నీకు పాన్ మసాలా యాడ్ అవసరమా.. రూ.12 వేల కోట్లకుపైగా సంపద.. వడ్డీయే 500 కోట్లు వస్తుంది: షారుక్‌ను ఏకిపారేసిన ధృవ్ రాఠీ

యూట్యూబర్ ధృవ్ రాఠీ ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ ను ఏకిపారేశాడు. ఓ బిలియనీర్‌వి అయినా కూడా.. పాన్ మసాలా యాడ్ నీకు అవసరమా అంటూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Published on: Oct 16, 2025 4:13 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

యూట్యూబర్ ధ్రువ్ రాఠీ.. బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ ఆస్తి, బ్రాండ్ యాడ్స్ గురించి ఒక వీడియో షేర్ చేసి ఆన్‌లైన్‌లో ఒక చర్చను మొదలుపెట్టాడు. బుధవారం (అక్టోబర్ 15) ఎక్స్ లో పెట్టిన ఒక పోస్ట్‌లో.. ఈ 'జవాన్' యాక్టర్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన ఎంటర్‌టైనర్లలో ఒకరని, అతని ఆస్తి సుమారుగా 1.4 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.12,400 కోట్లు) అని చెబుతున్న రిపోర్ట్‌ల గురించి ధ్రువ్ మాట్లాడాడు.

నీకు పాన్ మసాలా యాడ్ అవసరమా.. రూ.12 వేల కోట్లకుపైగా సంపద.. వడ్డీయే 500 కోట్లు వస్తుంది: షారుక్‌ను ఏకిపారేసిన ధృవ్ రాఠీ
నీకు పాన్ మసాలా యాడ్ అవసరమా.. రూ.12 వేల కోట్లకుపైగా సంపద.. వడ్డీయే 500 కోట్లు వస్తుంది: షారుక్‌ను ఏకిపారేసిన ధృవ్ రాఠీ

పాన్ మసాలా యాడ్ అవసరమా?

పాన్ మసాలాను ప్రమోట్ చేయాల్సిన అవసరం షారుక్ కు ఏముంది అని ప్రశ్నించిన ధ్రువ్ రాఠీ ఆ వీడియోలో ఇలా అన్నాడు.. “షారుక్ ఖాన్ ఇప్పుడు ఒక బిలియనీర్ అయిపోయాడు. అతని ఆస్తి 1.4 బిలియన్‌ డాలర్లకి చేరింది. మన కరెన్సీలో చెప్పాలంటే అది దాదాపు రూ.12,400 కోట్లు. దాన్ని ఊహించుకోవడం కూడా కష్టం” అని రాఠీ అన్నాడు.

ఆ తర్వాత ఆ సంపదపై షారుక్ కి ఎంత వడ్డీ రావచ్చో, అతని ఏడాది ఖర్చు ఎలా ఉండొచ్చో ఊహించాడు. అందులో లగ్జరీ ఇళ్లు, ఒక ప్రైవేట్ జెట్, హాలిడేస్ ఖర్చులు కూడా కలిపి లెక్క వేశాడు. అలాంటి లైఫ్‌స్టైల్ ఉన్నప్పటికీ ఆ యాక్టర్‌కి ఇంకా బోలెడంత డబ్బు మిగిలి ఉంటుందని చెబుతూనే.. షారుక్ ఒక పాన్ మసాలా బ్రాండ్‌ని ప్రమోట్ చేయాలన్న నిర్ణయాన్ని రాఠీ ప్రశ్నించాడు.

“షారుక్ ఖాన్‌కి నా ప్రశ్న ఏంటంటే.. ఇంత డబ్బు సరిపోదా? ఒకవేళ సరిపోతే, పాన్ మసాలా లాంటి హానికరమైన వస్తువును ఇంకా ఎందుకు ప్రమోట్ చేయాల్సిన అవసరం వచ్చింది” అని అడిగాడు. అలాంటి యాడ్స్ కోసం ఆ సూపర్‌స్టార్‌కి దాదాపు రూ.100 నుండి రూ.200 కోట్లు ఇచ్చారని చెబుతున్న రిపోర్ట్‌లను కూడా ధ్రువ్ ప్రస్తావించాడు. వాటివల్ల సమాజంపై పడే ప్రభావం గురించి ఆలోచించుకోమని కోరాడు.

మీకు ఆ డబ్బు అవసరమా?

తన నిర్ణయాల గురించి ఆలోచించుకోమని షారుక్ ను కోరిన ధ్రువ్.. “అసలు ప్రశ్న ఏంటంటే.. మీకు నిజంగా ఈ అదనపు రూ.100–రూ.200 కోట్లు అవసరమా? మీ అంతరాత్మను అడిగి నిజాయితీగా చెప్పండి. అంత డబ్బుతో ఏం చేస్తారు? ఇంకో కోణంలో ఆలోచించండి.. దేశంలోనే టాప్ యాక్టర్ ఇలాంటి హానికరమైన ప్రొడక్టులను ప్రమోట్ చేయడం ఆపేస్తే, దాని ప్రభావం దేశంపై ఎలా ఉంటుంది?" అని కూడా అడిగాడు.

ఈ మెసేజ్‌ని షారుక్ కి చేరేలా అందరూ షేర్ చేయాలని తన ఫాలోవర్స్‌ని కోరుతూ అతను వీడియోను ముగించాడు. షారుక్ ఖాన్ ప్రస్తుతం సిద్ధార్థ్ ఆనంద్ తీస్తున్న 'కింగ్' సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో సుహానా ఖాన్, దీపికా పదుకోన్, అభిషేక్ బచ్చన్, అర్షద్ వార్సీ కూడా నటిస్తున్నారు.