మాజీ భార్యకు దగ్గరవుతున్న క్రికెటర్.. ఆ రియాల్టీ షోలో ఇద్దరూ కలుస్తున్నారంటూ వార్తలు.. చహల్ పోస్ట్ వైరల్

క్రికెటర్ యుజ్వేంద్ర చహల్ మరోసారి తన మాజీ భార్యతో కలబోతున్నాడని, ఈ ఇద్దరూ ఓ రియాల్టీ షోలో పాల్గొనబోతున్నారన్న వార్తలపై అతడు స్పందించాడు. ఇన్‌స్టా స్టోరీస్ తో అతడు చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

Published on: Jan 14, 2026 8:12 AM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్, ప్రముఖ కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ విడిపోయిన సంగతి తెలిసిందే. అయితే గడిచిన కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త జోరుగా ప్రచారం జరుగుతోంది. త్వరలో రాబోయే ఒక రియాలిటీ షో కోసం ఈ మాజీ జంట మళ్లీ చేతులు కలపబోతున్నారని, ఒకే స్క్రీన్ పై కనిపించబోతున్నారని నెట్టింట గుసగుసలు వినిపించాయి. దీంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ ఊహాగానాలపై చహల్ ఎట్టకేలకు మౌనం వీడాడు.

మాజీ భార్యకు దగ్గరవుతున్న క్రికెటర్.. ఆ రియాల్టీ షోలో ఇద్దరూ కలుస్తున్నారంటూ వార్తలు.. చహల్ పోస్ట్ వైరల్
మాజీ భార్యకు దగ్గరవుతున్న క్రికెటర్.. ఆ రియాల్టీ షోలో ఇద్దరూ కలుస్తున్నారంటూ వార్తలు.. చహల్ పోస్ట్ వైరల్

అసలేంటీ రూమర్?

‘ది 50’ (The 50) పేరుతో రాబోయే ఒక కొత్త రియాలిటీ షోలో చహల్, ధనశ్రీ కలిసి పాల్గొంటున్నారని పలు రిపోర్టులు వెల్లడించాయి. విడాకుల తర్వాత వీరిద్దరూ కలిసి కనిపిస్తే అది సంచలనమే అవుతుందని నెటిజన్లు చర్చించుకున్నారు. ఫరా ఖాన్ హోస్ట్ చేయబోయే ఈ షో ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం కానుంది.

అదంతా ట్రాష్.. నమ్మకండి: చహల్

ఈ వార్తలపై చహల్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ వేదికగా స్పందించాడు. ఈ రూమర్లను ఖండిస్తూ ఒక అధికారిక ప్రకటన విడుదల చేశాడు. "యుజ్వేంద్ర చహల్ ఏదో రియాలిటీ షోలో పాల్గొంటున్నాడంటూ వస్తున్న వార్తల్లో ఇసుమంతైనా నిజం లేదు. ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. ఆ వార్తల్లో పేర్కొన్న షోతో చహల్‌కు ఎలాంటి సంబంధం లేదు. దీనికి సంబంధించి ఎలాంటి చర్చలు జరగలేదు. కమిట్‌మెంట్స్ ఇవ్వలేదు. దయచేసి సోషల్ మీడియాలో ధృవీకరించని సమాచారాన్ని ప్రచారం చేయవద్దు" అని చహల్ టీమ్ స్పష్టం చేసింది. అయితే ధనశ్రీ మాత్రం ఈ వార్తలపై ఇంకా స్పందించలేదు.

చహల్, ధనశ్రీ రిలేషన్షిప్, బ్రేకప్ ఇలా..

లాక్ డౌన్ సమయంలో ఆన్లైన్ డ్యాన్స్ క్లాసుల ద్వారా పరిచయమైన చహల్, ధనశ్రీ.. ప్రేమలో పడి డిసెంబర్ 2020లో పెళ్లి చేసుకున్నారు. అయితే మనస్పర్ధల కారణంగా జూన్ 2022లో విడిపోయారు. గతేడాది (2025) మార్చిలో వీరికి అధికారికంగా విడాకులు మంజూరయ్యాయి.

ధనశ్రీతో విడిపోయిన తర్వాత చహల్ దుబాయ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ సమయంలో ఆర్జే మహ్వాష్‌తో (RJ Mahvash) కనిపించడం చర్చనీయాంశమైంది. వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ రూమర్స్ వచ్చినా, తాము కేవలం స్నేహితులమేనని మహ్వాష్ క్లారిటీ ఇచ్చింది. మరోవైపు, ధనశ్రీ గతంలో ‘రైజ్ అండ్ ఫాల్’ అనే రియాలిటీ షోలో పాల్గొని తన వైవాహిక జీవితం గురించి మాట్లాడి వార్తల్లో నిలిచారు.