'అనలాగ్ పనీర్‌'పై నిషేధం.. ప్రజారోగ్యానికి మహారాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట

ప్రజారోగ్యానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్న కృత్రిమ లేదా 'అనలాగ్ పనీర్' (Analogue Paneer) తయారీ, విక్రయాలపై మహారాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాటు పూర్తి నిషేధం విధించింది. ఛత్తీస్‌గఢ్ తర్వాత ఈ రకమైన కఠిన నిర్ణయం తీసుకున్న రెండో రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది.

Published on: Aug 5, 2026, 09:46:55 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పాల ఆధారిత రసాయనాలు కాకుండా వెజిటబుల్ ఆయిల్స్ (కూరగాయల నూనెలు), పిండి పదార్థాలు (స్టార్చ్), ఎమల్సిఫైయర్లు, ఇతర రసాయన పదార్థాలతో తయారు చేసే 'అనలాగ్ పనీర్' (కృత్రిమ పనీర్) విక్రయాలపై మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అనలాగ్ పనీర్ తయారీ, విక్రయాలు, రవాణా, నిల్వలపై ఏడాది పాటు పూర్తి నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఫుడ్ సేఫ్టీ కమిషనర్ తుకారాం ముండే జూలై 30న ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

కృత్రిమ 'అనలాగ్ పనీర్‌'పై నిషేధం..
కృత్రిమ 'అనలాగ్ పనీర్‌'పై నిషేధం..

నిబంధనలు ఉల్లంఘిస్తే జీవిత ఖైదు

అసలైన పనీర్ స్థానంలో కృత్రిమ పనీర్‌ను కస్టమర్లకు వడ్డించడం లేదా విక్రయించడం తీవ్రమైన మోసపూరిత చర్యగా భావిస్తామని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) హెచ్చరించింది. 'ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్, 2006' ప్రకారం దీనిని శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు.

  • సాధారణ ఉల్లంఘనలకు: 6 నెలల వరకు జైలు శిక్ష, 1 లక్ష వరకు జరిమానా.
  • ప్రాణహాని సంభవిస్తే: సురక్షితం కాని పనీర్ తిని ఎవరైనా మరణిస్తే జీవిత ఖైదుతో పాటు కనీసం 10 లక్షల వరకు జరిమానా విధిస్తారు.

ల్యాబ్ పరీక్షల్లో షాకింగ్ నిజాలు

గత ఏడాది కాలంగా (ఏప్రిల్ 1, 2025 నుండి మార్చి 31, 2026 వరకు) ఎఫ్‌డీఏ నిర్వహించిన తనిఖీల్లో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి. సేకరించిన 308 పనీర్ నమూనాలలో ఏకంగా 109 నమూనాలు (35.4%) నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేవని తేలింది. ఇందులో 79 నమూనాలు నాసిరకంగా ఉండగా, 30 నమూనాలు అనారోగ్యకరమైనవిగా గురైయ్యాయి.

ల్యాబ్ పరీక్షల్లో పాలలో ఉండాల్సిన సహజ సిద్ధమైన వెన్న (Milk Fat) స్థానంలో కూరగాయల నూనెలు, వనస్పతి ఉపయోగిస్తున్నట్లు స్పష్టమైంది.

రెస్టారెంట్లు, హోటళ్లలో యథేచ్ఛగా వాడకం

హోటళ్లు, రెస్టారెంట్లు, కేటరింగ్ నిర్వాహకులు కస్టమర్లకు తెలియకుండానే అసలైన పనీర్‌కు బదులుగా ఈ అనలాగ్ పనీర్‌ను వాడుతున్నట్లు తనిఖీల్లో బయటపడింది. ఎటువంటి లేబుళ్లు, బ్యాచ్ నంబర్లు, గడువు తేదీలు లేకుండా దీనిని విక్రయిస్తుండటంతో దీని మూలాలను గుర్తించడం కష్టంగా మారింది.

"అనలాగ్ పనీర్‌ను నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడటంలో చారిత్రాత్మకమైనది. పనీర్ తరహాలోనే బహుళజాతి కంపెనీలు విరివిగా ఉపయోగిస్తున్న 'అనలాగ్ చీజ్' (Analogue Cheese) పై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి" అని శ్రీగొండ నియోజకవర్గ ఎమ్మెల్యే విక్రమ్ పచ్‌పుతే పేర్కొన్నారు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More