...
...
Next Story

AIBE 20 ఫలితాలు విడుదల: 69.21 శాతం మంది అర్హత.. తదుపరి పరీక్ష ఎప్పుడంటే?

బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా AIBE-XX ఫలితాలను విడుదల చేసింది. మొత్తం 1.74 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఐదు ప్రశ్నలను తొలగించడంతో ఈసారి ఫలితాలను 95 మార్కులకు లెక్కించారు. తదుపరి పరీక్ష జూన్ 7న జరగనుంది.

Published on: Jan 07, 2026 06:05 PM IST
Advertisement

న్యూఢిల్లీ, జనవరి 7, 2026: దేశవ్యాప్తంగా న్యాయవాద వృత్తిని చేపట్టాలనుకునే వారు రాసే 'ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్' (AIBE-XX) ఫలితాలు వెలువడ్డాయి. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) బుధవారం ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించింది. పరీక్ష రాసిన అభ్యర్థులు తమ స్కోర్‌కార్డులను అధికారిక వెబ్‌సైట్ allindiabarexamination.com లో చూడవచ్చు.

69.21 శాతం మంది క్వాలిఫై!

AIBE 20 ఫలితాలు విడుదల: 69.21 శాతం మంది అర్హత.. తదుపరి పరీక్ష ఎప్పుడంటే? (PTI)
AIBE 20 ఫలితాలు విడుదల: 69.21 శాతం మంది అర్హత.. తదుపరి పరీక్ష ఎప్పుడంటే? (PTI)

గతేడాది నవంబర్ 30న దేశంలోని 56 నగరాల్లో జరిగిన ఈ పరీక్షకు భారీ స్పందన లభించింది.

  • మొత్తం హాజరైన వారు: 2,51,968 మంది.
  • ఉత్తీర్ణులైన వారు: 1,74,386 మంది (69.21%).
  • వివరాలు: ఉత్తీర్ణులైన వారిలో 1,13,063 మంది పురుషులు, 61,310 మంది మహిళలు, 13 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు.

కేటగిరీల వారీగా చూస్తే.. అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీలో 90,111 మంది, ఓబీసీలో 53,513 మంది, ఎస్సీ కేటగిరీలో 25,290 మంది, ఎస్టీ కేటగిరీలో 5,472 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.

ఐదు ప్రశ్నల తొలగింపు.. 95 మార్కులకే లెక్కింపు:

పరీక్ష తర్వాత అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను సబ్జెక్ట్ నిపుణుల కమిటీ క్షుణ్ణంగా పరిశీలించింది. "ప్రశ్నాపత్రంలోని 100 ప్రశ్నల్లో ఐదు ప్రశ్నలు తప్పుగా ఉన్నట్లు గుర్తించాం. అందుకే వాటిని తొలగించాలని మానిటరింగ్ కమిటీ నిర్ణయించింది. మరో రెండు ప్రశ్నలకు రెండేసి సరైన సమాధానాలు ఉండటంతో, ఆ రెండింటిలో ఏది పెట్టినా పూర్తి మార్కులు కేటాయించాం" అని బార్ కౌన్సిల్ అధికారులు వివరించారు. దీనివల్ల ఫలితాలను 100 మార్కులకు కాకుండా 95 మార్కులకే లెక్కించారు.

జనరల్/ఓబీసీ అభ్యర్థులకు: 43 మార్కులు (95లో 45%).

ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు: 38 మార్కులు (95లో 40%).

తదుపరి పరీక్ష (AIBE-XXI) షెడ్యూల్ ఖరారు:

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe