రోజుకు 2.5జీబీ డేటా, అన్లిమిటెడ్ కాల్స్- బీఎస్ఎన్ఎల్ నుంచి మరో చౌకైన ప్లాన్..
బీఎస్ఎన్ఎల్ 'సిల్వర్ జూబ్లీ' ప్లాన్ విడుదలైంది. రోజుకు 2.5జీబీ డేటా, అన్లిమిటెడ్ కాల్స్ వంటివి ఇందులో ఉన్నాయి. ఈ ప్రత్యేక ఆఫర్ ధర, ఇతర వివరాలను పూర్తిగా ఇక్కడ తెలుసుకోండి..
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్).. తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ప్రత్యేక ప్రయోజనాలతో కూడిన 'సిల్వర్ జూబ్లీ' ప్లాన్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ వివరాలను ఇక్కడ వివరంగా తెలుసుకోండి..

బీఎస్ఎన్ఎల్ సిల్వర్ జూబ్లీ ప్లాన్ వివరాలు..
ఈ కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ అతి తక్కువ ధరకే కస్టమర్లకు రోజుకు 2.5జీబీ మొబైల్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలను అందిస్తుంది. గతంలో ప్రకటించిన సిల్వర్ జూబ్లీ ఎఫ్టీటీహెచ్ ప్లాన్కు అదనంగా ఈ ఆఫర్ ఇప్పుడు చేరింది.
బీఎస్ఎన్ఎల్ అందించిన వివరాల ప్రకారం, ఈ సిల్వర్ జూబ్లీ ప్లాన్ ధర రూ. 225. ఇది 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.
ఈ కాలంలో, కస్టమర్లు ఈ ప్రయోజనాలను పొందవచ్చు:
రోజువారీ డేటా: రోజుకు 2.5జీబీ 4జీ డేటా
వాయిస్ కాల్స్: అన్లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ వాయిస్ కాల్స్
ఎస్ఎంఎస్ ప్రయోజనాలు: రోజుకు 100
ఎఫ్యూపీ పరిమితి: ఫెయిర్ యూసేజ్ పాలసీ ప్రకారం, రోజువారీ కేటాయింపు కోటా పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ వేగం 40కేబీపీఎస్కి తగ్గిపోతుంది.
బీఎస్ఎన్ఎల్ సిల్వర్ జూబ్లీ ప్లాన్- ఆఫర్ ఎలా పొందాలి?
ఈ ఆఫర్ను పొందడానికి:
ఇప్పటికే ఉన్న కస్టమర్లు: బీఎస్ఎన్ఎల్ వెబ్ పోర్టల్ లేదా బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు.
కొత్త కస్టమర్లు: రిటైలర్లను లేదా బీఎస్ఎన్ఎల్ కామన్ సర్వీసెస్ సెంటర్లను సంప్రదించవచ్చు. ఈ సర్వీస్ సెంటర్లు సిమ్ కార్డు జారీ, బిల్ చెల్లింపులు, మొబైల్ రీఛార్జ్లు వంటి ప్రభుత్వ వినియోగ, ఇతర సేవలను అందించే యాక్సెస్ పాయింట్లుగా పనిచేస్తాయి.
బీఎస్ఎన్ఎల్ సిల్వర్ జూబ్లీ ఎఫ్టీటీహెచ్ ప్లాన్ (ఫైబర్)..
బీఎస్ఎన్ఎల్ ఇటీవల సిల్వర్ జూబ్లీ ఎఫ్టీాటీహెచ్ (ఫైబర్ టు హోమ్) ప్లాన్ను కూడా ప్రకటించింది.
ధర: నెలకు రూ. 625.
ప్రయోజనాలు: ఇది 70ఎంబీపీఎస్ వేగంతో 2500జీబీ హై-స్పీడ్ డేటాను అందిస్తుంది.
వినోదం: కస్టమర్లు 127 ప్రీమియం ఛానెల్లు సహా 600కు పైగా లైవ్ టీవీ ఛానెల్లను ఆస్వాదించవచ్చు.
ఓటీటీ ప్లాట్ఫారమ్లు: ఇందులో జియోహాట్స్టార్, సోనీలివ్ ఓటీటీ ప్లాట్ఫారమ్లకు సబ్స్క్రిప్షన్ కూడా ఉంటుంది.
ఈ ఏడాది ప్రారంభంలో కోల్పోయిన చందాదారుల సంఖ్యను తిరిగి పొందడం కోసం.. బీఎస్ఎన్ఎల్ ఇటీవలి నెలల్లో అనేక ప్రత్యేక ఆఫర్లను ప్రవేశపెట్టింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) విడుదల చేసిన టెలికాం సబ్స్క్రిప్షన్ డేటా ప్రకారం, ఏప్రిల్లో ఈ సంస్థ మొత్తం 0.2 మిలియన్ల చందాదారులను కోల్పోయింది. అదే సమయంలో, యాక్టివ్ బీఎస్ఎన్ఎల్ చందాదారులు 1.8 మిలియన్ల మేర తగ్గారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


