AI ముప్పు: ఉద్యోగం ఊడితే రోడ్డున పడాల్సిందేనా? మీ 'ఎమర్జెన్సీ ఫండ్' మార్చుకోండి
కృత్రిమ మేధ (AI) కారణంగా సాఫ్ట్వేర్ నుంచి స్టార్టప్ల వరకు అన్ని రంగాల్లో ఉద్యోగాల కోత మొదలైంది. గతంలో చెప్పే '6 నెలల పొదుపు' సూత్రం ఇప్పుడు సరిపోదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీ ఆర్థిక భద్రత కోసం మీరు చేయాల్సిన మార్పులు ఇవే.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల ఉద్యోగాలు పోతాయన్నది ఇప్పుడు కేవలం ఊహాగానం కాదు.. కళ్లముందు కనిపిస్తున్న చేదు నిజం. కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకోవడానికి ఆటోమేషన్ను వేగవంతం చేస్తున్నాయి. ఫలితంగా వేలాది మంది ప్రొఫెషనల్స్ ఒక్కసారిగా రోడ్డున పడుతున్నారు. ఒకప్పుడు ఐటీ రంగంలో ఉద్యోగం అంటే జీవితాంతం భరోసా అనుకునే వారు, ఇప్పుడు అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

కళ్లముందు కనిపిస్తున్న ఉద్యోగాల కోత: గణంకాలు ఏం చెబుతున్నాయి?
2026 తొలి త్రైమాసికంలోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 97 టెక్ కంపెనీలు 81,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి.
- ఒరాకిల్ (Oracle): ప్రపంచవ్యాప్తంగా 30,000 ఉద్యోగాలను కోత పెట్టింది, ఇందులో మూడవ వంతు భారత్లోనే ఉండటం గమనార్హం.
- దేశీ దిగ్గజాలు: టీసీఎస్ (TCS) 2026 ఆర్థిక సంవత్సరంలో 12,000 మందిని తొలగించగా.. ఫ్లిప్కార్ట్, లివ్స్పేస్ వంటి స్టార్టప్లు కూడా ఇదే బాటలో నడిచాయి.
అమెజాన్, మెటా, సేల్స్ఫోర్స్ వంటి దిగ్గజాలు కూడా తమ సిబ్బందిని తగ్గించుకుంటున్నాయి. అంటే, ఏ కంపెనీలోనూ ఉద్యోగం శాశ్వతం కాదనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
లక్షల జీతం నుంచి ర్యాపిడో రైడర్ వరకు..
ఉద్యోగాల కోత వెనుక గుండె కోత మిగిల్చే కథలు ఎన్నో ఉన్నాయి. నోయిడాలో ఏడాదికి రూ. 40 లక్షల జీతం తీసుకునే ఒక ఐటీ ఉద్యోగి, రూ. 1.4 కోట్ల ఫ్లాట్ కొనుగోలు చేసి నెలకు రూ. 95,000 ఈఎంఐ (EMI) కట్టేవారు. ఉద్యోగం పోవడంతో, ఇప్పుడు ఆ ఈఎంఐ కట్టడానికి ఆయన 'ర్యాపిడో' బైక్ టాక్సీ నడుపుతున్నారన్న వార్త సోషల్ మీడియాలో కలకలం రేపింది.
మరోవైపు దిల్లీకి చెందిన ఒక సేల్స్ మేనేజర్, ఉద్యోగం పోవడంతో కుటుంబాన్ని పోషించడానికి 'బ్లింకిట్' (Blinkit) డెలివరీ బాయ్గా మారారు. వీరందరి పరిస్థితి ఒక్కటే.. భారీ జీతాలు ఉన్నప్పుడు విలాసాలకు, భారీ ఈఎంఐలకు ప్రాధాన్యత ఇచ్చారు తప్ప, కష్టకాలంలో ఆదుకునే 'ఎమర్జెన్సీ ఫండ్' గురించి ఆలోచించలేదు.
6 నెలల పొదుపు సరిపోదు.. ఎందుకంటే?
సాధారణంగా ఆర్థిక నిపుణులు 6 నెలల ఖర్చులకు సరిపడా డబ్బును ఎమర్జెన్సీ ఫండ్గా ఉంచుకోవాలని చెబుతుంటారు. కానీ నేటి పరిస్థితుల్లో ఇది ఏమాత్రం చాలదు.
