బీహార్ ఎన్నికల ఫలితాలు 2025 లైవ్: ఎన్డీయే క్లీన్ స్వీప్.. నితీష్కే మళ్లీ పట్టం
బీహార్ ఎన్నికల ఫలితాలు 2025 లైవ్: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. ఇప్పటి వరకు ఉన్న ఫలితాల్లో మొత్తం 243 సీట్లకు గాను 180కి పైగా సీట్లలో ఎన్డీయే కూటమి ముందంజలో ఉండగా, మహా కూటమి 36 సీట్లకు పరిమతమైంది. లైవ్ అప్డేట్స్ ఇక్కడ చూడొచ్చు.
బీహార్ ఎన్నికల ఫలితాలు 2025 లైవ్: ఎన్డీయే ఘన విజయం.. కూటమి 36 సీట్లకు పరిమితం.

బీహార్ అసెంబ్లీ 2025 ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్ ఇక్కడ చూడొచ్చు.
...Read More10 వేల ఆధిక్యంలో తేజస్వీ యాదవ్
ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ 24వ రౌండ్కు వచ్చేసరికి 10,276 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అంతకుముందు ఆయన బీజేపీ అభ్యర్థి సతీష్ కుమార్ కంటే 3 వేల ఓట్ల పైచిలుకు వెనకంజలో ఉన్నారు. మళ్లీ పుంజుకుని భారీ ఆధిక్యం దిశగా వెళుతున్నారు.
ఐదో అతి పెద్ద పార్టీగా ఎంఐఎం.. దారుణంగా కాంగ్రెస్ పొజిషన్
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటి వరకు ఉన్న ఫలితాలమేరకు అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ 6 స్థానాలతో ఐదో అతి పెద్ద పార్టీగా నిలవగా, కాంగ్రెస్ కేవలం 2 సీట్లలోనే ముందంజలో ఉండి (ఇప్పటి వరకు ఉన్న ఫలితాలను బట్టి) 8వ స్థానంలోకి పడిపోయింది.
94 సీట్లలో బీజేపీ ముందంజ
బీహార్ అసెంబ్లీలో బీజేపీ అతి పెద్ద పార్టీగా నిలవబోతోంది. ఇప్పటి వరకు 94 సీట్లలో ముందంజలో ఉంది. ఎన్డీయే కూటమిలోని మరో పార్టీ జేడీయూ 84 సీట్లలో ముందంజలో ఉంది. మరో కీలక మిత్ర పక్షం లోక్ జనశక్తి (రాంవిలాస్) పార్టీ 19 సీట్లలో ముందంజలో ఉంది.
‘ఎన్డీయే పంచ పాండవులతో సమానం’
ఎన్డీఏ కూటమి విజయంపై తనకు ఉన్న అచంచల విశ్వాసాన్ని చాటుకుంటూ, అమిత్ షా మహాభారతంతో పోల్చారు. మహాఘట్బంధన్లో ఎన్ని పార్టీలు ఉన్నప్పటికీ, ఎన్డీఏ 'పంచ పాండవుల' వలే ఐక్యంగా ఉందని ఆయన నొక్కి చెప్పారు. "ఈ ఎన్నికలు కేవలం మా అభ్యర్థులను శాసనసభ్యులుగా లేదా మంత్రులుగా చేయడానికే కాదు. బిహార్ను మళ్లీ 'జంగిల్ రాజ్' (అటవీ పాలన) నుంచి విముక్తం చేయడానికి ఉద్దేశించినవి" అని షా ఉద్ఘాటించారు. ఎన్డీఏలో ఐదుగురు మిత్రపక్షాలు పాండవుల వలే కలిసికట్టుగా పోరాడుతున్నాయని షా వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ మద్దతు, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వం, చిరాగ్ పాశ్వాన్ యువ శక్తి, జితన్ రామ్ మాంఝీ జీవితకాల అంకితభావం, ఉపేంద్ర కుష్వాహా అనుభవం.. ఈ ఐదుగురి కలయికతో ఏర్పడిన ఎన్డీఏ విజయం ఈ ఎన్నికల యుద్ధంలో ఖాయమని అమిత్ షా ఇటీవలే ప్రచారంలో అన్నారు.
లాలూ-రాహుల్ ఆట సమాప్తం.. అమిత్ షా వ్యాఖ్య
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎన్డీఏ (NDA) కూటమికి అనుకూలంగా వస్తున్న తరుణంలో, కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం (నవంబర్ 12న) సమస్తిపూర్లో జరిగిన ర్యాలీలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజమవుతున్నాయి. ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 1 గంట అయ్యేసరికి లాలూ ప్రసాద్ యాదవ్, రాహుల్ గాంధీల 'ఆట' సమాప్తమవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. "నేను బిహార్ రాష్ట్రమంతటా పర్యటించాను. ఎక్కడికెళ్లినా ఇంతే భారీ జనసందోహాన్ని చూశాను. నవంబర్ 14 ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. 9 గంటలకు బ్యాలెట్ పెట్టెలు తెరుచుకుంటాయి. ఒకటి అయ్యేసరికి లాలూ, రాహుల్ల ఆట సమాప్తమవుతుంది” అని అమిత్ షా వ్యాఖ్యానించారు.
మహాకూటమికి షాక్: తేజస్వీ యాదవ్ వెనుకంజ
ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ రాఘోపూర్ నుంచి వెనకంజలో ఉన్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి సతీష్ కుమార్ తేజస్వీ యాదవ్ పై 3,230 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు.
డబుల్ సెంచరీ మార్కు దాటిన ఎన్డీయే కూటమి
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి చారిత్రక విజయం నమోదు చేయబోతోంది. 243 సీట్లకు గాను 201 సీట్లలో ఆధిక్యత కనబరుస్తోంది. ఈ కూటమిలోని బీజేపీ 91, జేడీయూ 81, లోక్ జన్శక్తి (రాంవిలాస్) పార్టీ 22 సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఆర్జేడీ నేతృత్వంలోని మహా కూటమి 36 సీట్లకు పరిమితమవుతోంది.
మహాఘట్బంధన్ కు షాక్
తేజస్వి యాదవ్ నేతృత్వంలోని మహాఘట్బంధన్ కూటమికి ఈ ఫలితాలు పెద్ద షాక్నిచ్చాయి. ఈ కూటమి 50 సీట్ల మార్కును కూడా దాటడానికి నానా తంటాలు పడుతోంది. పోల్ సర్వేలు మహాఘట్బంధన్కు గరిష్టంగా 118 సీట్ల వరకు రావొచ్చని ఎగ్జిట్ పోల్స్ ద్వారా అంచనా వేశాయి. కానీ ఘోర పరాజయం వైపు పయనిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈసీఐ గణాంకాల ప్రకారం ఇప్పుడు ఈ కూటమి 42 సీట్లకు పరిమితమైంది. ఆర్జేడీ 32 సీట్లలో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 4 సీట్లలో ఆధిక్యంలో, సీపీఐ (ఎంఎల్) (ఎల్) 5 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి.. 192 స్థానాల్లో ఎన్డీయే ఆధిక్యత
చాలావరకు ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏకు 130 నుంచి 172 సీట్లు వస్తాయని అంచనా వేశాయి. హోంమంత్రి అమిత్ షా బిహార్లో ఎన్డీఏ 160 నుంచి 180 సీట్ల వరకు గెలుచుకుంటుందని విశ్వాసంగా పేర్కొన్నారు. ఈ అంచనాలన్నీ దాటి ఇప్పుడు ఎన్నికల సంఘం (ECI) ట్రెండ్స్ ప్రకారం బీజేపీ, జేడీయూ నేతృత్వంలోని ఎన్డీఏ 192 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
డబ్బు పంపిణీ చేసినా ఎన్నికల సంఘం పట్టించుకోలేదు: అశోక్ గెహ్లాట్
బిహార్ ఎన్నికలకు ముందు మహిళలకు ₹10,000 చొప్పున పంపిణీ జరిగిందని, కానీ దీనిపై ఎన్నికల సంఘం ఎటువంటి చర్య తీసుకోలేదని రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పేర్కొన్నారు.
3 స్థానాల్లో ఎంఐఎం ఆధిక్యం
అసదుద్దీన్ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 3 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తోంది. ఇక ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ ఒక్క స్థానంలోనూ ఆధిక్యత కనబరచలేకపోతోంది.
మహాఘట్బంధన్ పరిస్థితి దారుణం
తేజస్వి యాదవ్ నేతృత్వంలోని మహాఘట్బంధన్ కేవలం స్థానాలకు పరిమితమై, భారీగా వెనుకబడింది. కూటమి మొత్తంగా 50 స్థానాలకే పరిమితమైంది.
బిహార్ ఎన్నికల ఫలితాలు 2025: NDA తిరుగులేని ఆధిక్యం
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, అధికారంలో ఉన్న జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) తిరుగులేని ఆధిక్యంతో దూసుకుపోతోంది. మొత్తం 243 సీట్లలో మెజారిటీ మార్కు అయిన 122 స్థానాలను దాటి, భారీ విజయం దిశగా పయనిస్తోంది. బీజేపీ 84 సీట్లలో, జేడీయూ 77 సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి. లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) 22 సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి.
ఒకే కూటమిలో బీజేపీ, జేడీయూ పోటాపోటీగా గెలుపు
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి క్లీన్ స్వీప్ దిశగా సాగుతోంది. ఇందులోని రెండు ప్రధాన పార్టీలు నేనంటే నేనంటూ భారీగా సీట్లను కైవసం చేసుకుంటున్నాయి. ఇప్పటివరకు బీజేపీ 82 సీట్లు, జేడీయూ 80 సీట్లలో ముందంజలో ఉండడం విశేషం.
నితీష్ కుమార్ చాణక్యం: ఎప్పటికీ తగ్గని పట్టు
బిహార్ ముఖ్యమంత్రుల్లో అత్యధిక కాలం పనిచేసిన రికార్డు నితీష్ కుమార్ సొంతం. ఈసారి కూడా ఆయన పునరాగమనం అత్యంత ముఖ్యమైన అంశంగా నిలుస్తోంది. 2020లో సాధించిన 43 అసెంబ్లీ స్థానాల సంఖ్యను జేడీ(యూ) ఈసారి మెరుగుపరుచుకునే దిశగా వెళ్తోంది.
నితీష్ కుమార్ తన ప్రధాన ఓటు బ్యాంకు అయిన మహిళలను, అలాగే అత్యంత వెనుకబడిన తరగతులను (EBC) పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు రప్పించగలిగారు. ఇది ఆయన రాజకీయ చతురత, పదునైన వ్యూహం చెక్కుచెదరలేదని రుజువు చేసింది.
కాంగ్రెస్ బలహీనత: మహాకూటమికి దెబ్బ
మహాకూటమి లేదా గ్రాండ్ అలయన్స్కు ఈ ఫలితాల్లో దెబ్బ తగలడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ అని తెలుస్తోంది. 'పునరుత్తేజం'పై అంచనాలతో కాంగ్రెస్ పార్టీకి 60కి పైగా సీట్లు కేటాయించడం చాలా ఖరీదైన తప్పిదంగా మారింది.
కాంగ్రెస్ 2020లో గెలిచిన 19 సీట్ల కంటే తక్కువ సంఖ్యలోనే గెలిచే అవకాశం కనిపిస్తోంది. ఆర్జేడీ, కాంగ్రెస్లు సుమారు 11 స్థానాల్లో "స్నేహపూర్వక పోరాటాలు" (Friendly Fights) చేసి పోటీ పడటం, పొత్తులను పటిష్టం చేయడంలో కాంగ్రెస్ అసమర్థతను ఎత్తిచూపుతోంది. ఇది భవిష్యత్ రాజకీయాలపై కూడా దీర్ఘకాలిక ప్రభావం చూపడం ఖాయం.
ఆర్జేడీ ఎదురీత
తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ 61 స్థానాల్లో ఆధిక్యం చూపుతూ గట్టి పోటీ ఇస్తోంది. అయినప్పటికీ, మహాకూటమి మొత్తం ఆధిక్యంలో వెనుకబడింది. మొత్తంగా మహా కూటమి 77 సీట్లలో ముందంజలో ఉంది.
