సంసారంలో కలతలు, భార్యాభర్తల మధ్య విభేదాలు అత్యంత సహజమని, కేవలం ఈ కారణాల వల్ల జీవిత భాగస్వామి ఆత్మహత్య చేసుకుంటే దానికి అవతలి వారిదే బాధ్యత అని చెప్పలేమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. భర్త ఆత్మహత్యకు ప్రేరేపించిందనే ఆరోపణలతో ఓ మహిళపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది.

బాంబే హైకోర్టుకు చెందిన నాగ్పూర్ బెంచ్ ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వైవాహిక జీవితంలో గొడవలు రావడం సర్వసాధారణమని, కేవలం మనస్పర్థలు ఉన్నంత మాత్రాన భార్యాభర్తల్లో ఒకరి ఆత్మహత్యకు మరొకరిని బాధ్యులను చేయలేమని జస్టిస్ ఊర్మిళా జోషి ఫాల్కే నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం పేర్కొంది. ఆత్మహత్యకు బలవంతం చేయడం లేదా నేరుగా ప్రేరేపించడం వంటివి ఉంటేనే అది నేరం అవుతుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
"ఇలాంటి కేసుల్లో ఒకరి వేధింపుల వల్లే మరొకరు ఆత్మహత్య చేసుకున్నారని నిర్ధారించలేం" అని కోర్టు వ్యాఖ్యానించింది.
అమరావతి పోలీసులు 2019లో తనపై నమోదు చేసిన ఆత్మహత్య ప్రేరణ కేసును కొట్టేయాలని కోరుతూ 49 ఏళ్ల ఓ ఉపాధ్యాయురాలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను విచారించిన న్యాయస్థానం ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ కేసులో భార్యాభర్తలు ఇద్దరూ ఒకరిపై ఒకరు వేధింపుల ఆరోపణలు చేసుకున్నారని, గరిష్టంగా ఆ మహిళ ప్రవర్తన వల్ల భర్త తీవ్ర నిరాశకు గురై ఉండవచ్చని మాత్రమే భావించగలమని కోర్టు అభిప్రాయపడింది.
"ఇలాంటి విభేదాలు సంసారంలో సాధారణంగా జరిగేవే. నిందితురాలికి దురుద్దేశం ఉందనే విషయాన్ని నిరూపించలేనంత వరకు, భర్త మరణానికి ఆమే కారణమని చెప్పడం సాధ్యం కాదు" అని హైకోర్టు తేల్చి చెప్పింది.
ఒక వ్యక్తిని ఆత్మహత్యకు ప్రేరేపించారనే నేరం మోపాలంటే... నిందితుడు ఆ వ్యక్తి మరణంలో ప్రత్యక్ష పాత్ర పోషించారని లేదా బలవన్మరణానికి పురికొల్పారని ప్రాసిక్యూషన్ నిరూపించాల్సి ఉంటుందని కోర్టు గుర్తు చేసింది. ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తిని తీవ్రంగా ప్రేరేపించడం లేదా ఉసిగొల్పడం జరగాలని పేర్కొంది.
{{/usCountry}}ఒక వ్యక్తిని ఆత్మహత్యకు ప్రేరేపించారనే నేరం మోపాలంటే... నిందితుడు ఆ వ్యక్తి మరణంలో ప్రత్యక్ష పాత్ర పోషించారని లేదా బలవన్మరణానికి పురికొల్పారని ప్రాసిక్యూషన్ నిరూపించాల్సి ఉంటుందని కోర్టు గుర్తు చేసింది. ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తిని తీవ్రంగా ప్రేరేపించడం లేదా ఉసిగొల్పడం జరగాలని పేర్కొంది.
{{/usCountry}}"ఆత్మహత్య ప్రేరణ నేరం వర్తించాలంటే నిందితుల్లో తప్పు చేయాలనే స్పష్టమైన ఆలోచన లేదా నేరపూరిత ఉద్దేశం ఉండాలి. అవగాహన లేదా ఉద్దేశం లేకుండా ఆత్మహత్య ప్రేరణ నేరం కిందకు రాదు" అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
కోపంలో లేదా ఆవేశంలో జీవిత భాగస్వామి అన్న మాటలు ఆత్మహత్య ప్రేరణ కిందకు రావని ధర్మాసనం స్పష్టం చేసింది. చనిపోయే ముందు ఆ వ్యక్తి రాసిన సూసైడ్ నోట్లో కూడా ఎక్కడా భార్య వేధింపుల వల్లే తాను చనిపోతున్నట్లు పేర్కొనలేదని, పైగా తన మరణానికి ఎవరూ బాధ్యులు కారని రాశారని కోర్టు గుర్తు చేసింది.
ఇదీ నేపథ్యం
ఈ దంపతులకు 1996 డిసెంబర్లో వివాహం జరిగింది. అయితే తన భార్య తమను బూతులు తిట్టేదని, భర్తపై దాడి చేసేదని అత్తమామలు ఆరోపించారు. ఆమెకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని, చెప్పకుండా రోజుల తరబడి బయట తిరిగేదని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. 2019 నవంబర్లో తీవ్ర ఒత్తిడికి లోనైన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై అత్తమామలు పోలీసులను ఆశ్రయించారు. అయితే తనను కూడా భర్త, అత్తమామలు శారీరకంగా, మానసికంగా వేధించారని ఆ మహిళ ఆరోపించారు. వాటన్నింటినీ పరిశీలించిన కోర్టు... కేవలం వైవాహిక కలతల వల్ల జరిగే ఆత్మహత్యలకు భాగస్వామిని బాధ్యులను చేయలేమని కేసు కొట్టేసింది.