హైదరాబాద్లోని హైటెక్ సిటీ యశోద ఆసుపత్రి వైద్యులు మరొక అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. 'యాంటీ-సింథటేజ్ సిండ్రోమ్' (Anti-synthetase Syndrome) కారణంగా ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిని, శ్వాస తీసుకోవడం కూడా భారంగా మారిన 47 ఏళ్ల పురుషుడికి రెండు ఊపిరితిత్తుల మార్పిడి చేసి ఊపిరి పోశారు. రెండేళ్లుగా నిరంతరం ఆక్సిజన్ సపోర్టుపైనే ఆధారపడిన సదరు బాధితుడు, ఈ ఆపరేషన్ తర్వాత స్వయంగా శ్వాస తీసుకుంటూ ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వెళ్లారు.
రెండేళ్ల నరకం నుంచి విముక్తి

బాధితుడు 'ఫైబ్రోటిక్ ఇంటర్స్టీషియల్ లంగ్ డిసీజ్' (ILD) అనే తీవ్రమైన శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి వల్ల ఊపిరితిత్తుల కణజాలం గట్టిపడి (సాధారణ ಭాషలో చెప్పాలంటే ఊపిరితిత్తులపై మచ్చలు ఏర్పడి) శ్వాస తీసుకునే సామర్థ్యాన్ని శాశ్వతంగా కోల్పోతారు. వైద్యులు ఎంత ప్రయత్నించినా వ్యాధి తీవ్రత తగ్గకపోవడంతో, ఆయన నిరంతరం ఆక్సిజన్ పైన జీవించాల్సి వచ్చింది. చివరికి ఊపిరితిత్తుల మార్పిడి ఒక్కటే ఆయన ప్రాణాలను కాపాడేందుకు ఏకైక మార్గమని వైద్యులు నిర్ణయించారు.
బహుళ నిపుణుల బృందం కృషి
ఈ సంక్లిష్ట శస్త్రచికిత్సను యశోద ఆసుపత్రికి చెందిన అనుభవజ్ఞులైన వైద్యుల బృందం విజయవంతంగా నిర్వహించింది. పల్మనాలజీ విభాగం క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ వి. నాగార్జున మాటూరు నేతృత్వంలో.. లంగ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ మంజునాథ్ బాళె, సీటీవీఎస్ కన్సల్టెంట్ డాక్టర్ విక్రమ్ రెడ్డి, ట్రాన్స్ప్లాంట్ పల్మనాలోజిస్ట్ డాక్టర్ బట్టు చైతన్య, ట్రాన్స్ప్లాంట్ అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ సుశాంత్ పాండా ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు.
ఆపరేషన్ తదనంతర సంరక్షణను డాక్టర్ రవిశంకర్ నేతృత్వంలోని క్రిటికల్ కేర్ బృందం, ట్రాన్స్ప్లాంట్ నర్సులు, ఫిజియోథెరపిస్టులు, డైటీషియన్లు సమర్థవంతంగా పర్యవేక్షించారు.
10 రోజుల్లోనే డిశ్చార్జ్.. మళ్లీ సొంతంగా శ్వాస
శస్త్రచికిత్స తర్వాత ఎలాంటి కాంప్లికేషన్లు తలెత్తకపోవడం విశేషం. క్రమంగా రోగికి ఆక్సిజన్ సపోర్టును తొలగించారు. ఆపరేషన్ జరిగిన కేవలం 10 రోజుల్లోనే ఆయన సొంతంగా నడుస్తూ, సాధారణంగా శ్వాస తీసుకునే స్థితికి చేరుకోవడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
{{/usCountry}}శస్త్రచికిత్స తర్వాత ఎలాంటి కాంప్లికేషన్లు తలెత్తకపోవడం విశేషం. క్రమంగా రోగికి ఆక్సిజన్ సపోర్టును తొలగించారు. ఆపరేషన్ జరిగిన కేవలం 10 రోజుల్లోనే ఆయన సొంతంగా నడుస్తూ, సాధారణంగా శ్వాస తీసుకునే స్థితికి చేరుకోవడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
{{/usCountry}}"యాంటీ-సింథటేజ్ సిండ్రోమ్తో కూడిన ఫైబ్రోటిక్ ఐఎల్డీ రోగుల్లో ఊపిరితిత్తులు వేగంగా దెబ్బతింటాయి. సరైన సమయంలో వ్యాధిని గుర్తించి శస్త్రచికిత్స అందిస్తే రోగి మళ్లీ సొంతంగా శ్వాస తీసుకోగలుగుతారు. రోగి ఏ సపోర్టు లేకుండా నడుస్తుంటే చూడటం మా బృందానికి ఎంతో సంతృప్తిని ఇచ్చింది" అని పల్మనాలజీ విభాగం క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ వి. నాగార్జున మాటూరు తెలిపారు.
"ద్వంద్వ ఊపిరితిత్తుల మార్పిడి అనేది థొరాసిక్ సర్జరీలోనే అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ. దాత నుంచి అవయవ సేకరణ మొదలుకుని శస్త్రచికిత్స, ఐసీయూ సంరక్షణ, పునరావాసం వరకు ప్రతి దశలోనూ ఖచ్చితమైన ప్రణాళిక అవసరం. మా వైద్య బృందం సమన్వయంతోనే ఇది సాధ్యమైంది" అని ఊపిరితిత్తుల మార్పిడి నిపుణులు డాక్టర్ మంజునాథ్ బాళె వివరించారు.