"నేడు ఏ రంగమూ సురక్షితం కాదు. ఐటీ రంగంలో కొత్త నియామకాలు నిలిచిపోయాయి (Hiring Freeze). కాబట్టి ఉద్యోగం పోయాక కొత్తది దొరకడానికి ఏడాది పైగా సమయం పట్టవచ్చు" అని లాడర్7 ఫైనాన్షియల్ అడ్వైజరీ వ్యవస్థాపకులు సురేష్ సడగోపన్ విశ్లేషించారు.
కనీసం 12 నెలల నుంచి 15 నెలల ఖర్చులకు సరిపడా నిధిని పక్కన పెట్టుకోవడం ఇప్పుడు అనివార్యం.
ఆర్థిక భద్రత కోసం మీరు చేయాల్సిన 5 పనులు:
- ఖర్చులను లెక్కించండి: మీ నెలవారీ అవసరాలకు (కిరాణా, రెంట్, స్కూల్ ఫీజులు) ఎంత అవుతుందో లెక్క కట్టి, ఆ మొత్తాన్ని 12తో గుణించండి. అంత మొత్తం మీ దగ్గర ఉండాలి.
- లిక్విడిటీ ముఖ్యం: ఎమర్జెన్సీ ఫండ్ను కేవలం సేవింగ్స్ అకౌంట్లో కాకుండా, త్వరగా విత్డ్రా చేసుకోగలిగే 'లిక్విడ్ ఫండ్స్' లేదా 'షార్ట్ టర్మ్ ఎఫ్డీ (FD)'లలో ఉంచండి.
- ఈఎంఐ (EMI) ఉచ్చులో పడకండి: మీ ఆదాయంలో 40 శాతం కంటే ఎక్కువ అప్పుల కోసం పోతుంటే మీరు ప్రమాదంలో ఉన్నట్లే. వీలైనంత వరకు అప్పులను తగ్గించుకోండి.
- హెల్త్ ఇన్సూరెన్స్: చాలామంది కంపెనీ ఇచ్చే బీమాపైనే ఆధారపడతారు. ఉద్యోగం పోయిన మరుక్షణమే ఆ బీమా వర్తించదు. కాబట్టి మీకంటూ సొంతంగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలి.
- పెట్టుబడులను ముట్టుకోవద్దు: ఉద్యోగం పోగానే కంగారులో రిటైర్మెంట్ కోసం దాచుకున్న పీఎఫ్ (PF) లేదా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లను వెనక్కి తీసుకోవద్దు. అది మీ భవిష్యత్తును దెబ్బతీస్తుంది.
నేటి అనిశ్చిత కాలంలో ఆర్థిక ప్రణాళిక అనేది ఒక ఎంపిక కాదు, అది ఒక అవసరం. ఉద్యోగం ఉన్నప్పుడే జాగ్రత్త పడటం తెలివైన పని.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏమిటి?
అనుకోకుండా ఉద్యోగం కోల్పోయినా లేదా అనారోగ్యం పాలైనా, మీ జీవనశైలి దెబ్బతినకుండా కనీసం ఏడాది పాటు మీ ఖర్చులను భరించేలా పక్కన పెట్టుకున్న నిధినే ఎమర్జెన్సీ ఫండ్ అంటారు.
2. ఎమర్జెన్సీ ఫండ్ను ఎక్కడ దాచుకోవాలి?
అవసరమైనప్పుడు వెంటనే తీసుకునేలా బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్, లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్లలో ఉంచుకోవడం శ్రేయస్కరం.
3. నా జీతంలో ఎంత శాతం పొదుపు చేయాలి?
కనీసం మీ ఆదాయంలో 20 శాతం ఎమర్జెన్సీ ఫండ్ కోసం కేటాయించండి. ఒకవేళ మీకు హోమ్ లోన్ వంటి ఈఎంఐలు ఉంటే ఈ నిధిని మరింత పెంచుకోవాలి.
4. ఎమర్జెన్సీ ఫండ్ ఉండగా ఇన్సూరెన్స్ అవసరమా?
అవసరమే. ఎమర్జెన్సీ ఫండ్ రోజువారీ ఖర్చుల కోసం, కానీ మెడికల్ ఎమర్జెన్సీలో లక్షల రూపాయల ఖర్చును బీమా మాత్రమే కవర్ చేస్తుంది. ఈ రెండూ వేర్వేరు.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్లో సాక్షి టాస్క్ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్గా, సబ్ ఎడిటర్గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


