ఏపీ పీజీ ఈసెట్ - 2025 ప్రవేశాలు - కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల
ఏపీ పీజీఈసెట్ - 2025 కౌన్సెలింగ్ ప్రక్రియపై కీలక అప్డేట్ వచ్చేసింది. జూలై 9వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. cets.apsche.ap.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
ఏపీలో ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మా డి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ పీజీఈసెట్-2025 కు సంబంధించి అధికారులు కీలక ప్రకటన చేశారు. జూలై 9వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని వెల్లడించారు.
ఏపీ పీజీఈసెట్
పీ పీజీఈసెట్-2025లో అర్హత సాధించిన అభ్యర్థులు…. జూలై 9వ తేదీ నుంచి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. ఈ గడువు జూలై 12వ తేదీతో పూర్తవుతుంది. జూలై 17వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు అందుబాటులోకి వస్తాయని అధికారులు ప్రకటించారు. నిర్ణయించిన రుసుంతో పాటు రిజిస్ట్రేషన్ల ప్రక్రియను https://cets.apsche.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా పూర్తి చేసుకోవాలని సూచించారు.
ఏపీ పీజీఈసెట్ - 2025లో భాగంగా…. 13 సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించారు. మొత్తంగా 14,231 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 11,244 మంది అర్హత సాధించారు. అభ్యర్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.
ఏపీ పీజీఈసెట్ ర్యాంక్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోండి:
అభ్యర్థులు ముందుగా https://cets.apsche.ap.gov.in/PGECET/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
హోం పేజీలోని ర్యాంక్ కార్డుపై లింక్ క్లిక్ చేయాలి.
ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, పీజీఈసెట్ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
వ్యూ ర్యాంక్ కార్డ్ లింక్ పై క్లిక్ చేస్తే ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.