వేసవి అనగానే పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ముందుగా గుర్తొచ్చేది మామిడి పండు. పండ్లలో ఇది రారాజు. దీనిని చూస్తే తినకుండా ఉండలేరు. వేసవిలో ఇది చాలా మందికి ఇష్టమైన పండు అయినప్పటికీ, మామిడి పండ్లు తినడం వల్ల శరీర వేడి పెరుగుతుందనే ఒక సాధారణ నమ్మకం మనలో చాలా కాలంగా ఉంది. మామిడి పండ్లు తినడం వల్ల శరీరం వేడెక్కుతుందని చాలా మంది నమ్ముతారు. దీనివల్ల మొటిమలు, చర్మ సమస్యలు, కడుపు సంబంధిత జీర్ణ రుగ్మతలు కూడా కలుగుతాయని చెబుతుంటారు.

ఆరోగ్య, పోషకాహార నిపుణులు దీని గురించి సవివరంగా తెలిపారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మామిడి పండ్లు శరీరానికి చాలా మేలు చేస్తాయి. వీటిలో విటమిన్ ఎ, విటమిన్ సి, ఫైబర్, పొటాషియం, అధిక స్థాయిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
అదే సమయంలో మామిడి పండ్లు శరీరంలో థర్మోజెనిసిస్ అనే స్వల్ప ఉష్ణోత్పత్తికి కారణమవుతాయనేది శాస్త్రీయంగా వాస్తవం. ఎందుకంటే ఆహారం జీర్ణమయ్యేటప్పుడు అవి శరీర ఉష్ణోగ్రతను కొద్దిగా పెంచుతాయి. మామిడి పండ్లు తినేటప్పుడు శరీర ఉష్ణోగ్రత పెరగకుండా ఉండేందుకు, మన ఇళ్లలోని పెద్దలు ఒక సులభమైన పద్ధతిని పాటించడం మనం చూసే ఉంటాం. అదేమిటంటే మామిడి పండ్లను తినడానికి ముందు కొంతసేపు నీటిలో నానబెట్టడం. ఈ సాంప్రదాయ పద్ధతిని ఆధునిక నిపుణులు కూడా గట్టిగా సిఫార్సు చేస్తున్నారు.
మామిడి పండ్లను కనీసం 30 నిమిషాల నుండి 2 గంటల పాటు నీటిలో నానబెట్టడం వల్ల వాటి వేడి పుట్టించే గుణాలు గణనీయంగా తగ్గుతాయి. అంతేకాకుండా ఈ పద్ధతి పండు తొక్కలో సహజంగా ఉండే, సూక్ష్మపోషకాల శోషణను నిరోధించే ఫైటిక్ యాసిడ్ అనే పదార్థాన్ని, రసాయన పురుగుమందుల అవశేషాలను పూర్తిగా తొలగించడంలో సహాయపడుతుంది. ఇది మొటిమల వంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.
ఏ ఆహారాన్నైనా మితంగా తినడమే మంచి ఆరోగ్యానికి కీలకం. మామిడి పండ్లలో సహజంగానే చక్కెర, కేలరీలు అధికంగా ఉంటాయి. అందువల్ల దీనిని అధికంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం, జీర్ణ సంబంధిత రుగ్మతలు, బరువు పెరగడం వంటి సమస్యలకు దారితీయవచ్చు. అందువల్ల మామిడి పండ్లను నీటిలో నానబెట్టి మితంగా తింటే మంచిదే. మనం దాని రుచిని, పోషకాలను పూర్తిగా ఆస్వాదించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
{{/usCountry}}ఏ ఆహారాన్నైనా మితంగా తినడమే మంచి ఆరోగ్యానికి కీలకం. మామిడి పండ్లలో సహజంగానే చక్కెర, కేలరీలు అధికంగా ఉంటాయి. అందువల్ల దీనిని అధికంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం, జీర్ణ సంబంధిత రుగ్మతలు, బరువు పెరగడం వంటి సమస్యలకు దారితీయవచ్చు. అందువల్ల మామిడి పండ్లను నీటిలో నానబెట్టి మితంగా తింటే మంచిదే. మనం దాని రుచిని, పోషకాలను పూర్తిగా ఆస్వాదించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
{{/usCountry}}