Budget 2026 : ఎస్టీటీ పెంపుతో స్టాక్​ మార్కెట్​లు క్రాష్​- ఆ స్టాక్స్​లో​ రక్తపాతం!

ఫ్యూచర్స్​ అండ్​ ఆప్షన్స్​కి సంబంధించి ఎస్టీటీని పెంచుతున్నట్టు నిర్మలా సీతారామన్​ తన బడ్జెట్​ 2026 ప్రసంగంలో ప్రకటించారు. ఫలితంగా స్టాక్​ మార్కెట్​లు క్రాష్​ అయ్యాయి. మరీ ముఖ్యంగా కొన్ని స్టాక్స్​ 10శాతం కన్నా ఎక్కువ నష్టపోయాయి.

Published on: Feb 1, 2026, 12:28:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కేంద్ర బడ్జెట్ 2026లో స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు, ముఖ్యంగా డెరివేటివ్స్ (ఎఫ్​ అండ్​ ఓ) ట్రేడర్లకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గట్టి షాక్ ఇచ్చారు. మార్కెట్‌లో మితిమీరిన ఊహాజనిత ట్రేడింగ్‌ను అరికట్టేందుకు సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ (ఎస్టీటీ)ని పెంచుతున్నట్లు ఆమె ప్రకటించారు. ఫలితంగా ఫ్యూచర్స్ అండ్​ ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేవారు ఇప్పుడు మునుపటి కంటే ఎక్కువ పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

నిర్మల సీతారామన్​ బడ్జెట్​ 2026 ప్రసంగం.. (Sansad TV)
నిర్మల సీతారామన్​ బడ్జెట్​ 2026 ప్రసంగం.. (Sansad TV)

తాజా పరిణామాల మధ్య దేశీయ స్టాక్​ మార్కెట్​లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి.

బడ్జెట్​ 2026- పెరిగిన పన్నుల వివరాలు..

ఫ్యూచర్స్: ఫ్యూచర్స్ ట్రేడింగ్‌పై ఎస్టీటీని 0.05 శాతానికి పెంచారు.

ఆప్షన్స్: ఆప్షన్స్ ట్రేడింగ్‌పై పన్నును ఏకంగా 0.15 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

ఈ పెంపునకు ముందు ఫ్యూచర్స్​పై ఎస్టీటీ 0.02శాతంగా ఉండేది. ఆప్షన్స్​పై ఎస్టీటీ 0.01శాతంగా ఉండేది. అంటే ఒకేసారి 50శాతం పెంచినట్టు.

ట్రేడింగ్ పరిమాణం ఎక్కువగా ఉండే భారీ ట్రేడర్లకు, తరచుగా బై అండ్​ సెల్​ చేసే స్కాల్పర్లకు ఈ తాజా ఎస్టీటీ పెంపు భారంగా మారనుంది. లాభాల్లో పన్ను వాటా పెరగడంతో నికర లాభం తగ్గే అవకాశం ఉంది.

ఎందుకు ఈ నిర్ణయం?

మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రిటైల్ ఇన్వెస్టర్లు ఎటువంటి అవగాహన లేకుండా ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్‌లో భారీగా నష్టపోతున్నారు. ఈ ధోరణిని అరికట్టేందుకు, స్వల్పకాలిక ట్రేడింగ్‌ను నిరుత్సాహపరిచి, దీర్ఘకాలిక పెట్టుబడులను ప్రోత్సహించేందుకే ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. అలాగే దీని ద్వారా ప్రభుత్వానికి అదనపు పన్ను ఆదాయం కూడా సమకూరనుంది.

“గతేడాది ఎస్టీటీని పెంచారు. ఇప్పుడు ఫ్యూచర్​ అండ్​ ఆప్షన్స్​పై మళ్లీ ఎస్టీటీని పెంచుతున్నట్టు నిర్ణయం తీసుకున్నారు. ఇది ట్రేడర్లు, ఇన్వెస్టర్లు, హెడ్జర్లపై అదనపు భారం వేస్తుంది. దీని వల్ల డెరివేటివ్స్​లో యాక్టివిటీ తగ్గొచ్చు. ఫలితంగా వాల్యూమ్స్​ పడిపోవచ్చు. అయితే, ఆదాయం పెంచుకునేందుకు కాకుండా, వాల్యూమ్స్​ని తగ్గించే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది,” అని కొటాక్​ సెక్యూరిటీస్​ ఎండీ అండ్​ సీఈఓ శ్రీపాల్​ షా తెలిపారు.

పన్నుల విషయంలో ఊరట లభిస్తుందని ఆశిస్తే.. కేంద్ర ఎస్టీటీని పెంచి షాక్​ ఇచ్చిందని రెలిగేర్​ బ్రోకింగ్​కి సంబంధించిన అజిత్​ మిశ్రా తెలిపారు.

“ఎస్టీటీ పెంపు వల్ల మార్కెట్​ సెంటిమెంట్​ నెగిటివ్​గా మారింది. డైలీ వాల్యూమ్స్​లో డెరివేటివ్స్​ సెగ్మెంట్​ కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు ఎస్టీటీని పెంచితే ట్రేడింగ్​ ప్రాఫిటెబులిటీ తగ్గిపోతుంది. యాక్టివ్​ ట్రేడర్లు తగ్గిపోతారు. దీని వల్ల లిక్విడిటీ తగ్గిపోతుంది,” అని ఆయన అన్నారు.

నష్టాల్లో స్టాక్​ మార్కెట్​లు..

నిర్మలా సీతారామన్​ ఎస్టీటీ ప్రకటన అనంతరం స్టాక్​ మార్కెట్​లు భారీ నష్టాల్లో ట్రేడ్​ అవుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాల సమయానికి నిఫ్టీ50 410 పాయింట్ల నష్టంతో 25,009 వద్ద కొనసాగుతోంది. బీఎస్​ఈ సెన్సెక్స్​ 1221 పాయింట్లు కోల్పోయి 81,345 వద్దకు చేరింది. బ్యాంక్​ నిఫ్టీ ఏకంగా 1.2శాతం నష్టాలతో 58,864 వద్ద ట్రేడ్​ అవుతోంది.

ఫ్యూచర్​ అండ్​ ఆప్షన్స్​పై ఎస్టీటీ పెంపు నిర్ణయంతో గ్రో, ఏంజిల్​ వన్​ వంటి బ్రోకరేజ్​ సంస్థలతో పాటు బీఎస్​ఈ స్టాక్ పతనమైంది.

ఏంజిల్​ వన్​, బీఎస్​ఈ షేర్లు 10శాతం నష్టాల్లోకి వెళ్లాయి. గ్రో షేర్లు 9శాతం మేర నష్టపోయాయి. ఐఐఎఫ్​ఎల్​ ఫైనాన్స్​ స్టాక్​ దాదాపు 5శాతం డౌన్​ అయ్యింది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More