Himachal Pradesh Landslide Accident : హిమాచల్ ప్రదేశ్లోని పర్వత ప్రాంత ప్రయాణాలు మళ్లీ తీవ్ర విషాదాన్ని నింపాయి. శుక్రవారం లాహౌల్-స్పితి జిల్లాలోని ఉదయ్పూర్-పాంగీ రహదారిపై ప్రయాణిస్తున్న ఒక ట్యాక్సీపై కొండ పైభాగం నుంచి ఒక్కసారిగా భారీ రాళ్లు, కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘోర ప్రమాదంలో ఆరు నెలల పసికందు సహా మొత్తం 13 మంది ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. వాహనంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు సమయస్ఫూర్తితో బయటకు దూకడంతో తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు.
ఏం జరిగిందంటే..?

కుల్లు నుంచి కిల్లార్ వైపు వెళ్తున్న టాటా సుమో వాహనం కడు నాలా సమీపానికి చేరుకోగానే…. సమీపంలోని కొండ నుంచి భారీ రాళ్లు ఒక్కసారిగా వాహనంపై పడ్డాయి. రాళ్ల దెబ్బకు వాహనం నుజ్జునుజ్జు అవ్వడమే కాకుండా, వెనుక భాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. జిల్లా కేంద్రం కీలాంగ్కు దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, ఆర్మీ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు బయటకు రాగా…. వాహనం రాళ్ల కింద పడి పూర్తిగా నలిగిపోయి మంటల్లో కాలిపోయింది.
ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ ఘటనలో 13 మంది మరణించినట్లు లాహౌల్-స్పితి జిల్లా కలెక్టర్ కిరణ్ బదానా అధికారికంగా ధృవీకరించారు. ప్రమాదంలో మరణించిన వారి గుర్తింపును అధికారులు ఇంకా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు దిగ్భ్రాంతి
{{/usCountry}}ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ ఘటనలో 13 మంది మరణించినట్లు లాహౌల్-స్పితి జిల్లా కలెక్టర్ కిరణ్ బదానా అధికారికంగా ధృవీకరించారు. ప్రమాదంలో మరణించిన వారి గుర్తింపును అధికారులు ఇంకా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు దిగ్భ్రాంతి
{{/usCountry}}ఈ ఘోర ప్రమాదంపై హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. లాహౌల్-స్పితి డిప్యూటీ కమిషనర్ను తక్షణమే ఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున సాధ్యమైన అన్ని విధాలా సహాయం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబాలకు ఈ ఆరని లోటును తట్టుకునే ధైర్యాన్ని ప్రసాదించాలని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే గాయపడిన ఇద్దరికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.