Homemade Curd Tips : భారతీయ భోజనంలో పెరుగు లేనిదే ముద్ద దిగదు. ముఖ్యంగా ఎండలు మండిపోయే వేసవి కాలంలో చల్లటి పెరుగు ఇచ్చే హాయి వేరు. మార్కెట్లో రకరకాల డెయిరీ బ్రాండ్ల పెరుగు దొరుకుతున్నా, ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగు రుచి, ఆరోగ్యం మాటాల్లో వర్ణించలేం.

చాలా మంది మహిళలు రాత్రి పాలను తోడు పెడితే ఉదయానికి పెరుగు సిద్ధమవుతుంది. అయితే….పెరుగు గడ్డకట్టిన తర్వాత పైన నీరు పేరుకుపోవడం చాలా మంది ఎదుర్కొనే సాధారణ సమస్య. ఇలా కాకుండా ఐస్క్రీంలాంటి గడ్డ పెరుగును ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం….
గడ్డ పెరుగు తయారీ ఇలా…
మన అమ్మమ్మలు, నాయనమ్మల కాలం నుండి వస్తున్న అత్యంత సులభమైన పద్ధతి పాలను సరిగ్గా మరిగించడం. పాలు ఎంత చిక్కగా ఉంటే పెరుగు అంత అద్భుతంగా వస్తుంది.
- ముందుగా పాలను బాగా మరిగించి…. కొద్దిసేపు పక్కన పెట్టాలి.
- పాలు మరీ వేడిగా కాకుండా, కేవలం గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే తోడు వేయాలి.
- ఒక మట్టి కుండ తీసుకుని, పాలను నాలుగు ఐదు సార్లు బాగా తిరబోయాలి. ఇలా చేయడం వల్ల పాలలో గాలి బుడగలు వచ్చి పెరుగు సాఫ్ట్గా వస్తుంది.
- ఇప్పుడు ఒక చెంచా పెరుగు (జామున్) తీసుకుని పక్క నుంచి మెల్లగా పాలల్లో కలపాలి.
- కుండను అస్సలు కదపకుండా 5 నుండి 6 గంటల పాటు మూత పెట్టి ఉంచాలి.
పెరుగు తోడుకున్న తర్వాత పైన నీరు కనిపిస్తుంటే…. ఒక చిన్న ట్రిక్ పాటిస్తే సరిపోతుంది. రెండు లేదా మూడు టిష్యూ పేపర్లను తీసుకుని, గడ్డకట్టిన పెరుగు పైన పరిచినట్లు పెట్టండి. పెరుగులో ఉండే అదనపు తేమను ఈ టిష్యూ పేపర్ పూర్తిగా పీల్చుకుంటుంది. ఆ తర్వాత కుండను ఒక గంట పాటు ఫ్రిజ్లో ఉంచండి. తినే ముందు టిష్యూ పేపర్ తీసేస్తే, నీరు లేని చిక్కని గడ్డ పెరుగు మీ సొంతమవుతుంది.
త్వరగా తోడుకోవాలంటే ఇలా….
ఒక్కోసారి అతిథులు వస్తున్నప్పుడు లేదా సమయం తక్కువగా ఉన్నప్పుడు పెరుగు త్వరగా కావాలంటే ఒక చిట్కా ఉంది. ఒక వెడల్పాటి పాత్రలో వేడి నీటిని తీసుకుని, అందులో తోడు పెట్టిన పాల గిన్నెను ఉంచాలి. ఆ వేడి నీటి ఆవిరికి పాలు త్వరగా పెరుగుగా మారుతాయి. మట్టి కుండలో పెరుగు తోడు పెడితే అందులో ఉండే పోషకాలు రెట్టింపు అవ్వడమే కాకుండా…. కుండలోని రంధ్రాలు నీటిని సహజంగానే పీల్చుకుని పెరుగును గడ్డలా మారుస్తాయి.
{{/usCountry}}ఒక్కోసారి అతిథులు వస్తున్నప్పుడు లేదా సమయం తక్కువగా ఉన్నప్పుడు పెరుగు త్వరగా కావాలంటే ఒక చిట్కా ఉంది. ఒక వెడల్పాటి పాత్రలో వేడి నీటిని తీసుకుని, అందులో తోడు పెట్టిన పాల గిన్నెను ఉంచాలి. ఆ వేడి నీటి ఆవిరికి పాలు త్వరగా పెరుగుగా మారుతాయి. మట్టి కుండలో పెరుగు తోడు పెడితే అందులో ఉండే పోషకాలు రెట్టింపు అవ్వడమే కాకుండా…. కుండలోని రంధ్రాలు నీటిని సహజంగానే పీల్చుకుని పెరుగును గడ్డలా మారుస్తాయి.
{{/usCountry}}