ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో అందరి కళ్లు ఇప్పుడు మే 4న జరగబోయే కౌంటింగ్పైనే ఉన్నాయి. అయితే, అంతకంటే ముందే విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రాజకీయ వేడిని పెంచేశాయి. ఈ అంచనాల ప్రకారం ఎక్కడ ఏ పార్టీ జెండా ఎగురవేయబోతోందో ఒకసారి లుక్కేద్దాం.
అసోం హిమంత శర్మ మ్యాజిక్!

అసోంలో బీజేపీ 'సునామీ' సృష్టించబోతోందని యాక్సిస్ మై ఇండియా అంచనా వేసింది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలో బీజేపీ క్లీన్ స్వీప్ చేసే దిశగా సాగుతోంది. కాంగ్రెస్ కూటమి కేవలం 24-36 సీట్లకే పరిమితమయ్యేలా కనిపిస్తోంది.
తమిళనాడు స్టాలిన్ హవా!
తమిళనాడులో మరోసారి డీఎంకే స్పష్టమైన మెజారిటీతో అధికారాన్ని నిలబెట్టుకోనుంది. అయితే ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. రాజకీయ అరంగేట్రం చేసిన నటుడు విజయ్ పార్టీ (TVK) 18-24 సీట్లు సాధించే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ అంచనా వేయడం విశేషం.
పశ్చిమ బెంగాల్: దీదీ వర్సెస్ మోదీ!
బెంగాల్ కోటలో మమతా బెనర్జీ తన పట్టును నిలుపుకోనున్నట్లు కనిపిస్తోంది. పీపుల్స్ పల్స్ ప్రకారం.. 177-187 సీట్లతో టీఎంసీ ముందంజలో ఉండగా, బీజేపీ 95-110 సీట్లతో గట్టి పోటీనిస్తోంది. ముఖ్యంగా మహిళా ఓటర్ల తీర్పు ఇక్కడ కీలకం కానుంది.
కేరళం: యూడీఎఫ్కు కుర్చీ!
కేరళంలో ఎప్పటిలాగే ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య హోరాహోరీ పోరు సాగింది. అయితే ఈసారి యూడీఎఫ్ (కాంగ్రెస్ కూటమి) స్వల్ప ఆధిక్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ అంచనాలు చెబుతున్నాయి. యూడీఎఫ్: 75 – 85, ఎల్డీఎఫ్: 55 – 65, బీజేపీ: 0 – 3 సీట్లు వచ్చే అవకాశం ఉంది.
పుదుచ్చేరి: కమలం కూటమిదే అధికారం!
ఇక పుదుచ్చేరిలో ఎన్డీఏ (NRC + BJP) కూటమి అధికారాన్ని చేజిక్కించుకోనుంది. ఇక్కడ భారీగా నమోదైన 89 శాతం ఓటింగ్ ఎన్డీఏకు కలిసి రానుందని విశ్లేషకులు భావిస్తున్నారు. పుదుచ్చేరిలో మొత్తం 30 స్థానాలు ఉన్నాయి. పీపుల్స్ పల్స్ అంచనాల ప్రకారం.. ఎన్ఆర్సీ: 16 - 19, కాంగ్రెస్: 10 - 12, ఇతరులు: 1 - 2 సీట్లు రానున్నాయి.
{{/usCountry}}ఇక పుదుచ్చేరిలో ఎన్డీఏ (NRC + BJP) కూటమి అధికారాన్ని చేజిక్కించుకోనుంది. ఇక్కడ భారీగా నమోదైన 89 శాతం ఓటింగ్ ఎన్డీఏకు కలిసి రానుందని విశ్లేషకులు భావిస్తున్నారు. పుదుచ్చేరిలో మొత్తం 30 స్థానాలు ఉన్నాయి. పీపుల్స్ పల్స్ అంచనాల ప్రకారం.. ఎన్ఆర్సీ: 16 - 19, కాంగ్రెస్: 10 - 12, ఇతరులు: 1 - 2 సీట్లు రానున్నాయి.
{{/usCountry}}