Hyundai Creta : నెక్ట్స్ జనరేషన్ హ్యుందాయ్ క్రెటా.. ఎలా ఉంటుందో తెలుసా?

Hyundai Creta facelift : భారత్​తో పాటు విదేశాల్లో త్వరలో లాంచ్ అయ్యే నెక్ట్స్ జనరేషన్ హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ వివరాలు వెల్లడయ్యాయి. సరికొత్త డిజైన్, హైటెక్ ఫీచర్లు, హైబ్రిడ్ ఇంజిన్‌తో ఈ కారు రానుంది. వివరాల్లోకి వెళితే..

Published on: Aug 8, 2026, 06:45:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ తన పాపులర్ ఎస్‌యూవీ 'క్రెటా' ఎస్​యూవీకి చెందిన నెక్ట్స్ జనరేషన్ మోడల్‌ను భారత్‌తో పాటు విదేశాల్లోనూ విస్తృతంగా పరీక్షిస్తోంది. లీకైన చిత్రాలు, స్పై షాట్ల ఆధారంగా ప్రముఖ డిజైనర్ ‘న్యామమొత్’ 2027 హ్యుందాయ్ క్రెటా రెండరింగ్ డిజైన్‌ను విడుదల చేశారు. ఈ మూడో తరానికి చెందిన సరికొత్త మోడల్‌ను అంతర్జాతీయ మార్కెట్లలో కొత్త కోనా పేరుతో కూడా హ్యుందాయ్ విక్రయించనుంది. 2027 ప్రారంభంలో ఈ నూతన మోడల్ ప్రపంచం ముందుకు రానుందని, అదే ఏడాది జరిగే ‘భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో’లో ఇది అరంగేట్రం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆటో రంగ నిపుణులు పేర్కొన్నారు.

హ్యుందాయ్ క్రెటా ఎస్​యూవీ..
హ్యుందాయ్ క్రెటా ఎస్​యూవీ..

మారిన కస్టమర్ల రుచికి తగ్గట్టుగా ప్రీమియం, టెక్నాలజీతో కూడిన చిన్న ఎస్‌యూవీల డిమాండ్‌ను అందుకోవడానికి హ్యుందాయ్ ఈ ప్రాజెక్ట్‌ను వేగవంతం చేసినట్లు కొరియన్ మీడియా నివేదించింది. ఈ కొత్త కారులో నిర్మాణాత్మక, ఆర్కిటెక్చరల్ మార్పులు భారీగా ఉండనున్నాయి.

పాత గుండ్రని డిజైన్‌కు స్వస్తి పలికి, భవిష్యత్ తరానికి తగినట్లుగా సరికొత్త ఫ్యూచరిస్టిక్ లుక్‌తో ఈ 2027 హ్యుందాయ్ క్రెటా వస్తోంది. క్రేటర్ కాన్సెప్ట్ స్ఫూర్తితో దీన్ని తీర్చిదిద్దినట్లు స్పై చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, హ్యుందాయ్ నుంచి ఇప్పటివరకు వచ్చిన ఏ కారుకూ పోలిక లేని విధంగా ఒక యూనిక్ డిజైన్‌ను ఎంచుకున్నట్లు రెండరింగ్ ద్వారా స్పష్టమవుతోంది.

ఈ నూతన మోడల్ ఎత్తైన హుడ్ లైన్, నిలువుగా ఉండే ఫ్రంట్ ఫేషియా, ఫ్లాట్ రూఫ్‌తో ఒక రగ్డ్ ఎస్‌యూవీ ప్రొఫైల్‌ను కలిగి ఉంది. దీని హై-ఎండ్ వేరియంట్లలో పారామెట్రిక్ పిక్సెల్ లైటింగ్ ఎలిమెంట్స్ ఇవ్వనున్నారు. తద్వారా ఐసీఈ క్రెటాను హ్యుందాయ్ ఐయానిక్ ఈవీ సబ్-బ్రాండ్‌తో అనుసంధానించినట్లు అవుతుంది. అంతేకాదు, నూతన తరం క్రెటాలో ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది.

ఈ హ్యుందాయ్ ఎస్‌యూవీ వీల్‌బేస్ దాదాపు 2690 ఎంఎం ఉండొచ్చని అంచనా. ఈ ఎస్‌యూవీ పొడవు సుమారు 4.45 నుంచి 4.5 మీటర్ల వరకు ఉండవచ్చు. తద్వారా కొత్త బేయాన్ మిడ్‌సైజ్ ఎస్‌యూవీని ప్రవేశపెట్టడానికి తగినంత స్థలం లభిస్తుంది.

ఎక్కువ వీల్‌బేస్ కారణంగా 2027 క్రెటా క్యాబిన్ లోపల ఎక్కువ స్థలంతో పాటు పెద్ద బూట్ స్పేస్‌ను అందిస్తుంది. డ్యూయల్-పేన్ పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, యాంబియంట్ లైటింగ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ అండ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి అధునాతన ఫీచర్లు ఇందులో ఉంటాయి.

నూతన క్రెటా ఎస్​యూవీలో హ్యుందాయ్ ‘ప్లియోస్ కనెక్ట్’ సిస్టమ్ ఉండనుందని మునుపటి స్పై చిత్రాలు ధృవీకరించాయి. ఇందులో పెద్ద సెంట్రల్ టచ్‌స్క్రీన్ తో పాటు స్లీక్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ఇస్తున్నారు. డ్రైవింగ్ సమయంలో దృష్టి మరలకుండా ఉండేందుకు కంపెనీ కోర్ కంట్రోల్స్ కోసం ఫిజికల్ బటన్లు, డయల్స్‌ను యథావిధిగా కొనసాగించనుంది.

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇంజిన్ ఆప్షన్లనే నూతన తరం క్రెటాలోనూ కొనసాగించనున్నారు. వీటిలో 1.5-లీటర్ ఎన్ఏ పెట్రోల్, 1.5-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ సీఆర్‌డీఐ డీజిల్ ఇంజిన్లు ఉన్నాయి. అయితే ఈసారి అదనంగా 1.5-లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్‌ను కూడా హ్యుందాయ్ తీసుకురానుంది. ఈ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్.. చిన్న బ్యాటరీ ప్యాక్, సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్‌తో కూడిన 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌పై ఆధారపడి ఉంటుందని భావిస్తున్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More