హైదరాబాద్‌లో 'యాపిల్' రిటైల్ స్టోర్‌..! రిక్రూట్​మెంట్​ షురూ

హైదరాబాద్‌లో కొత్తగా రిటైల్ స్టోర్‌ ప్రారంభించడంపై యాపిల్ కంపెనీ కసరత్తు చేస్తోంది. 2027లో దీన్ని ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందుకోసం నియామకాలను చేపట్టింది.

Published on: Feb 5, 2026, 18:09:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రపంచ టెక్‌ దిగ్గజం యాపిల్‌ కంపెనీ… భారత్‌లో రిటైల్‌ స్టోర్స్‌ని విస్తరిసించే పనిలో పడింది. గతేడాది బెంగళూరు, పూణె, నోయిడాలో రిటైల్ స్టోర్లను ప్రారంభించిన ఆ సంస్థ… కొత్తగా హైదరాబాద్‌లోనూ ప్రారంభించడంపై కసరత్తు చేస్తోంది.

యాపిల్ కంపెనీ (ఫైల్ ఫొటో)
యాపిల్ కంపెనీ (ఫైల్ ఫొటో)

రిక్రూట్​మెంట్​ షురూ…

కొత్త రిటైల్ స్టోర్ ప్రారంభించే పనుల్లో భాగంగా కీలకమైన రిక్రూట్ మెంట్ ప్రక్రియను పూర్తి చేయనుంది. స్టోర్‌ లీడర్, సీనియర్‌ మేనేజర్‌ తో పాటు ఇతర ఉద్యోగాలను రిక్రూట్ చేయనుంది. ఇందుకు సంబంధించి సంస్థ కెరీర్ పోర్టల్‌లో ఓ పోస్ట్‌ చేసింది.

సాధారణంగా స్టోర్‌ని ప్రారంభించడానికి యాపిల్‌ సుమారు ఏడాది ముందు నుంచి రిక్రూట్‌మెంట్‌ చేపడుతుంది. దీన్ని బట్టి చూస్తే హైదరాబాద్‌ లో 2027లో రిటైల్ స్టోర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని అంచనా. అంతేకాకుండా ముంబైలో ఈ ఏడాది మరో స్టోర్ ను కూడా ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

వాల్యూమ్ పరంగా భారత్ లో టాప్ ఐదు స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లలో తన స్థానాన్ని మరింత బలపరచుకోవడమే లక్ష్యంగా యాపిల్ కంపెనీ ఈ విస్తరణ చేపడుతున్నట్లు పారిశ్రామిక వర్గాలు భావిస్తున్నాయి.

డిసెంబర్‌లో ఆపిల్ రిటైల్, పీపుల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డీర్డ్రే ఓ'బ్రియన్ మనీకంట్రోల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆమె మాట్లాడుతూ…. భారత్ లో తదుపరి దశ రిటైల్ విస్తరణతో ఆపిల్‌కు ఉన్న దీర్ఘకాలిక నిబద్ధతను ప్రతిబింబిస్తుందన్నారు. 25 సంవత్సరాలకు పైగా మంచి ఉత్పత్తులు, సేవలను అందిస్తున్నామని వివరించారు.

2020లో ఆన్‌లైన్ స్టోర్‌తో భారత్ లో యాపిల్ కంపెనీ.. తన రిటైల్ ప్రయాణాన్ని ప్రారంభించింది. 2023లో ముంబై, ఢిల్లీలో ఫ్లాగ్‌షిప్ స్టోర్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది.ఆ తర్వాత బెంగళూరు, పూణే, నోయిడాలో స్టోర్‌లను ప్రారంభించింది. మొత్తంగా దేశంలో 5 యాపిల్ స్టోర్లు ఉన్నాయి. ఈ ఏడాదిలో ముంబైలో మరో స్టోర్ ప్రారంభిస్తే ఈ సంఖ్యకు ఆరుకు చేరుకుంటుంది.

భారత్ లో యాపిల్ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది. రిటైల్ అనుభవంతో పాటు మంచి నాణ్యతతో కూడిన ఉత్పతులు ఉండటంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపుతూ వస్తున్నారు. అమ్మకాల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More