Monsoon: ఏపీ, తెలంగాణ ప్రజలకు చల్లని కబురు.. రేపే కేరళను తాకనున్న రుతుపవనాలు.. ఐదు రోజుల పాటు దంచికొట్టే వానలు

Monsoon: భానుడి భగభగలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. రేపు అంటే గురువారం (జూన్ 4) నైరుతి రుతుపవనాలు కేరళను తాకబోతున్నాయి. దీనికి తోడు ఏపీ, తెలంగాణలో రాబోయే ఐదు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

Published on: Jun 03, 2026 8:56 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Monsoon: ఎండల తీవ్రతతో తెలుగు రాష్ట్రాల్లో జనం అల్లాడిపోతున్నారు. ఎండల సెగలకు తోడు ఉక్కపోతతో నరకం చూస్తున్న సామాన్యులకు, వర్షాల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న రైతులకు వాతావరణ శాఖ ఒకేసారి కూల్ న్యూస్ అందించింది. దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగాన్ని శాసించే నైరుతి రుతుపవనాల (Southwest Monsoon) కదలికలు వేగం పుంజుకున్నాయి. రేపు (గురువారం, జూన్ 4) ఇవి కేరళ తీరాన్ని తాకడానికి వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలంగా మారాయి.

Monsoon: ఏపీ, తెలంగాణ ప్రజలకు చల్లని కబురు.. రేపే కేరళను తాకనున్న రుతుపవనాలు.. ఐదు రోజుల పాటు దంచికొట్టే వానలు
Monsoon: ఏపీ, తెలంగాణ ప్రజలకు చల్లని కబురు.. రేపే కేరళను తాకనున్న రుతుపవనాలు.. ఐదు రోజుల పాటు దంచికొట్టే వానలు

కేరళ ఎంట్రీ తర్వాతే ఏపీపై క్లారిటీ

నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం నైరుతి, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలతో పాటు లక్షద్వీప్, కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు వేగంగా విస్తరిస్తున్నాయి. బంగాళాఖాతంలో కూడా వీటి కదలికలు చాలా చురుగ్గా సాగుతున్నాయి. పశ్చిమ-మధ్య, తూర్పు-మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని చాలా ప్రాంతాల్లోకి రుతుపవనాలు మరింతగా రావడానికి వాతావరణం పూర్తి అనుకూలంగా ఉంది.

"రేపు నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకిన తర్వాత, ఆంధ్రప్రదేశ్‌లోకి ఇవి ఎప్పుడు ప్రవేశిస్తాయనే దానిపై మాకు ఒక పక్కా క్లారిటీ వస్తుంది" అని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ చెప్పారు.

ఉత్తర భారతం నుంచి తమిళనాడు వరకు ద్రోణి

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. ప్రస్తుతం పశ్చిమ ఉత్తర ప్రదేశ్ మీదుగా ఒక ఉపరితల ఆవర్తనం ఉంది. దీని ఎఫెక్ట్‌తో మధ్యప్రదేశ్, విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉత్తర తమిళనాడు వరకు ఒక పెద్ద ద్రోణి విస్తరించి ఉంది. ఈ వాతావరణ మార్పుల వల్ల రాబోయే ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లోని చాలా ఏరియాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉంది.

అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన వర్షాలు పడొచ్చు. ముఖ్యంగా ఇవాళ గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని అధికారులు వార్నింగ్ ఇచ్చారు. ప్రజలు, ముఖ్యంగా రైతులు చాలా అలర్ట్‌గా ఉండాలని సూచించారు. ఖరీఫ్ సీజన్ పనులకు సిద్ధమవుతున్న రైతులకు ఈ వానలు బాగా ఉపయోగపడనున్నాయి.

మండిపోతున్న ఎండలు.. అక్కడ మాత్రం వర్షాలు

గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత పీక్స్‌కు చేరింది. నెల్లూరు జిల్లా కావలిలో అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డై ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది. అయితే మరోవైపు ఉత్తరాంధ్రలో వాతావరణం కాస్త కూల్ అయింది.

గత 24 గంటల్లో విశాఖపట్నం జిల్లా భీమిలి చుట్టుపక్కల ప్రాంతాల్లో అత్యధికంగా 2 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. ఈ వర్షాలు రాబోయే రోజుల్లో మరింత విస్తరించి, ఎండల తీవ్రత నుంచి ఫుల్ రిలీఫ్ ఇస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

నైరుతి రుతుపవనాలు కేరళను ఎప్పుడు తాకబోతున్నాయి?

వాతావరణ శాఖ అంచనా ప్రకారం రేపే (జూన్ 4న) నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో రుతుపవనాల ఎంట్రీపై ఎప్పుడు క్లారిటీ వస్తుంది?

రేపు కేరళ తీరంలోకి రుతుపవనాలు అఫీషియల్‌గా ఎంటర్ అయిన తర్వాత, ఏపీకి ఇవి ఎప్పుడు వస్తాయనే దానిపై విశాఖ వాతావరణ కేంద్రం ఫుల్ క్లారిటీ ఇవ్వనుంది.

రాబోయే ఐదు రోజులు ఏపీలో వాతావరణం ఎలా ఉంటుంది?

ఉపరితల ద్రోణి ఎఫెక్ట్‌తో రాబోయే ఐదు రోజుల పాటు ఏపీలో వర్షాలు కురుస్తాయి. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 50-60 కిమీ స్పీడ్‌తో ఈదురు గాలులు వీచే ఛాన్స్ ఉంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More