఫీస్ డిజాస్టర్.. అప్పుడు రూ.150 కోట్ల ఓటీటీ డీల్ వద్దనుకున్నారు.. ఇప్పుడు 30 కోట్లే?

150 కోట్ల ఆఫర్‌ను తిరస్కరించి కొంపముంచుకున్న మేకర్స్

థియేట్రికల్ రిలీజ్‌కి ముందు 'టాక్సిక్' సినిమాపై ఉన్న విపరీతమైన అంచనాల నేపథ్యంలో ఒక ప్రముఖ లీడింగ్ ఓటీటీ సంస్థ ఏకంగా రూ. 150 కోట్ల భారీ ఆఫర్‌తో ముందుకు వచ్చింది. అయితే తమ సినిమా కచ్చితంగా ఆల్-టైమ్ బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుందని, రిలీజ్ తర్వాత రూ. 200 కోట్లకు పైగా డిజిటల్ డీల్ వర్కౌట్ చేయవచ్చని మేకర్స్ ఆ ఆఫర్‌ను నిర్దాక్షిణ్యంగా తిరస్కరించినట్లు బాలీవుడ్ మీడియా వర్గాలు వెల్లడించాయి.

తీరా సినిమా థియేటర్లలోకి వచ్చాక ఆడియన్స్ నుంచి తీవ్రమైన నెగటివ్ టాక్ రావడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడింది. కేజీఎఫ్ సిరీస్‌తో సంపాదించుకున్న భారీ ఇమేజ్‌తో పాన్ ఇండియా మార్కెట్‌ను ఏలాలని చూసిన యశ్ కి ఈ ఘోర పరాజయం ఊహించని షాక్ ఇచ్చింది.

30 కోట్లకు పడిపోయిన డిజిటల్ వాల్యూ.. రేసులో జీ5?

సినిమా థియేట్రికల్ రిజల్ట్ తేడా కొట్టడంతో ఓటీటీ డిజిటల్ సంస్థలు తమ ఆఫర్లను దారుణంగా తగ్గించేశాయి. ప్రస్తుతం అత్యధికంగా 'జీ5' (Zee5) సంస్థ కేవలం రూ. 30 కోట్ల వరకు డిజిటల్ హక్కుల కోసం ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

చేసిన భారీ పెట్టుబడుల్లో కనీస నష్టాలను పూడ్చుకోవడానికి నిర్మాతలు ఇప్పుడు ఈ ఆఫర్‌కే అంగీకరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు రూ. 200 కోట్ల రేంజ్ అనుకున్న డీల్.. ఇప్పుడు రూ. 30 కోట్లకు పడిపోవడం యశ్ అభిమానులను సైతం తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.

'A' సర్టిఫికేట్ వల్ల శాటిలైట్ హక్కులకు కూడా భారీ కోత

ఓటీటీ డిజిటల్ రైట్స్ మాత్రమే కాదు, టీవీ శాటిలైట్ రైట్స్ విషయంలోనూ మేకర్స్‌కు పెద్ద చిక్కే వచ్చిపడింది. సినిమాలో మోతాదుకు మించిన వయొలెన్స్, అడల్ట్ కంటెంట్ ఉండటంతో సెన్సార్ బోర్డ్ 'A' (అడల్ట్) సర్టిఫికేట్ ఇచ్చింది.

దీంతో ప్రముఖ టీవీ ఛానెళ్లు ఈ సినిమా శాటిలైట్ హక్కులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ టీవీల్లో చూసే అవకాశం లేకపోవడంతో శాటిలైట్ రైట్స్ నుంచి వచ్చే రాబడి కూడా చాలా పరిమితంగానే ఉండబోతోందని స్పష్టమవుతోంది.

అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిన రాకింగ్ స్టార్ యవ్

'కేజీఎఫ్ 2' తర్వాత దాదాపు మూడేళ్లు గ్యాప్ తీసుకుని గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో యశ్ ప్లాన్ చేసిన ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇలా డిజాస్టర్‌గా మారడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినిమా ప్రమోషన్ల సమయంలో ఎంతో కాన్ఫిడెంట్‌గా కనిపించిన యశ్.. ప్రస్తుతం ఎక్కడా పబ్లిక్‌గా కనిపించకుండా సైలెంట్‌గా ఉండిపోయారు.

సోషల్ మీడియాలో, బహిరంగ కార్యక్రమాల్లో ఆయన కనిపించకపోవడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. రాబోయే ప్రాజెక్టుల విషయంలోనైనా కథల ఎంపికలో యశ్ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సినీ విశ్లేషకులు సూచిస్తున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More