క్రికెటర్ యుజ్వేంద్ర చహల్ తన మాజీ భార్య ధనశ్రీ వర్మతో విడాకుల డీల్ గురించి పుకార్లపై పరోక్షంగా స్పందించాడు. రూ.4 కోట్ల భరణం పుకార్లను లక్ష్యంగా చేసుకుని తన మాజీ భార్యపై చహల్ వ్యంగ్యంగా పంచ్ వేశాడు. ఈసారి అతని సన్నిహిత మిత్రుడు శిఖర్ ధావన్ కూడా ఆ సరదా సంభాషణలో జత కలిశాడు. అసలు ఏం జరిగిందో చూడండి.
ధనశ్రీ వర్మపై చహల్ సెటైర్

టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ తన దీపావళి, భాయ్ దూజ్ వేడుకల ఫొటోలను పంచుకుంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. తన కుటుంబంతో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ.. "కుటుంబంతో కలిసి జరుపుకున్న అందమైన భాయ్ దూజ్. ప్రేమ, చిరునవ్వులు, జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలంగా ఉంటాయి" అని క్యాప్షన్ ఇచ్చాడు.
అయితే అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం ఆ పోస్ట్పై చహల్ చేసిన చమత్కారమైన వ్యాఖ్య. చహల్ కామెంట్ చేస్తూ.. "మీ పోజ్పై నేను కాపీరైట్ ఫైల్ చేస్తున్నాను బ్రదర్.. కేవలం రూ.4 కోట్లు మాత్రమే" అని రాశాడు. ఆ కామెంట్తో పాటు ఓ పగలబడి నవ్వే ఎమోజీని కూడా పోస్ట్ చేశాడు.
దీనికి ధావన్ కూడా బదులిచ్చాడు. కామెంట్ సెక్షన్లో స్పందిస్తూ.. "చహల్ డీల్ కన్ఫమ్ అయింది" అని అన్నాడు. విడాకుల ప్రక్రియ సమయంలో సెటిల్మెంట్ రూ.4 కోట్ల వరకు ఉందని పలు రిపోర్టులు పేర్కొన్నాయి. అయితే దీనిని అటు యుజ్వేంద్ర కానీ, ఇటు ధనశ్రీ కానీ ధృవీకరించలేదు.
కొన్నాళ్ల కిందట కూడా..
చహల్ తన మాజీ భార్యను ఉద్దేశిస్తూ పరోక్షంగా వ్యాఖ్యానించడం ఇది కొత్తేమీ కాదు. కొన్ని రోజుల కిందట అతని ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఒకటి వైరల్ అయింది. అందులో ఢిల్లీ హైకోర్టు తీర్పును ప్రస్తావిస్తూ.. "ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్న భార్యలు తమ భర్తలను భరణం డిమాండ్ చేయలేరు" అని పేర్కొన్న పోస్ట్ను షేర్ చేశాడు.
దాని కింద "అమ్మ మీద ఒట్టు.. ఈ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గవద్దు" అని చహల్ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ పోస్ట్ను కొద్దిసేపటికే తొలగించినప్పటికీ.. ఇది కొన్ని నిమిషాల్లోనే వైరల్ అయింది. ఇది ధనశ్రీని ఉద్దేశించి చేసిన వ్యక్తిగత వ్యాఖ్యనా లేదా కేవలం తీర్పును సమర్థించడమా అనే దానిపై ఆన్లైన్లో పెద్ద చర్చకు దారితీసింది.
ధనశ్రీ, చహల్ పెళ్లి
{{/usCountry}}దాని కింద "అమ్మ మీద ఒట్టు.. ఈ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గవద్దు" అని చహల్ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ పోస్ట్ను కొద్దిసేపటికే తొలగించినప్పటికీ.. ఇది కొన్ని నిమిషాల్లోనే వైరల్ అయింది. ఇది ధనశ్రీని ఉద్దేశించి చేసిన వ్యక్తిగత వ్యాఖ్యనా లేదా కేవలం తీర్పును సమర్థించడమా అనే దానిపై ఆన్లైన్లో పెద్ద చర్చకు దారితీసింది.
ధనశ్రీ, చహల్ పెళ్లి
{{/usCountry}}ధనశ్రీ 2020 డిసెంబర్లో గురుగ్రామ్లో చహల్ను వివాహం చేసుకుంది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో.. ధనశ్రీని చహల్ డ్యాన్స్ క్లాసుల కోసం అడగడంతో వీరిద్దరూ కలిశారు. వారి పిటిషన్ ప్రకారం వారు 2022 జూన్లో విడిపోయారు. ఈ సంవత్సరం మార్చిలో వారు పరస్పర అంగీకారంతో విడాకులు కోరుతూ ఫ్యామిలీ కోర్టులో ఉమ్మడి పిటిషన్ను దాఖలు చేశారు. ఆ తర్వాత వారికి విడాకులు మంజూరయ్యాయి.
ఛహల్ అధికారికంగా ధనశ్రీ నుండి విడిపోయిన తర్వాత అతను ఆర్జే మహ్వష్తో కలిసి దుబాయ్లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ను ఆస్వాదిస్తూ కనిపించాడు. ఇది వారిద్దరి మధ్య రొమాన్స్ ఊహాగానాలకు దారితీసింది. అయితే మహ్వష్.. తాము కేవలం స్నేహితులం మాత్రమే అని ఎప్పుడూ చెబుతోంది. ఇటీవల ధనశ్రీ 'రైజ్ అండ్ ఫాల్' అనే రియాలిటీ షో మొదటి సీజన్లో పాల్గొన్నప్పుడు తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడింది.