టీ20 ప్రపంచకప్ 2026లో భారీ సంచలనం నమోదైంది. మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి వెళ్లిపోయింది. మంగళవారం (ఫిబ్రవరి 17) పల్లెకెలెలో జింబాబ్వే, ఐర్లాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఆస్ట్రేలియా ఇంటిదారి పట్టక తప్పలేదు. దీంతో జింబాబ్వే సూపర్ 8 దశకు అర్హత సాధించింది.
మ్యాచ్ రద్దు.. జింబాబ్వేకు అదృష్టం

టీ20 వరల్డ్ కప్ 2026లో జింబాబ్వేకు అదృష్టం కలిసి వచ్చింది. ఆస్ట్రేలియాపై సంచలనం విజయం సాధించడంతోపాటు ఐర్లాండ్ తో మ్యాచ్ రద్దవడంతో ఏకంగా సూపర్ 8లోకి దూసుకెళ్లింది. వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే జింబాబ్వే, ఐర్లాండ్ మ్యాచ్ రద్దవడంతో ఆస్ట్రేలియాకు నిరాశ తప్పలేదు.
ఆస్ట్రేలియా సూపర్ 8కి వెళ్లాలంటే ఐర్లాండ్ కచ్చితంగా జింబాబ్వేను ఓడించి ఉండాల్సింది. కానీ వర్షం వల్ల మ్యాచ్ రద్దు కావడంతో పాయింట్ల పట్టికలో జింబాబ్వే ముందంజ వేసింది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఆస్ట్రేలియా గ్రూప్ దశలోనే వెనుదిరగడం ఇది రెండోసారి. మొదటిసారి 2009లోనూ ఇలా జరిగింది.
ఆస్ట్రేలియా పతనానికి కారణాలు..
టీ20 వరల్డ్ కప్ టోర్నీ ఆరంభానికి ముందే ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బలు తగిలాయి. స్టార్ బౌలర్లు ప్యాట్ కమిన్స్, జోష్ హేజిల్వుడ్ గాయాల కారణంగా టోర్నీకి దూరమయ్యారు. కెప్టెన్ మిచెల్ మార్ష్ కూడా గాయం వల్ల మొదటి రెండు మ్యాచ్లకు దూరమయ్యాడు.
ట్రావిస్ హెడ్ సారథ్యంలో ఐర్లాండ్పై గెలిచినా, జింబాబ్వే చేతిలో 23 పరుగుల తేడాతో ఓడిపోవడం ఆసీస్ కొంపముంచింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో మార్ష్, హెడ్ కలిసి 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పినా, ఆ తర్వాత బ్యాటింగ్ కుప్పకూలింది. పథుమ్ నిస్సంక సెంచరీతో శ్రీలంక విజయం సాధించి ఆసీస్ను కష్టాల్లోకి నెట్టింది.
జింబాబ్వే సూపర్ 8 ఎంట్రీ.. భారత్తో పోరు
వర్షం ఆస్ట్రేలియా ఆశలపై నీళ్లు చల్లగా, జింబాబ్వేకు మాత్రం కలిసొచ్చింది. ఐసీసీ సీడింగ్స్ ప్రకారం జింబాబ్వే ఇప్పుడు ఆస్ట్రేలియా స్థానాన్ని భర్తీ చేసి.. భారత్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ ఉన్న గ్రూపులో చేరింది.
{{/usCountry}}వర్షం ఆస్ట్రేలియా ఆశలపై నీళ్లు చల్లగా, జింబాబ్వేకు మాత్రం కలిసొచ్చింది. ఐసీసీ సీడింగ్స్ ప్రకారం జింబాబ్వే ఇప్పుడు ఆస్ట్రేలియా స్థానాన్ని భర్తీ చేసి.. భారత్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ ఉన్న గ్రూపులో చేరింది.
{{/usCountry}}సూపర్ 8లో భాగంగా జింబాబ్వే తన తదుపరి మ్యాచ్ను టీమిండియాతో ఆడనుంది. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 26 అంటే వచ్చే గురువారం నాడు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతుంది.
సూపర్ 8కి చేరడం ద్వారా జింబాబ్వే 2028లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ వేదికగా జరిగే తదుపరి టీ20 ప్రపంచకప్కు నేరుగా అర్హత సాధించింది. 2024లో ఉగాండా చేతిలో ఓడి క్వాలిఫై కాలేకపోయిన జింబాబ్వేకు ఇది గొప్ప పునరాగమనం అనే చెప్పాలి.