అదానీ గ్రూప్నకు చెందిన ప్రముఖ విద్యుత్ రవాణా, పంపిణీ సంస్థ 'అదానీ ఎనర్జీ సొల్యూషన్స్' ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) ఏప్రిల్-జూన్ (Q1) త్రైమాసికంలో అద్భుతమైన ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. మంగళవారం (జూలై 21, 2026) మార్కెట్ వేళల్లో కంపెనీ తన త్రైమాసిక నివేదికను విడుదల చేసింది.
గతేడాది ఇదే సమయంలో రూ.512.48 కోట్లుగా ఉన్న కన్సాలిడేటెడ్ నికర లాభం, ఈసారి ఏకంగా 124.22 శాతం పెరిగి రూ.1,149 కోట్లకు చేరింది.
ఆదాయంలో 42 శాతం వృద్ధి
ఆపరేషన్స్ ద్వారా వచ్చే ఆదాయం కూడా ఏటికేడు 42.41 శాతం వృద్ధితో రూ.9,711.08 కోట్లకు చేరింది. గతేడాది జూన్ త్రైమాసికంలో ఈ ఆదాయం రూ.6,819.28 కోట్లుగా ఉంది.
గడిచిన మార్చ్ త్రైమాసికంతో పోల్చి చూసినా (QoQ) కంపెనీ మెరుగైన ప్రదర్శన కనబరిచింది. మార్చ్ త్రైమాసికంలో రూ.7,443 కోట్లుగా ఉన్న ఆదాయం, రూ.723 కోట్లుగా ఉన్న నికర లాభంతో పోలిస్తే ఈసారి స్పష్టమైన పురోగతి కనిపించింది.
పెరిగిన విద్యుత్ కొనుగోలు వ్యయం
జూన్ త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఖర్చులు రూ.8,440 కోట్లకు పెరిగాయి. గతేడాది ఇదే సమయంలో ఇవి రూ.5,864 కోట్లుగా ఉండేవి. విద్యుత్ కొనుగోలు ఖర్చులు, నిర్మాణ వ్యయాలు పెరగడమే ఇందుకు ప్రధాన కారణం.
విద్యుత్ కొనుగోలు ఖర్చులు గతేడాది ఉన్న రూ.1,724 కోట్ల నుంచి రెట్టింపై రూ.3,561 కోట్లకు చేరాయి. సర్వీస్ కన్సెషన్ ఒప్పందాల కింద నిర్వహించిన నిర్మాణ వ్యయాలు రూ.1,742 కోట్ల నుంచి రూ.2,138 కోట్లకు పెరిగాయి.
ఇక ఫైనాన్స్ వ్యయం రూ.1,152 కోట్లు (గతంలో రూ.894 కోట్లు), తరుగుదల (డిప్రిసియేషన్) వ్యయం రూ.585 కోట్లుగా నమోదయ్యాయి. ఉద్యోగుల వ్యయం రూ.228 కోట్లుగా దాదాపు నిలకడగా ఉండగా, పన్ను ఖర్చులు రూ.156 కోట్లకు చేరాయి.
దూసుకెళ్లిన స్మార్ట్ మీటర్, ట్రాన్స్మిషన్ రంగాలు
{{/usCountry}}ఇక ఫైనాన్స్ వ్యయం రూ.1,152 కోట్లు (గతంలో రూ.894 కోట్లు), తరుగుదల (డిప్రిసియేషన్) వ్యయం రూ.585 కోట్లుగా నమోదయ్యాయి. ఉద్యోగుల వ్యయం రూ.228 కోట్లుగా దాదాపు నిలకడగా ఉండగా, పన్ను ఖర్చులు రూ.156 కోట్లకు చేరాయి.
దూసుకెళ్లిన స్మార్ట్ మీటర్, ట్రాన్స్మిషన్ రంగాలు
{{/usCountry}}కంపెనీకి చెందిన ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్, స్మార్ట్ మీటర్ వ్యాపార రంగాలు మూడూ మెరుగైన వృద్ధిని నమోదు చేశాయి.
ట్రాన్స్మిషన్ విభాగం: ఆదాయం రూ.2,188 కోట్ల నుంచి రూ.3,335 కోట్లకు పెరగ్గా, దానికి సంబంధించిన లాభం (PBIT) రూ.927 కోట్ల నుంచి రూ.1,327 కోట్లకు చేరింది.
డిస్ట్రిబ్యూషన్ విభాగం: రూ.3,520 కోట్ల ఆదాయంతో రూ.357 కోట్ల లాభాన్ని ఆర్జించింది.
స్మార్ట్ మీటర్ల విభాగం: ఈ విభాగం రికార్డు వృద్ధి సాధించింది. గతేడాది రూ.112 కోట్లుగా ఉన్న స్మార్ట్ మీటర్ల వ్యాపార ఆదాయం ఈ త్రైమాసికంలో ఏకంగా రూ.347 కోట్లకు చేరింది. ఈ విభాగం లాభం కూడా రూ.47 కోట్ల నుంచి రూ.153 కోట్లకు ఎగబాకింది.