జితన్ రామ్ మాంఝీ ప్రభావం
గయ జిల్లాలోని ఇమామ్గంజ్ నియోజకవర్గం జితన్ రామ్ మాంఝీకి సాంప్రదాయకంగా బలమైన స్థానం. ఆయన ఇక్కడి నుంచి 2015, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా విజయం సాధించి, నియోజకవర్గంపై పట్టును నిలుపుకున్నారు. గతేడాది, మాంఝీ లోక్సభకు ఎన్నికవ్వడంతో జరిగిన ఉపఎన్నికలో ఆయన కోడలు దీపా మాంఝీ గెలుపొందారు. దీంతో ఈ ప్రాంతంలో మాంఝీ కుటుంబ ప్రభావం మరింత పటిష్టం అయింది. ఈసారి ఇమామ్గంజ్లో హెచ్.ఏ.ఎం. నుంచి దీపా మాంఝీ, ఆర్జేడీ నుంచి రితు ప్రియా చౌదరి, అలాగే జన్ సూరాజ్ పార్టీ నుంచి డాక్టర్ అజిత్ కుమార్ పోటీలో ఉండటంతో ఇది త్రిముఖ పోరుగా మారింది. జితన్ రామ్ మాంఝీ ప్రస్తుతం బిజెపి నేతృత్వంలోని ఎన్.డి.ఏ. (NDA) ప్రభుత్వంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ కేంద్ర క్యాబినెట్ మంత్రిగా కొనసాగుతున్నారు. బిహార్ రాజకీయాల్లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఇమామ్గంజ్లో జితన్ రామ్ మాంఝీకి తొలి సవాల్: వెనుకబడిన కోడలు దీపా మాంఝీ, ఆధిక్యంలో ఆర్జేడీ
కేంద్ర మంత్రి, బిహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీకి కంచుకోటగా భావించే ఇమామ్గంజ్ అసెంబ్లీ స్థానంలో తొలి ట్రెండ్స్లో ఉత్కంఠ నెలకొంది. మాంఝీ కోడలు, హిందుస్థానీ అవామ్ మోర్చా (HAM) అభ్యర్థి దీపా మాంఝీ వెనుకబడి ఉన్నారు. ఆమెపై ఆర్జేడీ అభ్యర్థి రితు ప్రియా చౌదరి ఆధిక్యంలో కొనసాగుతున్నారు (PValue డేటా ప్రకారం). మాంఝీ రాజకీయ వారసత్వం, ఆయన పార్టీ భవితవ్యం పరీక్షకు నిలిచే ఈ స్థానం ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
జేడీయూ దూకుడు: 76 సీట్లలో ముందంజ
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025లో అత్యధిక సీట్లు దక్కించుకున్న పార్టీగా జేడీయూ నిలిచే అవకాశం కనిపిస్తోంది. పోటీ చేసిన 101 సీట్లలో జేడీయూ ఇప్పటివరకు 76 సీట్లలో ముందంజలో ఉంది. ఇదే ఎన్డీయే కూటమిలోని బీజేపీ 69 సీట్లలో ముందంజలో ఉంది.
రాఘోపూర్లో తేజస్వి యాదవ్ ఆధిక్యం.. సోదరుడు తేజ్ ప్రతాప్కు మహువాలో ఎదురుదెబ్బ
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఉదయం 9:05 గంటల నాటికి (PValue డేటా ప్రకారం) రాష్ట్రీయ జనతా దళ్ (RJD) నాయకుడు తేజస్వి యాదవ్ రాఘోపూర్ నియోజకవర్గంలో ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు, RJDతో విబేధించి 'జనశక్తి జనతా దళ్ (JJD)' పేరుతో కొత్త పార్టీ పెట్టిన ఆయన సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్.. మహువా నియోజకవర్గంలో మొదట్లో ఆధిక్యం చూపినా, ఆ తర్వాత వెనుకబడ్డారు. బిహార్ రాజకీయాల్లో అన్నదమ్ముల మధ్య ఈ పోరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
150 సీట్లలో ఎన్డీయే కూటమి ముందంజ
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం దిశగా ఎన్డీయే దూసుకుపోతోంది. ఇప్పటివరకు మొత్తం 243 సీట్లకు గాను ఎన్డీయే కూటమి 150 సీట్లలో ముందంజలో ఉంది.
మెజారిటీ మార్కు దాటిన ఎన్డీయే ఆధిక్యత
బీహార్ లో అధికారం దక్కాలంటే మొత్తం 243 సీట్లలో 122 సీట్లు దక్కాలి. ఎన్డీయే ఇప్పటికే 126 సీట్లలో ఆధిక్యత కనబరుస్తోంది. ఇవీ ఎర్లీ ట్రెండ్స్ అయినప్పటికీ ఎన్డీయే దూకుడు ఇలాగే కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది.
ఆధిక్యంలో ఉన్న ముగ్గురు 'జన్ సురాజ్' అభ్యర్థులు వీరే
పివాల్యూ అనలిటిక్స్ సమాచారం ప్రకారం, ప్రస్తుతం జన్ సురాజ్ పార్టీ మూడు కీలక స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది.
చన్పటియా: త్రిపురారి కుమార్ తివారీ అలియాస్ మనీష్ కశ్యప్
చైన్పూర్: హేమంత్ కుమార్ చౌబే
కర్గాహర్: రితేష్ రంజన్
బీహార్ ఎన్నికల ఫలితాలు 2025 లైవ్: ఎన్డీయే 96, ఎంజీబీ 65
బీహార్ ఎన్నికల ఫలితాల్లో ఇప్పటి వరకు ఎన్డీయే కూటమి 96 సీట్లలో ముందంజలో ఉండగా, ఎంజీబీ 65 సీట్లలో ముందంజలో ఉంది.








